పది స్థానాలపై పట్టు బిగించేలా!
రాష్ట్రంలోని పది లోక్సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్ కంట్మోనెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది.
కాంగ్రెస్ అధిష్ఠానం ప్రత్యేక కసరత్తు
పరిశీలకులుగా ఇతర రాష్ట్రాల నేతలకు బాధ్యతలు
ఈనాడు, హైదరాబాద్: రాష్ట్రంలోని పది లోక్సభ నియోజకవర్గాలతోపాటు, సికింద్రాబాద్ కంట్మోనెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టి సారించింది. ఆయా నియోజకవర్గాలకు ఇతర రాష్ట్రాల నేతలను ప్రత్యేక పరిశీలకులుగా నియమించింది. కేరళ, తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నేతలకు బాధ్యతలు అప్పగిస్తూ కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంగళవారం ఆదేశాలు జారీచేశారు.
బోసురాజుకు నిజామాబాద్, షఫీ పరంబిల్కు ఆదిలాబాద్
ఇప్పటికే పోలింగ్ పూర్తయిన కేరళ, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన నేతలను అధిష్ఠానం పరిశీలకులుగా రంగంలోకి దించింది. కేరళకు చెందిన సీనియర్ ఎమ్మెల్యే షఫీ పరంబిల్కు ఆదిలాబాద్ లోక్సభ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించింది. కర్ణాటక మంత్రి బోసురాజుతో పాటు అదే రాష్ట్రానికి చెందిన మంతర్ గౌడను నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గానికి, కేరళ రాష్ట్ర కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఏడుసార్లు ఎంపీగా నెగ్గిన కోడికున్నిల్ సురేశ్ను మెదక్ స్థానానికి పరిశీలకులుగా పంపింది. పరిశీలకుల నియామకం జరిగిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్ కచ్చితంగా గెలిచే అవకాశాలున్న స్థానాలతో పాటు, గట్టి పోటీని ఎదుర్కొంటున్నవీ ఉన్నాయి. ‘ప్రత్యర్థి పార్టీలైన భాజపా, భారాసలకు దీటుగా ప్రచారం నిర్వహించడంతోపాటు ఆయా స్థానాల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించే వ్యూహాల అమలును పరిశీలకులు పర్యవేక్షిస్తారు. ప్రధానంగా కాంగ్రెస్కు గట్టి పోటీ ఉన్న ఆదిలాబాద్, మెదక్, మల్కాజిగిరి, సికింద్రాబాద్ తదితర స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పనిచేసేలా పార్టీ శ్రేణులను ముందుకు నడిపించడం, ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలను, కాంగ్రెస్లో ఎప్పటి నుంచో పనిచేస్తున్నవారిని ఒకే తాటిపైకి తేవడం వంటి బాధ్యతలను నిర్వర్తిస్తారని’ పార్టీ వర్గాలు తెలిపాయి. ప్రధానంగా కర్ణాటక, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలతో సరిహద్దు ఉన్న లోక్సభ నియోజకవర్గాల్లో పక్క రాష్ట్రాలకు చెందిన ప్రజలను ఆకట్టుకునేలా ప్రచారం నిర్వహించే ప్రణాళికలను వీరు అమలుచేస్తారని వివరించారు.
అనుభవానికి పెద్దపీట
బోసురాజు గతంలో తెలంగాణకు ఏఐసీసీ కార్యదర్శిగా పనిచేశారు. రాష్ట్రంలో క్షేత్రస్థాయి నుంచి పార్టీ ఎలా ఉందనే అంశంలో మంచి అనుభవముంది. ఇటీవల రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ప్రచార వ్యూహాల అమలును పర్యవేక్షించిందీ ఈయనే. అలాగే కోడికున్నిల్ సురేశ్కు కేరళతోపాటు జాతీయ రాజకీయాల్లో అపార అనుభవముంది. గతంలో కేంద్ర మంత్రిగా, లోక్సభలో కాంగ్రెస్ చీఫ్విప్గా పనిచేశారు. మెదక్లో భాజపా, భారాస వ్యూహాలను తిప్పికొట్టి..పార్టీ అభ్యర్థిని గెలుపు దిశగా నడిపించే సత్తా ఉందనే భావనతో అయన్ను ఇక్కడ నియమించినట్లు తెలుస్తోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
ధోనీ ఆడటం చూడాలి.. ఇదంతా బీసీసీఐ చేతుల్లోనే..!: అంబటి రాయుడు
-
ఆ ముగ్గురి కనుసన్నల్లోనే దాడులు: మాజీ ఎంపీ కనకమేడల
-
ఈ ఎన్నికల్లో ఉత్తమ ఫొటో ఇదే: ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
-
ఫోన్ల రికవరీలో తెలంగాణది రెండోస్థానం: డీజీ మహేశ్ భగవత్
-
చైనాలో ఐఫోన్లపై యాపిల్ భారీ డిస్కౌంట్స్.. ఏడాదిలో రెండోసారి.. ఎందుకంటే?
-
స్టార్ హీరోయిన్ ఎదురుగా ఉన్నా.. తనపనిలో నిమగ్నమై: నెట్టింట్లో వైరల్గా డెలివరీ బాయ్