KCR: రాష్ట్రంలో విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయి: కేసీఆర్
తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్ అన్నారు.
మహబూబ్నగర్: తెలంగాణలో కరెంటు పోవడం లేదని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ప్రతి రోజూ ఊదరగొడుతున్నారని, వాస్తవ పరిస్థితులు అందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయని భారాస అధినేత కేసీఆర్ అన్నారు. మహబూబ్నగర్లో మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ ఇంట్లో తాను భోజనం చేస్తున్నప్పుడు రెండు సార్లు కరెంట్ పోయిందని ఎక్స్ (ట్విటర్) వేదికగా తెలిపారు. నియోజకవర్గాల్లో రోజుకు పదిసార్లు కరెంటు పోతోందని మాజీ ఎమ్మెల్యేలు ఆ సందర్భంగా తనతో చెప్పినట్టు పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా విచిత్రమైన ఘటనలు జరుగుతున్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని పాలిస్తున్న కాంగ్రెస్ పార్టీ వైఫల్యానికి ఇంతకన్నా గొప్ప నిదర్శనం ఏముంటుందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు, మేధావులు ఆలోచించాలని భారాస అధినేత విజ్ఞప్తి చేశారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంటోన్మెంట్ను దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తా
ఎన్నికల తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తానని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. -
కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ.. బయ్యారం స్టీల్ ఎక్కడ?: జైరాం రమేశ్
లోక్సభ ఎన్నికల్లో ప్రధాని మోదీ తెలంగాణలో విస్తృతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఆయనపై ప్రశ్నల వర్షం కురిపించింది. -
రిజర్వేషన్లపై ప్రజలు వాస్తవాలను గుర్తించారు
భాజపాపై కాంగ్రెస్, భారాస చేస్తున్న వ్యతిరేక ప్రచారంలో వాస్తవాలను గుర్తించి ప్రజలు తమకు మద్దతుగా నిలుస్తున్నారని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి అన్నారు. -
భాజపాకు ఓటేస్తే గొంతు కోసుకున్నట్లే..
రిజర్వేషన్లను తొలగించేందుకే భాజపా 400 సీట్లు కోరుతోందని, ఆ పార్టీకి ఓటేస్తే మన గొంతు మనమే కోసుకున్నట్లవుతుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క అన్నారు. -
ఐదు నెలల్లో పరిస్థితులు తారుమారు
అసెంబ్లీ ఎన్నికలప్పుడు కాంగ్రెస్ నేతలు అరచేతిలో వైకుంఠం చూపారని.. ప్రజలందర్నీ మోసపుచ్చి, అధికారం చేపట్టాక ఏ ఒక్క వాగ్దానమూ అమలు చేయలేదని భారాస అధినేత కేసీఆర్ ధ్వజమెత్తారు. -
దక్షిణాదిలోనూ భాజపా ప్రభంజనం
ప్రస్తుత ఎన్నికల్లో తెలంగాణ సహా దక్షిణాది రాష్ట్రాల్లో భాజపా ప్రభంజనం సృష్టిస్తుందని రాజస్థాన్ ముఖ్యమంత్రి భజన్లాల్ శర్మ ధీమా వ్యక్తం చేశారు. -
రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పిన మోదీ: మంత్రి పొన్నం
వేములవాడకు వచ్చిన ప్రధాని మోదీ రాజన్న సాక్షిగా అబద్ధాలు చెప్పారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆరోపించారు. -
కరీంనగర్ సభలో మోదీ కోడ్ ఉల్లంఘించారు
కరీంనగర్ ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ కాంగ్రెస్పై, రాష్ట్ర ప్రభుత్వంపై చేసిన అనుచిత వ్యాఖ్యలను కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తోందని పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు జి.నిరంజన్ తెలిపారు. -
క్రిశాంక్ తప్పు చేసినట్లు తేలితే నేనే జైలుకెళ్తా: కేటీఆర్
భారాస సామాజిక మాధ్యమాల కన్వీనర్ క్రిశాంక్ అరెస్టు అప్రజాస్వామికమని, ఆయన తప్పు చేసినట్లు తేలితే తానే జైలుకెళ్తానని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. -
రాష్ట్రంలో 11 వరకు అల్కా లాంబ ప్రచారం
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా మహిళా కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు, సీడబ్ల్యూసీ ప్రత్యేక ఆహ్వానితురాలు అల్కా లాంబ ఈ నెల 11 వరకు రాష్ట్రంలో పర్యటించనున్నారు. -
నేడు, ఎల్లుండి అమిత్షా ప్రచారం
భాజపా అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్షా గురువారం భువనగిరి ఎన్నికల బహిరంగసభలో పాల్గొననున్నారు. -
కేసీఆర్కు ఎంత పెద్ద శిక్ష వేసినా తప్పు లేదు!
‘అసెంబ్లీ ఎన్నికల్లో కేసీఆర్ పార్టీ ఓడిపోతే ఎవరైనా బాధపడ్డారా? మద్యం కేసులో కవిత అరెస్ట్ అయితే అయ్యో పాపం అని ఎవరైనా అన్నారా? నేను వెయ్యి ఊళ్లలో అడిగినా.. వారి గురించి ఎవరూ బాధపడలేదు’ అని రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. -
ఐదేళ్లకు ఐదుగురు ప్రధానులట!
‘ఇండి కూటమిలో కొత్త ప్రతిపాదన వచ్చిందట. వాళ్లు అధికారంలోకి వస్తే ఐదేళ్లకు ఐదుగురు ప్రధానమంత్రులట. ఏడాదికి ఒకరని అంటున్నారు. -
కాశీ విశ్వేశ్వరుడి ప్రతిరూపం.. మోదీ
‘స్వాతంత్య్రం వచ్చాక చాలా మంది ప్రధానులు ఈ దేశాన్ని పాలించారు. కానీ ఒక్కరు కూడా వేములవాడ రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న దాఖలాల్లేవు.. ప్రధాని నరేంద్ర మోదీ ఒక్కరే దక్షిణ కాశీగా పేరొందిన ఇక్కడికి వచ్చి శివుడిని దర్శించుకున్నారు’ అని భాజపా జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ అన్నారు. -
ప్రమాదంలో ప్రజాస్వామ్యం
‘‘బ్రిటిష్ కాలం నుంచి కొనసాగుతున్న జనాభా లెక్కల విధానాన్ని మోదీ నిలిపేశారు. కులగణన చేపట్టి బీసీలకు మేలు చేయడాన్ని అడ్డుకుంటున్నారు. -
12 సీట్లు భారాసకు ఇస్తే ప్రభుత్వాన్ని శాసిస్తాం
అరచేతిలో వైకుంఠం చూపిన కాంగ్రెస్కు అధికారం కట్టబెట్టి ప్రజలు ఆగమయ్యారని, మరోసారి మోసపోకుండా లోక్సభ ఎన్నికల్లో భారాసకు 10, 12 ఎంపీ సీట్లు గెలవడానికి ఓటర్లు అండగా నిలిస్తే, మళ్లీ ప్రభుత్వాన్ని శాసించే సత్తా కేసీఆర్కు వస్తుందని మాజీ మంత్రి, భారాస రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ అన్నారు. -
మోదీ మా కలను సాకారం చేయబోతున్నారు
ఎస్సీ వర్గీకరణ కోసం 1994 నుంచి పోరాటం చేస్తుంటే 30 ఏళ్ల తర్వాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాదిగలకు న్యాయం చేయనున్నారని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ అన్నారు. -
ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువు పొడిగింపు
రాష్ట్రంలోని 17 లోక్సభ నియోజకవర్గాల్లో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ గడువును శుక్రవారం సాయంత్రం వరకు పొడిగించినట్లు కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) తెలంగాణ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్రాజ్ బుధవారం ‘ఈనాడు’తో చెప్పారు. -
పసుపుబోర్డు పేరు చెప్పి ఎన్నాళ్లీ మోసం?: సీఎం రేవంత్రెడ్డి
పంజాబ్, హరియాణా రైతులు మోదీ మెడలు వంచి నల్లచట్టాలు రద్దు చేయించారని, నిజామాబాద్ ఆర్మూర్ రైతులు అదేబాటలో నడవాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అన్నారు. -
రిజర్వేషన్లపై కాంగ్రెస్ దుష్ప్రచారాన్ని ప్రజలు ఖండిస్తున్నారు: కిషన్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ చేస్తోన్న రిజర్వేషన్ రద్దు ప్రచారం విఫలమైందని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్రెడ్డి అన్నారు. -
జూన్ 5న కాంగ్రెస్లోకి 25 మంది భారాస ఎమ్మెల్యేలు: మంత్రి కోమటిరెడ్డి
తనకు పదవులపై ఆశలేదని.. రానున్న పదేళ్లూ రేవంత్రెడ్డే సీఎం అని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి పునరుద్ఘాటించారు.
తాజా వార్తలు
-
ఉద్యోగులకు ఏఐఎక్స్ షాక్.. 25 మంది తొలగింపు.. మిగిలిన వారికి అల్టిమేటం
-
భారత క్రికెట్లో అభిషేక్ ఓ అద్భుతం.. సంచలనాలు సృష్టిస్తాడు: ట్రావిస్ హెడ్
-
షికాగోలో తెలంగాణ విద్యార్థి అదృశ్యం..
-
పన్నూ హత్యకు కుట్ర కేసు.. అమెరికా ఆరోపణల వేళ భారత్కు రష్యా మద్దతు
-
చిరు టు మహేశ్.. తెలుగు చిత్ర పరిశ్రమకు ఈ రోజెంతో ప్రత్యేకం..!
-
నష్టాల్లోనే స్టాక్ మార్కెట్ సూచీలు.. నిఫ్టీ @ 22,271