PM Modi: రంజాన్ నెలలో బాంబింగ్ ఆపాలని ఇజ్రాయెల్కు చెప్పాను: మోదీ
రంజాన్ మాసంలో గాజాపై బాంబింగ్ ఆపాలని తాను ఇజ్రాయెల్ను కోరినట్లు ప్రధాని మోదీ చెప్పారు.
ఇంటర్నెట్డెస్క్: పవిత్ర రంజాన్ మాసంలో గాజాపై వైమానిక దాడులను నిలిపివేయాలని తన ప్రతినిధి ద్వారా ఇజ్రాయెల్కు సందేశం పంపానని ప్రధాని మోదీ (PM Modi) తెలిపారు. ఆయన ఓ హిందీ ఛానల్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘రంజాన్ మాసంలో నా ప్రత్యేక ప్రతినిధిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు వద్దకు పంపించాను. ఆ పవిత్రమాసంలో బాంబింగ్ చేయవద్దన్న నా సందేశాన్ని ఆయనకు చేరవేశాడు. వారు కూడా దానిని పాటించడానికే యత్నించారు. కానీ, చివరి రెండు మూడు రోజుల్లో ఘర్షణ జరిగింది. ముస్లింల అంశాలపై తనను ఇబ్బంది పెట్టినా.. ఇటువంటి విషయాలను వెంటనే బహిర్గతం చేయను’’ అని వెల్లడించారు.
తనలానే పలు దేశాలు కూడా బాంబింగ్ ఆపించే దిశగా ఇజ్రాయెల్తో మాట్లాడేందుకు ప్రయత్నాలు చేశాయని వెల్లడించారు. వాళ్లకు ఫలితాలేమైనా వచ్చి ఉండొచ్చని.. తాను మాత్రం ప్రయత్నించినట్లు చెప్పారు. ఇక పాలస్తీనా, ఇజ్రాయెల్ పర్యటనల విషయంలో కూడా తాను మార్పు తెచ్చినట్లు పేర్కొన్నారు. ‘‘గతంలో ఇజ్రాయెల్ పర్యటనకు వెళితే.. పాలస్తీనాకు కూడా వెళ్లడం తప్పనిసరి. సెక్యూలరిజం చూపించుకుని.. తిరిగి వచ్చేవారు. కానీ అలా చేయడానికి నేను నిరాకరించాను. ఒక సారి నేను జోర్డాన్ గగనతలం పై నుంచి పాలస్తీనాకు వెళుతున్న విషయం తెలుసుకుని ఆ దేశ రాజు నాతో మాట్లాడారు. మోదీజీ అలా వెళ్లకూడదు.. మీరు నా అతిథి. నా హెలికాప్టర్ వాడుకోవచ్చు అని చెప్పారు’’ అని ప్రధాని తెలిపారు. నాడు పాలస్తీనా పర్యటనకు జోర్డాన్ రాజు హెలికాప్టర్లో వెళ్లగా.. ఇజ్రాయెల్ విమానాలు దానికి రక్షణ కల్పించాయని గుర్తు చేసుకున్నారు.
ఈ ఇంటర్వ్యూలో మోదీ పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఎన్డీయే కూటమి 400 సీట్లు సాధిస్తుందంటూ భాజపా నేతలు ధీమా వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. దీన్ని మోదీ ప్రస్తావిస్తూ.. 400 సీట్లు గెలుస్తామని ప్రజలే మాలో విశ్వాసం నింపారన్నారు. వాళ్ల దృక్పథం తనకు తెలుసన్నారు. ఇక హిందూ-ముస్లిం రాజకీయాలంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని తిప్పికొట్టారు. వారి బుజ్జగింపు రాజకీయాలను బయటపెడుతున్నందుకే తనపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
వారి సేవలు మరో రూపంలో వినియోగించుకుంటాం: చంద్రబాబు
తెలుగుదేశం సీనియర్ నేతలు, పలువురు మంత్రులు సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబుని కలిశారు. -
ఐటీ, ఎలక్ట్రానిక్ కంపెనీలను ఆకర్షిస్తాం: మంత్రి నారా లోకేశ్
వచ్చే ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాల హామీ నెరవేర్చేందుకు కృషి చేస్తామని ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. -
తెదేపా ఏపీ అధ్యక్షుడిగా పల్లా శ్రీనివాసరావు?
తెదేపా (TDP) రాష్ట్ర అధ్యక్షుడిగా గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు పేరును ఆ పార్టీ పరిశీలిస్తోంది. -
పవన్కు పంచాయతీరాజ్... అనితకు హోంశాఖ.. ఏపీలో మంత్రులకు కేటాయించిన శాఖలివే!
Andhra Pradesh Cabinet Portfolios: ఆంధ్రప్రదేశ్ మంత్రులకు సీఎం చంద్రబాబు నాయుడు శాఖలు కేటాయించారు. -
తప్పు చేసిన అధికారులను విడిచిపెట్టం: గోరంట్ల బుచ్చయ్య చౌదరి
ఇచ్చిన మాట ప్రకారం పింఛన్ సాయాన్ని సీఎం చంద్రబాబు పెంచారని తెదేపా ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి అన్నారు. -
వయనాడ్ను వదులుకోనున్న రాహుల్.. ఉప ఎన్నికల్లో ప్రియాంక గాంధీ పోటీ..?
Priyanka Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా ప్రత్యక్ష ఎన్నికల్లో అరంగేట్రానికి రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గెలిచిన వయనాడ్ స్థానం నుంచి ఆమె పోటీ చేసే అవకాశాలున్నట్లు సమాచారం. -
జూనియర్లకు మంత్రి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం: అయ్యన్నపాత్రుడు
‘జూనియర్లకూ మంత్రులుగా పనిచేసే అవకాశం ఇవ్వాలి. వారికి పదవులివ్వడాన్ని ఆహ్వానిస్తాం. సీనియర్లుగా ప్రోత్సహిస్తాం, అండగా ఉంటాం’ అని నర్సీపట్నం ఎమ్మెల్యే, మాజీ మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు చెప్పారు. -
దొంగే.. దొంగా దొంగా అన్నట్లుగా వైకాపా తీరు: ఎమ్మెల్యే రఘురామ
‘దొంగే.. దొంగా దొంగా అన్నట్లు ఉంది వైకాపా నేతల తీరు. ఎవరూ ఎవరినీ ఏమీ అనకముందే వారిని కొట్టారంటూ దిల్లీలో విజయసాయిరెడ్డి పెడబొబ్బలు పెడుతున్నారు. -
చంద్రబాబు దార్శనికత రాష్ట్రానికి అవసరం
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన చంద్రబాబుకు సామాజిక మాధ్యమాల్లో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు, సామాజికవేత్తలు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ ఎక్స్లో పోస్టు చేశారు. -
హింసాత్మక ఘటనలకు వైకాపా వాళ్లే బాధ్యులు
పల్నాడు జిల్లాలో తోట చంద్రయ్య, కంచర్ల జల్లయ్య సహా అనేక మంది తెదేపా కార్యకర్తల్ని కిరాతకంగా చంపడం దారుణం కాదా? అని తెదేపా ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ ప్రశ్నించారు. -
ప్రజాపాలన మొదలు.. సీఎంగా చంద్రబాబు రాకతో మంచిరోజులు
ముఖ్యమంత్రిగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించడంతో రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ వచ్చిందని తెదేపా సీనియర్ నేతలు వర్ల రామయ్య, టీడీ జనార్దన్ తెలిపారు. -
పింఛన్ల పెంపు గొప్ప విషయం: రామకృష్ణ
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబును సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గురువారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
మెగా డీఎస్సీపై తొలి సంతకం హర్షణీయం
ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తన తొలి సంతకాన్ని మెగా డీఎస్సీపై చేయడాన్ని హర్షిస్తూ తెదేపా ఎమ్మెల్సీలు భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి, వేపాడ చిరంజీవిరావు, కంచర్ల శ్రీకాంత్లు చంద్రబాబుకు ధన్యవాదాలు తెలిపారు. -
ఎన్నికల ఫలితాలపై భాజపా సమీక్ష
వచ్చే నెల నుంచి పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి పెట్టాలని భాజపా రాష్ట్ర శాఖ నిర్ణయించింది. ఆ పార్టీ పోటీ చేసిన శాసనసభ, లోక్సభ స్థానాల వారీగా విజయవాడలోని పార్టీ కార్యాలయంలో గురువారం సమీక్షలు జరిగాయి. -
విజయసాయి విచారణ ఎదుర్కోవాల్సిందే: బుద్దా వెంకన్న
ఉత్తరాంధ్రను దోచుకున్న వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డిని వదిలే ప్రసక్తే లేదని, సమగ్ర విచారణ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెదేపా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి బుద్దా వెంకన్న హెచ్చరించారు. -
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టి కృషి
రాష్ట్ర ఉజ్వల భవిష్యత్తుకు సమష్టిగా కృషి చేద్దామని జనసేన నాయకులకు మంత్రి నాదెండ్ల మనోహర్ పిలుపునిచ్చారు. ఏపీ పునర్నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని గురువారం సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో కోరారు. -
మహారాష్ట్రపై పట్టుకు గట్టి ప్రయత్నం
మహారాష్ట్రపై పూర్తి పట్టు సాధించేందుకు తమ పార్టీ ప్రయత్నిస్తున్నట్లు ఎన్సీపీ (ఎస్పీ) అధినేత శరద్ పవార్ గురువారం తెలిపారు. -
మాది చేతల ప్రభుత్వమని నిరూపించాం
ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగానే ఒకే రోజు ఐదు ఫైళ్లపై సంతకాలు చేసి తమది మాటలు చెప్పే ప్రభుత్వం కాదని నిరూపించామని మంత్రులు నిమ్మల రామానాయుడు, డోలా శ్రీబాలవీరాంజనేయస్వామి, ఎస్.సవిత అన్నారు. -
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరిస్తాం
పాలనపై ప్రజల్లో నమ్మకాన్ని పునరుద్ధరించాల్సిన బాధ్యత అందరిపై ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. సీఎంగా బాధ్యతలు స్వీకరించడంపై ఎక్స్ వేదికగా గురువారం ఆయన స్పందించారు. -
రాజ్యసభ బరిలో సునేత్రా పవార్
మహారాష్ట్రలోని బారామతి నుంచి లోక్సభ ఎన్నికల బరిలో దిగి ఓడిపోయిన సునేత్రా పవార్ (ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ భార్య) రాజ్యసభ ఎన్నికల బరిలో దిగారు. -
కళ్లు మూసుకుంటే ఐదేళ్లూ గడిచిపోయాయి
అలా కళ్లు మూసుకుంటే 2019 నుంచి 2024 వరకు ఐదేళ్లు ఇట్టే గడిచిపోయాయి. అలాగే ఇప్పుడూ కళ్లు మూసుకుంటే 2029 వచ్చేస్తుంది. అప్పుడు మనదే అధికారం.
తాజా వార్తలు (Latest News)
-
‘ధరణి’ పోర్టల్ ప్రక్షాళన దిశగా చర్యలు చేపట్టాం: మంత్రి పొంగులేటి
-
ఎన్సీపీ లక్ష్యంగా ఆర్ఎస్ఎస్ వ్యాఖ్యలు.. అజిత్ పవార్ ఏమన్నారంటే..!
-
ఖాళీ థియేటర్లో ఫరియా.. మిర్నా మేనన్ ‘రెడ్ అలర్ట్’
-
టీ20 ప్రపంచకప్ ‘సూపర్-8’ పోరు.. భారత్ను ఢీకొట్టే జట్లు ఇవే..!
-
లైంగిక వేధింపుల కేసు.. యడియూరప్పకు ఊరట
-
కొవిడ్ అడ్వాన్స్ నిలిపివేత.. ఈపీఎఫ్ఓ నిర్ణయం