కీలక నేతలకు అగ్ని పరీక్ష
కీలక నేతలు బరిలో నిలిచిన మూడోవిడత పోలింగ్ ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7న 93 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 9 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు.
మూడో విడత బరిలో కొందరికి కష్టం.. కొందరికి సులభం
కీలక నేతలు బరిలో నిలిచిన మూడోవిడత పోలింగ్ ఆసక్తికరంగా మారింది. దేశవ్యాప్తంగా ఈ నెల 7న 93 స్థానాలకు ఎన్నికలు జరగనుండగా వాటిలో 9 నియోజకవర్గాల్లో ఆయా పార్టీల్లోని అగ్రనేతలు పోటీలో ఉన్నారు. వారిలో ఒకరిద్దరు మినహా మిగిలినవారి స్థానాల్లో గట్టిపోటీ నెలకొంది. అవేమిటో చూద్దాం..
శివరాజ్ సింగ్ చౌహాన్
మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ 20ఏళ్ల తర్వాత లోక్సభ ఎన్నికల బరిలో దిగుతున్నారు. భాజపాకు కంచుకోట అయిన విదిశలో ఆయన పోటీ చేస్తున్నారు. ఆయన విజయం నల్లేరుపై నడకే కానుంది. నియోజకవర్గంపై ఆయనకు గట్టి పట్టుంది.
దిగ్విజయ్ సింగ్
గత ఎన్నికల్లో భోపాల్లో పోటీ చేసి ఓడిపోయిన కాంగ్రెస్ అగ్ర నేత దిగ్విజయ్ సింగ్ ఈసారి తన సొంత గడ్డ రాజ్గఢ్ నుంచి బరిలోకి దిగారు. కొన్ని దశాబ్దాల తర్వాత ఆయన ఇక్కడికి వచ్చారు. 2009లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. 2014, 2019లలో భాజపా విజయం సాధించింది. గత ఎన్నికల్లో భాజపా 4లక్షలకుపైగా మెజారిటీతో గెలిచింది. దీంతో దిగ్విజయ్ సింగ్కు ఇది కష్టతరంగానే ఉంది. అయినా ఆయన తనకున్న పరిచయాలతో గట్టిగా పోరాడుతున్నారు.
అమిత్ షా
గత ఎన్నికల్లో సాధించిన 5.55 లక్షల మెజారిటీని దాటాలని గుజరాత్లోని గాంధీనగర్ నుంచి మరోసారి పోటీ చేస్తున్న కేంద్ర హోం మంత్రి అమిత్ షా భావిస్తున్నారు. కాంగ్రెస్ తరఫున సోనాల్ పటేల్ బరిలోకి దిగారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన సీజే చావ్డా ప్రస్తుతం భాజపాలో ఉన్నారు. 1989 నుంచి భాజపా ఇక్కడ గెలుస్తూ వస్తోంది. గతంలో ఇక్కడి నుంచి వాజ్పేయీ, ఆడ్వాణీ ప్రాతినిధ్యం వహించారు. ఈ నియోజకవర్గంలోనే ప్రధాని మోదీ ఓటరుగా ఉన్నారు. 30ఏళ్లుగా తాను గాంధీనగర్ నుంచే శాసనసభ్యుడిగా, పార్లమెంటు సభ్యుడిగా ఉన్నానని, రూ.22,000 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టానని అమిత్ షా తెలిపారు. గత రెండు లోక్సభ ఎన్నికల్లో గుజరాత్లోని మొత్తం 26 సీట్లను గెలుచుకున్న భాజపా ఈసారీ గెలిచి హ్యాట్రిక్ కొట్టాలని చూస్తోంది. గాంధీనగర్లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ప్రస్తుతం భాజపానే ప్రాతినిధ్యం వహిస్తోంది.
ప్రహ్లాద్ జోషి
ఇప్పటికే మూడు సార్లు గెలిచిన భాజపా నేత ప్రహ్లాద్ జోషి నాలుగోసారి కర్ణాటకలోని ధార్వాడ నుంచి పోటీ చేస్తున్నారు. ఆయన కాంగ్రెస్ కొత్త అభ్యర్థి వినోద్ అసూటీతో తలపడుతున్నారు. కేంద్ర మంత్రిగా పని చేసిన జోషికి ఈ ఎన్నికల్లోనూ అనుకూల వాతావరణమే కనిపిస్తోంది.
జ్యోతిరాదిత్య సింధియా
కాంగ్రెస్ నుంచి వచ్చిన జ్యోతిరాదిత్య సింధియాకు కేంద్ర మంత్రి పదవి ఇచ్చిన భాజపా.. మధ్యప్రదేశ్లోని గుణలో ఆయననే అభ్యర్థిగా నిలిపింది. రాజ కుటుంబం నుంచి వచ్చిన ఆయన 2019లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసి లక్షకుపైగా తేడాతో తొలిసారి ఓడిపోయారు. ఆ తర్వాత భాజపాలో చేరారు. ఈసారి ఆయన ఒకప్పటి భాజపా అగ్ర నేత, 2023లో కాంగ్రెస్లో చేరిన రావ్ యాదవేంద్ర సింగ్ యాదవ్తో తలపడుతున్నారు. ఈ ఎన్నిక ఆయనకు అత్యంత ప్రతిష్ఠాత్మకం. గుణలో గెలిచి రాజ కుటుంబం పట్టును నిలుపుకోవాలని ఆయన చూస్తున్నారు.
సుప్రియా సూలే
మహారాష్ట్రలో తన జీవితంలోనే అత్యంత కఠిన పరీక్షను శరద్ పవార్ ఎదుర్కొంటున్నారు. తమ కంచుకోట బారామతిలో కుమార్తె సుప్రియా సూలేపై అజిత్ పవార్ సతీమణి సునేత్రా పవార్ పోటీకి దిగడంతో పోరు రసవత్తరంగా మారింది. ఈ ఎన్నికతో ప్రజలు శరద్ పవార్ వెంటా, అజిత్ పవార్ వెంటా అనేది తేలనుంది. సుప్రియా సూలే కొత్త గుర్తుతో పోటీ చేస్తుండటం పోటీని మరింత కఠినంగా మార్చింది. 2009 నుంచి ఇక్కడ సుప్రియా సూలే గెలుస్తూ వస్తున్నారు.
డింపుల్ యాదవ్
ఉత్తర్ ప్రదేశ్లో అఖిలేశ్ కుటుంబానికి కంచుకోట అయిన మైన్పురీ నుంచి ఆయన సతీమణి డింపుల్ యాదవ్ మరోసారి పోటీ చేస్తున్నారు. ఈసారి ఈ సీటులో ఎలాగైనా గెలవాలని పట్టుదలగా ఉన్న భాజపా ఠాకుర్ జైవీర్ సింగ్ను బరిలోకి దింపింది. 2019లో ఇక్కడి నుంచి ములాయం సింగ్ యాదవ్ గెలిచారు. ఆయన మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో డింపుల్ యాదవ్ విజయం సాధించారు. పట్టు నిలుపుకోవాలని అఖిలేశ్, ఎలాగైనా గెలవాలని భాజపా ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవడంతో ఇక్కడ ఆసక్తికర పోరు సాగుతోంది.
బద్రుద్దీన్ అజ్మల్
అస్సాంలోని ధుబరీ నుంచి పోటీ చేస్తున్న ఆల్ ఇండియా యునైటెడ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అధ్యక్షుడు బద్రుద్దీన్ అజ్మల్ ఈసారి భాజపా నుంచి గట్టి పోటీ ఎదుర్కొంటున్నారు. 2009 నుంచి ఆయన గెలుస్తూ వస్తున్నారు. అయితే డీలిమిటేషన్లో భాగంగా ముస్లింలు అత్యధికంగా ఉన్న నియోజకవర్గాలను వేరే దాంట్లో కలపడంతో ఈసారి ఆయనకు గట్టి సవాలు ఎదురవుతోంది. పలు ప్రాజెక్టులను ఈ ప్రాంతానికి తేవడంలో ఆయన విజయం సాధించడంతో ఇక్కడ పట్టు సాధించారు.
పల్లవి డెంపో
గోవాలోని ప్రముఖ పారిశ్రామిక కుటుంబం నుంచి వచ్చిన పల్లవి డెంపో దక్షిణ గోవా నియోజకవర్గం నుంచి భాజపా తరఫున పోటీ చేస్తున్నారు. రూ.1,361 కోట్ల ఆస్తులున్న ఆమె మూడో విడతలో అత్యంత సంపన్న మహిళగా నిలిచారు. గోవాలో తొలిసారిగా భాజపా తరఫున పోటీ చేస్తున్న మహిళ కూడా ఆమే. 2019లో దక్షిణ గోవాలో కాంగ్రెస్ నుంచి ఫ్రాన్సిస్కో సర్దిన్హా 9,755 ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఈసారి ఎలాగైనా ఈ సీటును దక్కించుకోవాలని పల్లవిని భాజపా బరిలోకి దింపింది. దీంతో గట్టి పోటీ నెలకొంది.
ఈనాడు ప్రత్యేక విభాగం
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ