కులం చూసి.. టికెట్ కేటాయింపు!
అభ్యర్థుల ఎంపికలో తాము వారి కులాలకు ప్రాధాన్యమివ్వలేదనేది రాజకీయ పార్టీలు తరచూ చెప్పే మాట! కానీ అందులో వాస్తవం లేదంటున్నారు విశ్లేషకులు.
గుజరాత్లో అభ్యర్థుల ఎంపికలో ఇప్పటికీ అదే కీలకాంశం
అహ్మదాబాద్: అభ్యర్థుల ఎంపికలో తాము వారి కులాలకు ప్రాధాన్యమివ్వలేదనేది రాజకీయ పార్టీలు తరచూ చెప్పే మాట! కానీ అందులో వాస్తవం లేదంటున్నారు విశ్లేషకులు. ముఖ్యంగా గుజరాత్లో టికెట్ల కేటాయింపులో సామాజిక సమీకరణాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని చెబుతున్నారు. నగరీకరణ ఫలితంగా రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కులపరమైన గుర్తింపునకు ప్రాధాన్యం తగ్గినా ఇప్పటికీ ఈ పరిస్థితి ఉండటం కొంత ఆందోళనకరమని పేర్కొంటున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అధిక పట్టింపు
ప్రధానంగా గ్రామీణ గుజరాత్లోని స్థానాలకు అభ్యర్థులను ఎంపిక చేయడంలో పార్టీలు కుల సమీకరణాలను పరిగణనలోకి తీసుకోక తప్పని పరిస్థితులు ఉన్నాయని భావ్నగర్ విశ్వవిద్యాలయం మాజీ ఉప కులపతి, సామాజిక శాస్త్రవేత్త విద్యుత్ జోషి అన్నారు. ‘‘కులం ఒక గుర్తింపు. అభ్యర్థుల ఎంపికలో పార్టీలు దాన్ని కచ్చితంగా పరిగణనలోకి తీసుకుంటుంటాయి. సాధారణంగా గ్రామీణ ఓటర్లు తమ వర్గానికి చెందిన అభ్యర్థులకు ఓటేసేందుకే ప్రాధాన్యమిస్తుంటారు. నాయకులు తమ కులం వారైతే.. ఎన్నికలయ్యాక ఏదైనా పని కోసం వారిని సంప్రదించడం తేలికవుతుందని వారు భావిస్తుంటారు’’ అని ఆయన పేర్కొన్నారు.
హిందుత్వ ఎజెండాతో భాజపా
మధ్య, దక్షిణ గుజరాత్ల్లోని అహ్మదాబాద్, వడోదరా వంటి పట్టణ ప్రాంతాల్లో కుల ప్రభావం క్రమంగా తగ్గుముఖం పడుతోందని వడోదరాలోని ఎం.ఎస్.యూనివర్సిటీలో రాజనీతి శాస్త్రం ప్రొఫెసర్గా పనిచేస్తున్న అమిత్ ఢోలకియా తెలిపారు. సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ వంటి గ్రామీణ ప్రాంతాల్లో మాత్రం అది చాలా ప్రభావశీల అంశంగా కొనసాగుతోందని వివరించారు. అయితే రాష్ట్రంలో కుల సమీకరణాలపై ఆధారపడకుండా హిందుత్వ ఎజెండాతో గంపగుత్తగా ఓట్లు రాబట్టుకునేందుకు భాజపా ప్రయత్నిస్తోందని చెప్పారు. కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)లతో కూడిన విపక్ష ఇండియా కూటమి మాత్రం కుల సమీకరణలతోనే కమలదళ వ్యూహాన్ని దెబ్బకొట్టొచ్చని భావిస్తోందని వివరించారు.
‘గెలిచే సమర్థతే ముఖ్యం’
టికెట్ల కేటాయింపులో కులానికి ప్రాధాన్యమిచ్చే అంశంపై గుజరాత్ భాజపా అధికార ప్రతినిధి యామల్ వ్యాస్ స్పందిస్తూ.. ‘‘అభ్యర్థుల ఎంపికలో మేం సమతుల్యత పాటిస్తుంటాం. కులాలకు అధిక ప్రాధాన్యమేమీ ఇవ్వం. పార్టీ పట్ల అభ్యర్థి విధేయత, గెలవగల సమర్థత, విద్యార్హతల వంటివాటిని పరిగణనలోకి తీసుకుంటుంటాం’’ అని చెప్పారు. రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీశ్ దోషీ మాట్లాడుతూ.. టికెట్ల కేటాయింపులో కులాలకు ప్రాధాన్యం లేకుండా చూడాల్సిన బాధ్యత ఓటర్లదేనని పేర్కొన్నారు. అధిక విద్యార్హతలు, సేవ చేయాలనే తపన ఉన్న అభ్యర్థులను వారు ఓడిస్తే.. కులం వంటి ఇతర సమీకరణాల వైపు పార్టీలు చూడక తప్పదని వివరించారు. ఎన్నికల్లో విజయం సాధించగల సమర్థతే అన్నింటికంటే ముఖ్యమని పేర్కొన్నారు. భారత మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ టి.ఎన్.శేషన్ కాంగ్రెస్ తరఫున గాంధీనగర్ స్థానం నుంచి 1999 లోక్సభ ఎన్నికల బరిలో దిగి పరాజయం పాలైన సంగతిని ఆయన గుర్తుచేశారు. నాడు శేషన్ భాజపా అగ్రనేత ఎల్.కె.ఆడ్వాణీ చేతిలో ఓడిపోయారు.
గుజరాత్లో భాజపా ఈ దఫా పాటీదార్ వర్గానికి చెందిన ఆరుగురికి టికెట్లు ఇచ్చింది. ఓబీసీలను ఏడు స్థానాల్లో బరిలో దింపింది. ఇండియా కూటమి కూడా ఆరుగురు పాటీదార్లను పోటీలో నిలిపి, ఏడుగురు ఓబీసీలకు టికెట్లు కేటాయించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
-
స్థిరాస్తి రంగానికి రాష్ట్ర ప్రభుత్వం తోడ్పాటు: తెలంగాణ మంత్రి శ్రీధర్బాబు
-
బౌలర్ల భవిష్యత్తు కాపాడండి.. అందుకు ఇలా చేయండి: అనిల్ కుంబ్లే
-
వరల్డ్ ‘సూపర్-రిచ్’లో 15 మంది.. జాబితాలో అదానీ
-
యూఏఈ నుంచి ఇక ‘బ్లూ రెసిడెన్సీ వీసా’.. ఎవరికంటే..?
-
టెండర్లలో 1.5 శాతం ఆయనకు ఇవ్వాల్సిందే: ఈడీ