Karnataka: ఆ అసభ్యకర వీడియోలు నాలుగైదేళ్ల నాటివి: దేవెగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణ
ప్రజ్వల్ రేవణ్ణపై వచ్చిన ఆరోపణల విషయంలో ఆయన తండ్రి హెచ్డీ రేవణ్ణ స్పందించారు. తమపై జరుగుతున్న కుట్రలో అవి భాగమని వ్యాఖ్యానించారు.
ఇంటర్నెట్డెస్క్: కర్ణాటక రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తున్న హసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ (జేడీఎస్) (Prajwal Revanna) అసభ్యకర వీడియోల విషయంలో మరో కీలక పరిణామం చోటుచేసుకొంది. ఆయన తండ్రి, దేవేగౌడ కుమారుడు హెచ్డీ రేవణ్ణ స్పందించారు. అదంతా ఓ కుట్ర అని కొట్టిపారేశారు. తాము భయపడి పారిపోయే రకం కాదని ఆయన వెల్లడించారు. ‘‘ఎలాంటి కుట్ర జరుగుతోందో నాకు తెలుసు. భయపడి పారిపోయే రకాలం కాదు. వాళ్లు విడుదల చేసిన వీడియోలు 4-5 ఏళ్ల క్రితం నాటివి. ప్రజ్వల్ను పార్టీ నుంచి బహిష్కరించడం అధినాయకత్వ నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని దర్యాప్తు చేయనీయండి. గత 40 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో చాలా దర్యాప్తులను ఎదుర్కొన్నాం. సిట్ లేదా సీఐడీకి అప్పగించనీయండి’’ అని రేవణ్ణ వ్యాఖ్యానించారు.
మరోవైపు ఈ వ్యవహారం నుంచి మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్డీ కుమారస్వామి దూరం జరిగారు. అది పూర్తిగా రేవణ్ణ కుటుంబానికి సంబంధించిన అంశమన్నారు. దానితో తమకు ఎటువంటి సంబంధం లేదని పేర్కొన్నారు. ఆ వీడియోలు విడుదల చేసిన టైమింగ్ను ఆయన ప్రశ్నించారు. వీటిల్లో ఏమైనా తప్పు ఉంటే నిందితులు కచ్చితంగా శిక్షను అనుభవించాలన్నారు.
లైంగిక దౌర్జన్యం, బెదిరింపులకు పాల్పడ్డారంటూ ఒక మహిళ ఫిర్యాదు మేరకు మాజీ ప్రధాని హెచ్డీ దేవేగౌడ కుమారుడు, ఎమ్మెల్యే రేవణ్ణ, మనవడు ప్రజ్వల్ రేవణ్ణలపై హొళెనరసీపుర పోలీసుస్టేషన్లో ఆదివారం కేసు నమోదైంది. లైంగిక దౌర్జన్యానికి సంబంధించిన వీడియోలు ఇప్పటికే హాసన జిల్లాలో వైరల్ అవుతున్నాయి. కర్ణాటక మహిళా కమిషన్ అధ్యక్షురాలు డాక్టర్ నాగలక్ష్మి చౌదరి సిఫార్సుమేరకు ఈ అంశంపై ప్రభుత్వం సీఐడీ డీఐజీ బిజయ్కుమార్ సింగ్ నేతృత్వంలో ఐపీఎస్ అధికారులు సుమన్ డి పన్సేకర్, సీమా లాట్కర్లు సభ్యులుగా సిట్ను ఏర్పాటుచేసింది. అసభ్యకర వీడియోల కేసు నమోదైన సమయంలోనే ప్రజ్వల్ ఆదివారం తెల్లవారుజామున కెంపేగౌడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఫ్రాంక్ఫర్ట్ (జర్మనీ)కు వెళ్లారు. హాసన లోక్సభ సభ్యుడిగా ఉన్న ప్రజ్వల్ తాజాగా భాజపా-దళ్ అభ్యర్థిగా బరిలో దిగారు. ఎన్నికల ప్రచార సమయంలోనే కాంగ్రెస్ కార్యకర్తలు ఆయన వీడియోలపై ప్రచారం చేశారు. అవి మార్ఫింగ్వని ప్రజ్వల్ ఖండించారు. మరోవైపు ‘భార్య ఇంట్లో లేని సమయంలో రేవణ్ణ తనతో అసభ్యకరంగా ప్రవర్తించేవారని’ బాధితురాలు పోలీసులకిచ్చిన ఫిర్యాదులో ఆరోపించారు. తనపై ఆయన కుమారుడు ప్రజ్వల్ కూడా లైంగిక దౌర్జన్యానికి పాల్పడి సెల్ఫోన్లలో చిత్రీకరించి బెదిరించేవారని ఫిర్యాదు చేశారు. ఈ అశ్లీల వీడియోలను నిక్షిప్తం చేసిన పెన్డ్రైవ్లను కొందరు హాసనలోని పార్కులు, హోటళ్లలో వదిలిపెట్టారు. ప్రజ్వల్ పలువురు యువతులు, మహిళలతో వేర్వేరు సందర్భాల్లో లైంగిక దౌర్జన్యాలకు పాల్పడుతున్నట్టున్న వీడియోలు ఇందులో ఉన్నాయి. అవి డీప్ఫేక్తో సృష్టించినవని జనతాదళ్ సామాజిక మాధ్యమ విభాగం చెబుతోంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
స్వాతి మాలీవాల్పై దాడి ఘటన.. కేజ్రీవాల్ ఇంటి ముందు భాజపా నిరసన
ఆప్ రాజ్యసభ ఎంపీ స్వాతి మాలీవాల్పై జరిగిన దాడికి వ్యతిరేకంగా భాజపా అరవింద్ కేజ్రీవాల్ నివాసం ముందు నిరసనకు దిగింది. -
నాలుగు దశలు దాటాక ఇండియా కూటమి బలపడింది: ఖర్గే
ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధించనుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నాలుగు దశల్లో ముగిసిన పోలింగ్లో బలంగా పుంజుకొందని తెలిపారు. -
ఆ రోజు ముస్లిం స్నేహితులే అన్నం పెట్టేవారు: మోదీ
తానెప్పుడు ఓటు బ్యాంకు రాజకీయాలు చేయనని ప్రధాని మోదీ (PM Modi) అన్నారు. తనకు ఎంతోమంది ముస్లిం స్నేహితులు ఉన్నారని చెప్పారు. -
కంగనా ఆస్తుల విలువ రూ.90 కోట్లు
మండీ లోక్సభ నియోజకవర్గం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ తనకు రూ.90 కోట్లకుపైగా ఆస్తులున్నట్లు నామినేషన్ పత్రాల్లో ప్రకటించారు. -
యూపీలో కాంగ్రెస్కు ఎర్రటోపీ బాసట
ఇండియా కూటమిలో ప్రధాన భాగస్వామ్యపక్షమైన కాంగ్రెస్కు సమాజ్వాదీ పార్టీ శ్రేణులు అండగా నిలుస్తున్నాయి. సీట్ల పంపకంలో భాగంగా యూపీలో 17 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. -
ప్రచార తారలు ఆదర్శంగా ఉండాలి
సార్వత్రిక ఎన్నికల్లో మిగిలిన మూడు దశల్లో జాతీయ పార్టీల ప్రచార తారలు (స్టార్ క్యాంపెయినర్లు) ఇతరులకు ఆదర్శంగా మెలగాలని, సమాజంలో సున్నితమైన కూర్పును పాడుచేయవద్దని కేంద్ర ఎన్నికల సంఘం కోరింది. -
రాయ్బరేలీ, అమేఠీలు మా కర్మభూమి
ఉత్తర్ప్రదేశ్లోని అమేఠీ, రాయ్బరేలీ అంటే తమ దృష్టిలో కేవలం లోక్సభ నియోజకవర్గాలు మాత్రమే కావని, అవి తమ కర్మభూమి అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పేర్కొన్నారు. -
దేశంలో మోదీ హవా ఏమీ లేదు: జైరాం రమేశ్
దేశంలో ప్రధాని నరేంద్రమోదీ హవా ఏమీ లేదని, ఆయనకు తెలిసిందల్లా వ్యవస్థలను నాశనం చేయడమేనని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ఆరోపించారు. -
మోదీకి నా చేతివంట రుచి చూపిస్తా: మమత
ప్రధాని మోదీకి తన చేతివంట రుచి చూపిస్తానని, చిన్నప్పటినుంచి తనకు వండటం అలవాటేనని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ చెప్పారు. -
ఎన్నికల్లో పోటీ చేయకుండా మోదీని నిషేధించాలంటూ వ్యాజ్యం
తన ప్రచారంలో భాగంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ..విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తున్నందున ఎన్నికల్లో పోటీ చేయకుండా ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై నిషేధం విధించాలంటూ దాఖలైన పిటిషన్ను విచారించేందుకు సుప్రీం కోర్టు మంగళవారం తిరస్కరించింది. -
కాంగ్రెస్ వస్తే.. మళ్లీ గుడారానికి రాముడు
అయోధ్య రాముణ్ని మళ్లీ గుడారానికి పంపాలని చూస్తున్న కాంగ్రెస్ పార్టీ సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తోందని ప్రధాని మోదీ విరుచుకుపడ్డారు. -
సీఏఏ అమలును మమత అడ్డుకోలేరు
పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ) అమలును మమతాబెనర్జీ ఎప్పటికీ అడ్డుకోలేరు. మతువాలతోపాటు శరణార్థులకు భారత పౌరసత్వం ఇవ్వకుండా ప్రపంచంలో ఏ శక్తీ ఆపజాలదు. -
ఎన్డీయే నేతలు వెంట రాగా.. వారణాసిలో ప్రధాని నామినేషన్
సార్వత్రిక ఎన్నికల సమరంలో వారణాసి నుంచి వరుసగా మూడోసారి పోటీకి ప్రధాని మోదీ మంగళవారం నామినేషను దాఖలు చేశారు. -
సినీనటి కంగనా రనౌత్ ఆస్తుల విలువ ఎంతంటే?
లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రముఖ బాలీవుడ్ నటి, భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ మంగళవారం నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా తన ఆస్తుల వివరాలను అఫిడవిట్లో వెల్లడించారు. -
సొంతిల్లు లేదు.. కారు లేదు.. మోదీ ఆస్తులు ఎంతంటే..?
ప్రధాని నరేంద్ర మోదీకి రూ.3 కోట్లకు పైగా ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్లో ప్రకటించారు. ఇప్పటివరకు సొంతంగా ఇల్లు, కారు లేదని వెల్లడించారు. -
ఓటేస్తే ‘డెమోక్రసీ డిస్కౌంట్’.. పలు రెస్టారంట్ల వినూత్న ఆఫర్!
లోక్సభ ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ముంబయిలోని పలు రెస్టారంట్లు వినూత్న ఆఫర్ ప్రకటించాయి. -
మోదీకి నా వంట రుచి చూపిస్తా.. దీదీ ఆసక్తికర వ్యాఖ్యలు
Mamata Banerjee: ప్రధాని మోదీకి తన చేతి వంట రుచి చూపిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. అసలేం జరిగిందంటే..? -
ప్రసంగాలను సరిదిద్దుకోండి.. అగ్ర నేతలకు ‘ఈసీ’ సూచన!
ఎన్నికల వేళ ఆయా పార్టీల అగ్ర నేతల నుంచి జనం మంచి ప్రసంగాలను ఆశిస్తారని.. దీంతో నాయకులు ఈమేరకు నడుచుకోవాలని ఎన్నికల సంఘం సూచించింది. -
మోదీ నామినేషన్.. ప్రతిపాదించిన ‘ఆ నలుగురు’ ఎవరో తెలుసా?
Modi Nomination: వారణాసి నుంచి ముచ్చటగా మూడోసారి నామినేషన్ దాఖలు చేశారు ప్రధాని మోదీ. ఆయన పేరును నలుగురు సామాన్యులు ప్రతిపాదించారు. ఇంతకీ వారు ఎవరు? ప్రతిపాదకులుగా వారినే ఎందుకు ఎంచుకున్నారు? -
వరుసగా మూడోసారి.. వారణాసి నుంచి నామినేషన్ వేసిన ప్రధాని మోదీ
ప్రధాని మోదీ (Modi) నేడు వారణాసి (Varanasi) నుంచి నామినేషన్ వేశారు. ఈ సమయంలో ఆయన వెంట పలువురు కేంద్రమంత్రులు, ఎన్డీఏ నేతలు ఉన్నారు. -
మోదీ మరోసారి నెగ్గితే ఇక ఎన్నికలనేవే ఉండవు
ప్రస్తుత లోక్సభ ఎన్నికల్లో ప్రధాని నరేంద్రమోదీ నెగ్గి, కేంద్రంలో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేస్తే ఇక భవిష్యత్తులో ఎన్నికలే ఉండవని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు.
తాజా వార్తలు
-
డీజీపీ, ఇంటెలిజెన్స్ ఏడీజీలతో సీఎస్ జవహర్రెడ్డి అత్యవసర భేటీ
-
కార్చిచ్చుల వేళ.. అగ్నిమాపక సిబ్బందికి ఎన్నికల విధులా..?
-
ముంబయిలో బిల్బోర్డ్ ట్రాజెడీ.. ఎనిమిదేళ్ల క్రితమే పుస్తకంలో ప్రస్తావించిన రచయిత
-
ఐపీఎల్ ప్లేఆఫ్స్.. రెండు బెర్తుల కోసం ఐదు టీమ్లు.. ఏ జట్టు పర్సంటేజీ ఎంతంటే?
-
స్పామ్ కాల్స్కు ఇక గుడ్బై.. త్వరలో కొత్త మార్గదర్శకాలు
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM