చిన్న నియోజకవర్గాల్లో పెద్ద పోరు
దేశంలోని అతి చిన్న నియోజకవర్గాల్లో ఉన్న దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్లలో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది.
ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే..
దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్లలో మూడో విడతలో పోలింగ్
దేశంలోని అతి చిన్న నియోజకవర్గాల్లో ఉన్న దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్లలో మూడో విడతలో భాగంగా ఈ నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. దాదర్ నగర్ హవేలీ, దమణ్, దీవ్ కేంద్ర పాలిత ప్రాంతంగా ఉన్నా ఇక్కడ దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్ పేరుతో రెండు లోక్సభ నియోజకవర్గాలున్నాయి. ఇందులో దాద్రా నగర్ను ఎస్టీలకు రిజర్వు చేశారు. ఇక్కడ ఎన్డీయే, ఇండియా కూటముల మధ్యే ప్రధాన పోరు సాగుతోంది.
- దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్ 1,483 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండే చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. ఇది లక్షద్వీప్ తర్వాత దేశంలోనే రెండో అత్యంత చిన్న కేంద్ర పాలిత ప్రాంతం. అతి తక్కువ జనాభా ఉన్న ప్రాంతంగా ఇది నిలుస్తోంది.
- దాద్రా నగర్ హవేలీ జనాభా నాలుగు లక్షల వరకూ ఉంటుంది. ఇక్కడ చదరపు కిలోమీటరుకు 700 మంది ఉంటారు. ప్రతి వేయి మంది పురుషులకు 774 మంది మహిళలే ఉన్నారు. ఇక్కడ అక్షరాస్యత 76.2 శాతం.
2020లో విలీనం
దాద్రా నగర్ హవేలీ, దమణ్ దీవ్లను విలీనం చేస్తూ 2019 జులైలో పార్లమెంటు బిల్లును ఆమోదించింది. 2020 జనవరి 26 నుంచి ఈ కేంద్ర పాలిత ప్రాంతం అమల్లోకి వచ్చింది. ఇందులో దాద్రా, నగర్ హవేలీ, దమణ్, దీవ్ అనే నాలుగు ప్రాంతాలుంటాయి. ఇవన్నీ గతంలో పోర్చుగీస్ ఆధీనంలో ఉండేవి. పణజీ రాజధానిగా ఉండేది. 1987 వరకూ గోవా, దమణ్ దీవ్ పాలనలో ఉండేవి. కొంకణీ భాషోద్యమం మొదలయ్యాక గోవాను ప్రత్యేక రాష్ట్రంగా కేంద్రం ప్రకటించింది.
తిరుగులేని స్వతంత్ర అభ్యర్థి విషాదాంతం
దాద్రా నగర్ హవేలీ నుంచి మోహన్భాయ్ సంజీభాయ్ దేల్కర్ ఏడు సార్లు ఎంపీగా గెలిచారు. 1989 నుంచి 2004 వరకూ, ఆ తర్వాత 2019లో విజయం సాధించారు. ఆ తర్వాత ఆయన ముంబయిలో ఆత్మహత్య చేసుకున్నారు.ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ ఎక్కువసార్లు గెలిచింది. స్వతంత్ర అభ్యర్థి కూడా పలుమార్లు విజయం సాధించారు.
- ఈసారి మోహన్భాయ్ సతీమణి కళాబెన్ దేల్కర్ను పార్టీలో చేర్చుకుని భాజపా టికెటిచ్చింది. అజిత్ రాంజీభాయ్ మహ్లా కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు.
- భర్త మరణం అనంతరం ఉప ఎన్నికల్లో కళాబెన్ శివసేన తరఫున పోటీ చేసి విజయం సాధించారు. ఆమెకు సానుభూతివల్ల 51,269 ఓట్ల మెజారిటీ వచ్చింది. ఈసారి ఆమెను భాజపా తమ పార్టీలో చేర్చుకుని మరీ టికెట్ కేటాయించింది.
చిన్నదైనా ప్రతిష్ఠాత్మకమే
భారత వాయవ్య ప్రాంతంలో గుజరాత్, మహారాష్ట్రల మధ్యన ఉండే దమణ్ దీవ్ అతి చిన్న నియోజకవర్గం. దీని విస్తీర్ణం 112 చదరపు కిలోమీటర్లే. ఇందులో రెండు జిల్లాలున్నాయి. వ్యవసాయం, అటవీ ఉత్పత్తులు, పర్యాటక పరిశ్రమ ఇక్కడ ప్రధాన జీవనాధారాలు. జనాభా దాదాపు 3 లక్షలు.
ఇక్కడ కాంగ్రెస్, భాజపా మధ్యే పోరు సాగుతుంటుంది. ఇక్కడ 9సార్లు ఎన్నికలు జరిగాయి. తొలుత కాంగ్రెస్ ఆధిపత్యం చెలాయించినా ఆ తరువాత భాజపా పట్టు సాధించింది. కాంగ్రెస్, భాజపాల మధ్య విజయం దోబూచులాడుతూ వస్తోంది. 2019లో భాజపా అభ్యర్థి లాలూభాయ్ పటేల్ గెలిచారు. మళ్లీ లాలూభాయ్నే భాజపా తమ అభ్యర్థిగా నిలిపింది. కాంగ్రెస్ నుంచి కేతన్ దయాభాయ్ పటేల్ బరిలో ఉన్నారు.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
పుతిన్ పర్యటన వేళ.. చైనాకు జెలెన్స్కీ అభ్యర్థన
-
మోదీ వ్యాఖ్యలపై ఈసీ చర్యలు తీసుకోవాలి: మల్లికార్జున్ ఖర్గే
-
రీడర్స్ డైజెస్ట్.. యూకేలో ముగిసిన 86 ఏళ్ల ప్రయాణం
-
చైనా సైబర్ ముఠా చేతిలో ఏపీ వాసులు.. ఉద్యోగాల పేరుతో ఏజెంట్ల మోసం
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా