లోక్సభ ఎన్నికల్లో ‘ఏకగ్రీవం’.. ఇప్పటివరకూ ఎంతమందంటే..?
సూరత్ స్థానం నుంచి భాజపా అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇలా ఏకగ్రీవం విషయంలో నిబంధనలు ఏం చెబుతున్నాయి..? గతంలో ఎంతమంది ఇలా ఎన్నికయ్యారంటే..?
ఇంటర్నెట్ డెస్క్: పోలింగ్ జరగకుండానే భాజపా ఈ లోక్సభ ఎన్నికల్లో బోణీ కొట్టిన విషయం తెలిసిందే. గుజరాత్లోని సూరత్ స్థానం నుంచి ఆ పార్టీ అభ్యర్థి ముకేశ్ దలాల్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్ అభ్యర్థి నీలేశ్ కుంభానీ నామినేషన్ పత్రాలపై ప్రతిపాదకులుగా సంతకాలు చేసిన ముగ్గురు జిల్లా ఎన్నికల అధికారి ఎదుట హాజరయ్యేందుకు నిరాకరించారు. తాము ఆ పత్రాలపై సంతకాలు చేయలేదని వారు స్పష్టం చేశారు. దీంతో ఆ నామినేషన్ తిరస్కరణకు గురైంది. కాంగ్రెస్ డమ్మీ అభ్యర్థి నామినేషనూ చెల్లలేదు. ఆ వెంటనే స్వతంత్రులు సహా ఇతరులంతా బరి నుంచి వైదొలగడంతో నాటకీయ పరిణామాల నడుమ ముకేశ్ దలాల్ విజేత అయ్యారు. ఈ స్థానంలో ఆయనపై కాంగ్రెస్, బీఎస్పీ, మూడు చిన్న పార్టీలు అభ్యర్థులను నిలబెట్టాయి. స్వతంత్రులుగా నలుగురు బరిలో దిగారు. నామినేషన్ల ఉపసంహరణ చివరిరోజు నాటికి దలాల్ ఒక్కరే మిగిలారు. దీంతో ముకేశ్ నెగ్గినట్లు జిల్లా ఎన్నికల అధికారి ధ్రువీకరణపత్రం అందించారు. భాజపా నుంచి ఇది తొలి ఏకగ్రీవంగా చెబుతున్నారు.
నిబంధనలు ఎలా ఉన్నాయి..?
నామినేషన్ల ఉపసంహరణ నాటికి బరిలో ఒక్క అభ్యర్థి మాత్రమే మిగిలితే అతడిని ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి ప్రకటిస్తారు. 1951 ప్రజాప్రాతినిధ్య చట్టంలోని సెక్షన్ 53(3) ప్రకారం.. రిటర్నింగ్ అధికారికి ఈ అధికారం ఉంటుంది. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ నుంచి పోటీ చేసే అభ్యర్థి నామినేషన్ను ఆ నియోజకవర్గం నుంచి కనీసం ఒక్కరైనా ప్రతిపాదించాల్సి ఉంటుంది. ఒకవేళ స్వతంత్ర అభ్యర్థి లేదా గుర్తింపుపొందని పార్టీ అభ్యర్థి అయితే.. పది మందైనా నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయాల్సిఉంటుంది. అలాకానిపక్షంలో ఆ నామినేషన్లను తిరస్కరించే అధికారం రిటర్నింగ్ అధికారికి ఉంటుంది.
నోటా ఉన్నా..
బరిలో ఉన్న అభ్యర్థుల్లో ఎవరూ నచ్చకపోతే నోటాకు ఓటు వేసే అవకాశం ఓటర్లకు ఉంటుంది. దీన్ని 2013 నుంచి అమల్లోకి తీసుకువచ్చారు. పోటీలో ఒక్క అభ్యర్థే మిగిలినప్పటికీ నోటా ఉంటుంది కదా.. ఎన్నికలు నిర్వహించాలని వాదించేవారు కొందరు ఉంటారు. అయితే.. నోటాకు ఎన్ని ఓట్లు వచ్చినా వాటిని తుది ఫలితం ప్రకటించే సమయంలో పరిగణనలోకి తీసుకోరు.
గతంలో ఇలా ఎన్నికయ్యారా..?
- 1951 నుంచి ఇప్పటివరకు 35 మంది అభ్యర్థులు లోక్సభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- గతంలో వై.బి.చవాన్, ఫరూక్ అబ్దుల్లా, హరేకృష్ణ మెహతాబ్, టి.టి.కృష్ణమాచారి, పి.ఎం.సయీద్, ఎస్.సి.జమీర్ వంటివారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
- గత 12 ఏళ్లలో మాత్రం ఇలా ఎవరూ ఎన్నిక కాలేదు. 2012లో కన్నౌజ్ లోక్సభ ఉప ఎన్నికలో సమాజ్వాదీ పార్టీ అభ్యర్థి డింపుల్ యాదవ్ ఎన్నిక ఏకగ్రీవమైంది.
- 1957 ఎన్నికల్లో అత్యధికంగా ఏడుగురు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1951 ఎన్నికల్లో ఐదుగురు, 1967 ఎన్నికల్లో మరో ఐదుగురు ఇలా ఎన్నికయ్యారు. 1962 ఎన్నికల్లో ముగ్గురు, 1977 ఎన్నికల్లో ఇద్దరు, 1971, 1980, 1989 ఎన్నికల్లో ఒక్కొక్కరూ ఇలా గెలుపొందారు.
- ఉప ఎన్నికల్లో పోటీ లేకుండా గెలిచినవారు తొమ్మిది మంది ఉన్నారు.
- ఏకగ్రీవంగా ఎన్నికైన వారిలో ఎక్కువ మంది కాంగ్రెస్ నుంచే ఉన్నారు.
- సిక్కిం, శ్రీనగర్ స్థానాలు రెండుసార్లు ఏకగ్రీవమయ్యాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
తాజా వార్తలు
-
బెంగళూరు vs చెన్నై: వర్షం కారణంగా మ్యాచ్ రద్దయితే పరిస్థితి ఏంటి?
-
ఈసీ అనుమతి నిరాకరణ.. తెలంగాణ కేబినెట్ భేటీ వాయిదా
-
భారత బలగాలకు ద్రోహం చేసిన చరిత్ర కాంగ్రెస్ది: ప్రధాని మోదీ
-
మీ కార్యాలయానికే వస్తాం.. ధైర్యముంటే అరెస్టు చేసుకోండి: కేజ్రీవాల్ సవాల్
-
కాకతీయ వర్సిటీ వీసీ రమేశ్పై విజిలెన్స్ విచారణకు ఆదేశం
-
ఎన్నికల తనిఖీల్లో.. రూ.8,889 కోట్ల సొత్తు స్వాధీనం: ఈసీ