ప్రచారం వాడీ…వేడిగా
‘నాలుగు గడపలు తిరిగి.. రెండు కూడళ్లలో సమావేశాలు పూర్తి చేయగానే గొంతెండిపోతోంది. నెత్తి చెమటలు పడుతోంది.
సభలు, ర్యాలీల్లో ‘చెమటోడుస్తున్న’ అభ్యర్థులు
ఎండలకు రాలేమంటున్న పార్టీల కార్యకర్తలు
ఈనాడు - హైదరాబాద్
‘నాలుగు గడపలు తిరిగి.. రెండు కూడళ్లలో సమావేశాలు పూర్తి చేయగానే గొంతెండిపోతోంది. నెత్తి చెమటలు పడుతోంది. ఇదేందిరా భయ్.. ఎన్నికల్లో గెలుపేమో కానీ, ఈ ఎండలకు తట్టుకునేటట్లు లేం..’ అంటూ కొందరు అభ్యర్థులు తలలు పట్టుకుంటున్నారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత తారస్థాయికి చేరడంతో లోక్సభ ఎన్నికల అభ్యర్థులు ప్రచార షెడ్యూల్ పూర్తి చేయలేకపోతున్నారు. ‘ఉదయం 10 గంటల తరువాత మేం రాలేం..’ అంటూ పార్టీల శ్రేణులు సైతం ప్రచారానికి దూరంగా ఉంటున్నారు. పొద్దున, సాయంత్రం తప్ప ఎండకు రామంటూ తెగేసి చెబుతున్నారు. రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తీసుకొచ్చినా.. ‘నడినెత్తికి సూరీడు వచ్చాక నీడపట్టు నుంచి కదలం’ అంటున్నారని పలు పార్టీల క్యాంపెయిన్ నిర్వాహకులు నిట్టూరుస్తున్నారు. ప్రచారంలో ప్రత్యర్థుల కన్నా ఒకడుగు ముందే ఉండేందుకు అభ్యర్థులు తమదైన వ్యూహాలను సిద్ధం చేస్తున్నా.. ఉష్ణోగ్రతలు 46 డిగ్రీలను తాకుతుండటంతో వారి ఎత్తులు చిత్తవుతున్నాయి.
వాతావరణ సూచనలపై ఆరా..
రాష్ట్రంలో ఎండల తీవ్రతతోపాటు వడగాలులు, ఆకస్మిక వర్షాలు కొనసాగుతుండటంతో అభ్యర్థులు వాతావరణ సూచనలు పాటిస్తున్నారు. ‘రేపటి వాతావరణం గురించి కనుక్కో.. దూరం వెళ్దామా.. దగ్గరలోనే తిరిగొద్దామా అనేది నిర్ణయించుకుందాం’ అంటూ వ్యక్తిగత సిబ్బందిని రోజూ ఆరా తీస్తున్నారు. చాలాచోట్ల సాయంత్రం 4 గంటల తరువాతే ప్రచారం ఉద్ధృతమవుతోంది. అవసరమైతే రాత్రి 10 గంటల వరకు ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. తెల్లవారుజామునే గ్రామాలకు చేరుకొని సమావేశాలు పెడుతున్నారు. మేడ్చల్ మల్కాజిగిరి, నల్గొండ, భువనగిరి, కరీంనగర్ నియోజకవర్గాల పరిధిలో కీలక నాయకులు సాయంత్రం తరువాతే ప్రచార కార్యక్రమాల్లో కనిపిస్తున్నారు. చల్లటి మజ్జిగ, నీళ్ల ప్యాకెట్లు అభ్యర్థుల ప్రచార కాన్వాయ్లో తప్పనిసరయ్యాయి.
పెరిగిన వాహనాల సంఖ్య..
ఎండల తీవ్రతతో పార్టీలకు ప్రచార దళాలను తరలించడం ఆర్థికంగా భారమవుతోంది. ఉదయాన్నే కార్యకర్తలను తీసుకుని రావడం, మధ్యాహ్నం ఊర్లలో ఇంటి వద్ద దించేయడం, సాయంత్రం మళ్లీ తీసుకొచ్చి పంపించడానికి వాహనాల ఖర్చు తడిసి మోపెడవుతోందని పలువురు నాయకులు వాపోతున్నారు. దీంతో అభ్యర్థులు కిలోమీటర్ల మేర పాదయాత్రలు చేయకుండా ఎక్కడికక్కడే ప్రచారం చేయాల్సి వస్తోందని క్యాంపెయిన్ నిర్వాహకులు(రూట్ ప్లానర్లు) పేర్కొంటున్నారు. అలాగే భానుడి ప్రతాపంతో అభ్యర్థులు కొందరు మధుమేహం, అధిక రక్తపోటు ఇతర ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. దీంతో ప్రచారంలో ఎక్కువసేపు పాల్గొనలేకపోతున్నారు. మా నాయకుడు గంట ప్రచారం చేస్తే మరో గంటపాటు ఏసీ వాహనంలో కూర్చుని సేదదీరాల్సి వస్తోందంటూ ఓ పార్టీ నేత ఆవేదన వెలిబుచ్చుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
ఆరు నెలల్లో పీవోకే విలీనం ఖాయం..: సీఎం యోగి
-
‘మీ రాష్ట్రాల సంగతి చూసుకోండి’: ఆ సీఎంలకు నవీన్ పట్నాయక్ కౌంటర్
-
అఫ్గాన్లో వరదల బీభత్సం.. 68 మంది మృతి..!
-
‘50-60 ఏళ్ల క్రితం నేను ఇల్లు వదిలి వెళ్లినప్పుడు.. ఇలా అనుకోలేదు’: మోదీ కీలక వ్యాఖ్యలు
-
ఆ విషయంలో నేను ఫెయిల్ అయ్యానేమో: సుధీర్ బాబు
-
పల్నాడులో హింసాత్మక ఘటనలపై భారీగా కేసులు నమోదు