ఎన్నికల్లో మార్వాడీల కీలకపాత్ర!
ఎడ్ల బండి కూడా వెళ్లలేని చోటుకు మార్వాడీలు వెళ్తారు అనేది నానుడి. అన్నట్లుగానే వారు ఇప్పుడు దేశమంతటా విస్తరించారు. వివిధ వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు.
దేశవ్యాప్తంగా విస్తరించిన వర్గం
తొలుత కాంగ్రెస్ మద్దతుదారులుగా.. ప్రస్తుతం భాజపా వెంట
(ప్రకాశ్ భండారీ)
ఎడ్ల బండి కూడా వెళ్లలేని చోటుకు మార్వాడీలు వెళ్తారు అనేది నానుడి. అన్నట్లుగానే వారు ఇప్పుడు దేశమంతటా విస్తరించారు. వివిధ వ్యాపారాల్లో తలమునకలై ఉన్నారు. దీంతో ఎన్నికల్లో వారిని ఆకట్టుకునేందుకు రాజకీయ పార్టీలు ప్రయత్నిస్తుంటాయి. రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మకు ఇప్పుడు భారీ డిమాండు ఏర్పడింది. దేశవ్యాప్తంగా మార్వాడీలు ఉన్న చోట ఆయన వచ్చి ప్రచారం చేయాలని భాజపా నాయకులు కోరుకుంటున్నారు.
రాజకీయంగానూ క్రియాశీలం
శతాబ్దం కిందటే తమ మూలాల నుంచి వలస వచ్చిన మార్వాడీల్లో ఎక్కువ మంది వ్యాపారాల్లో స్థిరపడ్డారు. ఎక్కడికి వెళ్లినా ప్రత్యేక గుర్తింపు సాధించుకున్నారు. రాజకీయంగానూ క్రియాశీలకంగానే ఉంటారు. స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొని జైలుకు వెళ్లినవారూ ఉన్నారు. వారిలో జమ్నాలాల్ బజాజ్, రామకృష్ణ బజాజ్, కమల్ నయన్ బజాజ్, దేవీచంద్ సాగర్మల్, జీడీ బిర్లా తదితరులు ఉన్నారు. బిర్లాలు కాంగ్రెస్కు మద్దతుగా ఉండేవారు. మహాత్మా గాంధీకి జీడీ బిర్లా అత్యంత సన్నిహితుడు.
కాంగ్రెస్ నుంచి భాజపా దిశగా..
మార్వాడీ వర్గం తొలుత కాంగ్రెస్కు అనుకూలంగా ఉండేది. పశ్చిమ బెంగాల్లో ట్రేడ్ యూనియన్ల పేరుతో తమను లెఫ్ట్ నేతలు ఇబ్బందిపెట్టారని భావించిన వారు కాంగ్రెస్కు మద్దతుగా ఉండేవారు. ఈ వర్గానికి చెందిన వ్యాపారులు, పారిశ్రామికవేత్తలు కాంగ్రెస్ హయాంలో లైసెన్స్ రాజ్ అమల్లో ఉన్నప్పుడు సులభంగా అనుమతులు తెచ్చుకుని లబ్ధి కూడా పొందారు. వారంతా క్రమంగా భాజపావైపు మళ్లడం ప్రారంభించారు. రాజస్థాన్లో భాజపా, కాంగ్రెస్లలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా అక్కడి ముఖ్యమంత్రులకు డిమాండు ఉంటుంది. దేశ వ్యాప్తంగా విస్తరించిన మార్వాడీల్లో ప్రచారం చేయడానికి పార్టీ నేతలు వారిని ఆహ్వానిస్తారు.
- రాజస్థాన్ సీఎం భజన్ లాల్ శర్మ ఇటీవల పశ్చిమ బెంగాల్లో భాజపా తరఫున ప్రచారం చేశారు. గత లోక్సభ, అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఇక్కడ ప్రచారం నిర్వహించారు. దీంతో ఆయన బెంగాల్ కార్యకర్తల్లో ప్రాచుర్యం పొందారు. ఈసారి పశ్చిమ బెంగాల్లో 35 సీట్లు గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని శర్మ తెలిపారు.
- అమిత్ షా ఆధ్వర్యంలో ఆయన బెంగాల్లో పని చేయడంవల్లే రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవి వచ్చిందని అంటుంటారు.
- ఝార్ఖండ్తోపాటు మరికొన్ని రాష్ట్రాల్లో భజన్లాల్ శర్మ ప్రచారం చేస్తున్నారు.
గహ్లోత్కూ ప్రజాదరణ
రాజస్థాన్ మాజీ ముఖ్యమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత అశోక్ గహ్లోత్కూ మార్వాడీల్లో మంచి ప్రజాదరణ ఉంది. మహారాష్ట్ర, గుజరాత్, పశ్చిమ బెంగాల్, దక్షిణాది రాష్ట్రాల్లోని వలస మార్వాడీల కోసం ఆయన ప్రచారం చేస్తుంటారు. భజన్ లాల్ మాదిరిగానే గహ్లోత్ ప్రచారం చేస్తుంటారు. తన కుమారుడు పోటీ చేసిన ఝాలోర్కే ఆయన తొలుత పరిమితమయ్యారు. అక్కడ ఎన్నికలు పూర్తి కావడంతో మిగిలిన ప్రాంతాలపై దృష్టి సారించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనూ ఆయన ప్రచారానికి రానున్నారు.
పలు రాష్ట్రాల్లో..
మార్వాడీలు పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నారు. పశ్చిమ బెంగాల్, బిహార్, ఒడిశా, కర్ణాటక, గుజరాత్, మహారాష్ట్ర, అస్సాం, తెలంగాణ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, హరియాణా, దిల్లీ, ఈశాన్య రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వారి ఉనికి ఉంది. దాదాపు 15 రాష్ట్రాల్లో మార్వాడీలు ఎన్నికల్లో ప్రభావం చూపగలరు.
- మార్వాడీల్లో వ్యాపారవేత్తలే కాదు.. కార్మికులూ ఉంటారు. వారు మార్వాడ్, మేవాడ్, వగద్, శెఖావత్ ప్రాంతాల నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు వలస వస్తుంటారు.
- మహారాష్ట్రలోని ఉత్తర ముంబయి, ఉత్తర మధ్య ముంబయి, నాగ్పుర్, పుణె, మరాఠ్వాడా ప్రాంతాల్లో మార్వాడీల ప్రాబల్యం అధికం.
- గుజరాత్లోని సూరత్, రాజ్కోట్, గాంధీనగర్, వడోదరా, అహ్మదాబాద్ ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటారు.
- అస్సాంలోని దిబ్రూగఢ్, గువాహటి ప్రాంతాల్లో ఉంటారు.
- మధ్యప్రదేశ్లోని ఇందౌర్, విదిశా ప్రాంతాల్లో మార్వాడీలు అధికంగా ఉంటారు.
- తెలంగాణాలోని హైదరాబాద్, సికింద్రాబాద్లకే వారు పరిమితమయ్యారు.
- ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, గుంటూరులో అధికంగా ఉంటారు.
- ఝార్ఖండ్లోని రాంచీ, జెమ్షెడ్పుర్, బొకారో, సంద్, చైబాసా ప్రాంతాల్లో మార్వాడీలు ఉంటారు.
- ఒడిశాలోని కటక్, భద్రక్, సంబల్పుర్ ప్రాంతాల్లో వారి ఉనికి ఉంది.
- కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, శివమొగ్గ ప్రాంతాల్లో అధికంగా ఉంటారు. బెంగళూరులో మార్వాడీ వర్గానికి చెందిన ఒక ఎమ్మెల్యే ఉన్నారు. రాజ్యసభ సభ్యుడిగానూ ఒకరికి అవకాశం కల్పించారు.
- తమిళనాడులోని చెన్నై, మదురై, కోయంబత్తూర్లలో మార్వాడీలు అధికంగా ఉంటారు.
- ఛత్తీస్గఢ్లోని రాయ్పుర్, దుర్గ్, భిలాయ్, బస్తర్, రాయ్గఢ్, బిలాస్పుర్లలో ఉంటారు.
- బిహార్లోని భాగల్పుర్, పట్నా, దర్భంగాలలో ఉంటారు.
- ఉత్తర్ ప్రదేశ్లోని 20 నియోజకవర్గాల్లో వారి ఉనికి ఉంటుంది.
- హరియాణాలోని పానిపట్, గురుగ్రామ్లలో మార్వాడీలు ఉంటారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎందుకీ నిరాసక్తి?
సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటికే నాలుగు దశలు పూర్తయ్యాయి. దక్షిణాదిలోని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలింగ్ ముగిసింది. -
ప్రాంతీయ పార్టీల్లో పునరుత్తేజం!
సార్వత్రిక సమరం రసవత్తరంగా సాగుతోంది. దేశవ్యాప్తంగా సగానికిపైగా లోక్సభ నియోజకవర్గాల్లో ఇప్పటికే పోలింగ్ పూర్తయింది. -
అటో.. ఇటో.. ఉత్కంఠే!
ఖనిజ సంపద ఉన్నా వెనుకబడిన రాష్ట్రంగా గుర్తింపు పొందిన ఝార్ఖండ్లో తీర్పు విచిత్రంగా ఉంటుంది. ఒకసారి ఒక కూటమికి, మరోసారి ఇంకో కూటమికి ఇక్కడి ప్రజలు పట్టం కడుతుంటారు. -
కార్మిక లోకం ఎవరికి బలం!
పశ్చిమ బెంగాల్లోని పారిశ్రామిక కారిడార్లో ఉన్న 7 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా ఈ నెల 20వ తేదీన పోలింగ్ జరగనుంది. పౌరసత్వ సవరణ చట్టం, మైనారిటీలు, కూటమి ప్రభావం ఈ ఎన్నికల్లో అధికంగా ఉండనుంది. -
వారసులకు పరీక్ష!
బిహార్లోని 5 నియోజకవర్గాల్లో ఐదో విడతలో భాగంగా 20వ తేదీన పోలింగ్ జరగనుంది. ఇక్కడ మొత్తం 80 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
తేల్చేది తెలుగు ఓటర్లే!
తూర్పు రాష్ట్రాల్లో కీలకమైన ఒడిశాలో నాలుగు విడతల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. తొలి విడతలో భాగంగా సోమవారం దక్షిణ ఒడిశాలోని బ్రహ్మపుర, కొరాపుట్, నవరంగపుర్, కలహండి లోక్సభ, వాటి పరిధిలోని 28 అసెంబ్లీ సెగ్మెంట్లలో పోలింగ్ జరగనుంది. -
సంచలన హోరు!
పశ్చిమ బెంగాల్లోని అత్యంత సంచలన నియోజకవర్గాల్లో నాలుగో విడతలో భాగంగా సోమవారం పోలింగ్ జరగనుంది. -
ఆఖరి వ్యూహాల్లో అభ్యర్థులు
పోలింగ్ సమయం ఆసన్నం కావడంతో లోక్సభ అభ్యర్థులు అంతిమ వ్యూహాలకు తెరలేపారు. ఎన్నికల్లో గెలవాలంటే నేరుగా ఎక్కువ ఓట్లు సాధించడం ఒక పద్ధతి. -
రవాణా సదుపాయం.. ఓట్లకు ఉపాయం
పోలింగ్ బూత్లకు దూరంగా ఉన్న పల్లెల్లోని ఓటర్లను తరలించేందుకు స్థానిక నాయకులు వాహనాలను సిద్ధం చేస్తున్నారు. ప్రజారవాణా సౌకర్యాలు కొరవడిన మారుమూల ప్రాంతాలు, ఏజెన్సీ గూడేల్లో ప్రతి ఎన్నికలోనూ ఇదే తంతు పునరావృతం అవుతోంది. -
ఓటు అమూల్యం.. వేద్దాం ఇలా..
ఓటు అమూల్యం.. ఆ హక్కును సక్రమంగా వినియోగించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఓటరుపై ఉంది. ప్రజాస్వామ్యం పరిఢవిల్లాలన్నా.. దేశ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలన్నా.. ప్రతి ఒక్కరూ ఓటు వేయడం అత్యంత కీలకం. -
ఓటు హక్కు కాదు.. పౌర బాధ్యతంటున్న సింగపూర్
మన దేశంలో ఓటును హక్కుగా చూస్తారు. కానీ, సింగపూర్లో మాత్రం అది పౌరుడి బాధ్యత కూడా. ప్రభుత్వ ఎంపిక బాధ్యత నుంచి తప్పించుకొనేవారిని అక్కడి చట్టాలు తేలిగ్గా వదిలిపెట్టవు. అలాగని ప్రజలు ఏదో బలవంతం మీద ఓటు వేసినట్లు ఉండనీయవు. -
మంజీర పరీవాహకంలో గెలుపు తీరం ఎవరిదో!
తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గాల్లో జహీరాబాద్ లోక్సభ స్థానం కొన్ని ప్రత్యేకతలను సంతరించుకుంది. -
మారిన ప్రచార ఎజెండా
దేశంలో రెండు కూటములుగా విడిపోయిన పార్టీలు.. సార్వత్రిక సమరాన్ని అత్యంత ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. దేశాన్ని ప్రపంచంలోనే సగర్వంగా నిలుపుతామని, అయోధ్యలో రామ మందిరం నిర్మించామని ఎన్డీయే.. నిరుద్యోగం, ధరల పెరుగుదల, సంక్షేమం తమ ప్రాధాన్యాంశాలని ఇండియా కూటమి తొలుత ప్రచారాస్త్రాలుగా చేసుకున్నాయి. -
తొలిసారే లోక్సభ బరి.. విజయంపై గురి
మొదటిసారిగా ఎన్నికల బరిలోకి.. అదీ నేరుగా లోక్సభ అభ్యర్థిగా పోటీకి దిగిన పలువురు తమ అదృష్టాన్ని పరీక్షించుకొంటున్నారు. ప్రధాన పార్టీల నుంచి ఇలా తొలిసారి 15 మంది బరిలోకి దిగారు. -
హైదరాబాద్కా ‘షాన్’ ఎవరో?!
హైదరాబాద్ లోక్సభ నియోజకవర్గం.. దేశవ్యాప్తంగా ప్రసిద్ధి పొందిన చార్మినార్, సాలార్జంగ్ మ్యూజియం, మక్కా మసీదు, ఫలక్నుమా ప్యాలెస్ లాంటి పర్యాటక ప్రాంతాలు, ఉస్మానియా ఆసుపత్రి లాంటి చారిత్రక ప్రదేశాలకు నెలవిది. -
‘సేన’ల మోహరింపు
-
‘గ్రేటర్’లో హోరా హోరీ
రాష్ట్రంలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోకి వచ్చే నాలుగు లోక్సభ నియోజకవర్గాల్లో హోరాహోరీ నెలకొంది. త్రిముఖ పోటీ వాతావరణం నెలకొన్నా ఒక స్థానంలో మినహా మిగిలిన మూడు చోట్ల ముఖాముఖి పోరుగానే ఉంది. -
దక్షిణాన దూకుడెవరిదో?
దక్షిణ తెలంగాణలో ఈసారి త్రిముఖపోటీ నెలకొంది. అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా సీట్లు సాధించిన కాంగ్రెస్.. లోక్సభ సమరంలో అదే జోరు కొనసాగించేందుకు ప్రయత్నిస్తోంది. -
ఉద్యమాల ఖిల్లాలో ఆశీర్వాదం ఎవరికో?
ఉత్తర తెలంగాణ... ఉద్యమాల ఖిల్లా. ఎన్నెన్నో పోరాటాలు పురుడు పోసుకున్న నేల. రాజకీయ చైతన్య కేంద్రం. ఎందరో ఉద్దండులను దేశానికి అందించిన ప్రాంతం. -
కరీం‘నగారా’ మోగించేదెవరో!?
శాతవాహనులు ఏలిన ఎలగందుల నేల.. దక్షిణకాశీ వేములవాడ రాజన్న పుణ్యక్షేత్రం కొలువుదీరిన భూమి.. అగ్గిపెట్టెలో ఇమిడే చీరను నేసిన నేతన్నల ఇలాకా.. మానేరు గలగలలను ఒడిసిపట్టిన ప్రాంతం.. మాజీ ప్రధాని పీవీ నరసింహారావు, జ్ఞానపీఠ్ పురస్కారగ్రహీత సినారెల జన్మస్థలం.. కరీంనగర్ లోక్సభ స్థానం. -
ఆ ప్రధానుల ప్రత్యేకత మోదీకి అందేనా!
దేశ రాజకీయ చరిత్రలో మాజీ ప్రధానమంత్రులు జవహర్లాల్ నెహ్రూ, ఇందిరాగాంధీ, అటల్బిహారీ వాజ్పేయీలకు ఒక ప్రత్యేకత ఉంది. ఈ ముగ్గురూ కనీసం మూడుసార్లు ప్రధానిగా ప్రమాణం చేశారు.
తాజా వార్తలు
-
సంబరాల్లో బెంగళూరు.. ధోనీతో కరచాలనం చేసేందుకూ సమయం లేదా?: మాజీలు
-
ఇండస్ట్రీలో నన్ను ‘నంది’ అని పిలిచింది ఆయనే: రాజమౌళి
-
ప్రాసిక్యూటర్ టు ప్రెసిడెంట్: ఎవరీ ఇబ్రహీం రైసీ..?
-
పల్నాడు హింసపై వైకాపా దుష్ప్రచారం: లావు శ్రీకృష్ణదేవరాయలు
-
పీఎఫ్ విత్డ్రా.. ఈ క్లెయిమ్స్పై 3-4 రోజుల్లోనే ఖాతాల్లోకి నగదు!
-
ఇప్పటి వరకు ధోనీ మాకేం చెప్పలేదు: రిటైర్మెంట్పై చెన్నై ఫ్రాంచైజీ!