Nirmala Sitharaman: వారసత్వ పన్నుతో దేశం వెనక్కి.. కాంగ్రెస్పై నిర్మలా సీతారామన్ వ్యాఖ్యలు
వారసత్వ పన్నుపై రాజకీయ రగడ కొనసాగుతోంది. ఈ పన్ను వల్ల దేశం వెనక్కి పోతుందని తాజాగా నిర్మలా సీతారామన్ వ్యాఖ్యానించారు.
Nirmala Sitharaman | బెంగళూరు: వారసత్వ పన్నుపై ఇండియన్ ఓవర్సీస్ కాంగ్రెస్ అధ్యక్షుడు శాం పిట్రోడా చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతోంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీని లక్ష్యంగా చేసుకుని ప్రధాని మోదీ తనదైన శైలిలో విరుచుకుపడుతుండగా.. తాజాగా కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కూడా విమర్శలు గుప్పించారు. ఈ పన్ను వల్ల దేశం మళ్లీ వెనక్కి పోతుందని, ఈ పదేళ్లు చేసిన అభివృద్ధి కాస్త మళ్లీ సున్నాకు చేరుకుంటుందని వ్యాఖ్యానించారు. రెండో విడత పోలింగ్లో భాగంగా కర్ణాటకలో ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆమె విలేకరులతో మాట్లాడారు.
‘‘వారసత్వ పన్ను అనేది మధ్యతరగతికి గుదిబండలా మారుతుంది. వారి ఆశలను, ఆశయాలను చిదిమేస్తుంది. మధ్యతరగతికి చెందిన వ్యక్తులు కష్టపడిన సొమ్మును దాచుకుంటూ ఉంటారు. ఫిక్సడ్ డిపాజిట్లు, చిన్న మొత్తాల్లో పొదుపు చేసుకుంటూ ఉంటారు. సొంతింటి నిర్మాణం వంటి కలలను నెరవేర్చుకుంటూ ఉంటారు. భవిష్యత్ కోసం దాచుకోవడమే అప్పుడు పాపమవుతుంది. ఇలాంటి పన్నుల వల్ల ఈ పదేళ్లలో సాధించిన అభివృద్ధి కాస్తా వెనక్కి పోయి.. మళ్లీ సున్నాకు చేరుకోవాల్సి వస్తుంది’’ అని నిర్మలా సీతారామన్ అన్నారు. కాంగ్రెస్ హయాంలో 90 శాతం పన్నులు విధించిన రోజులు కూడా ఉన్నాయని చెప్పారు. 1968లో నిర్బంధ డిపాజిట్ స్కీమ్ ఉండేదని, 18-20 శాతం సొమ్మును డిపాజిట్ చేయాల్సి వచ్చేదని గుర్తు చేశారు.
పిట్రోడా ఏమన్నారు..?
అమెరికాలో వారసత్వ పన్ను (ఇన్హెరిటెన్స్ టాక్స్) అమల్లో ఉందని దీని ప్రకారం.. ఒక వ్యక్తి సంపాదనలో సుమారు 45 శాతమే అతని మరణానంతరం వారసులకు బదిలీ అవుతుందని, 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని, ఇది తనకు న్యాయంగా అనిపిస్తోందని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పిట్రోడా వ్యాఖ్యానించారు. ‘ఇదో ఆసక్తికర చట్టం. దీని ప్రకారం మీ సంపాదనలో ప్రజల కోసం కొంత వదిలేయాలి. భారత్లో మాత్రం ఎవరైనా వెయ్యికోట్ల డాలర్లు సంపాదించి చనిపోతే ఆయన వారసులకు ఆ వెయ్యికోట్ల డాలర్లూ వస్తాయి. ప్రజలకు ఏమీ లభించదు. ఇది చర్చించాల్సిన విషయం. సంపద పునఃపంపిణీ గురించి మాట్లాడేటప్పుడు కొత్త విధానాల గురించి ఆలోచించాలి. అవి ప్రజా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఉండాలి. ధనవంతుల ప్రయోజనాల కోసం కాదు’ అని ఆయన పేర్కొన్నారు. పిట్రోడా వ్యాఖ్యలపై దుమారం రేగడంతో కాంగ్రెస్కు ఎలాంటి సంబంధం లేదని, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయమని ఆ పార్టీ వివరణ ఇచ్చుకుంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కంగారులో కంగనా.. సొంత పార్టీ నేతపైనే విమర్శలు
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న భాజపా అభ్యర్థి కంగనా రనౌత్ కాస్త గందరగోళానికి గురయ్యారు. తేజస్వీ యాదవ్పై విమర్శలు గుప్పించే ప్రయత్నంలో తమ పార్టీ నేత తేజస్వీ సూర్యపై ఆరోపణలు చేశారు. -
దిల్లీ ప్రజలు భాజపాకు ఓటుతో సమాధానం చెప్తారు: ఆప్
తమ ముఖ్యమంత్రి కేజ్రీవాల్కు మద్దతుగా ఆప్ దిల్లీలో వాకథాన్ నిర్వహించింది. కార్యక్రమంలో పాల్గొన్న ఆప్ నాయకులు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. -
గాంధీ కుటుంబానికి నేనేం సేవకుడిని కాదు: అమేఠీ కాంగ్రెస్ అభ్యర్థి
తనను గాంధీ కుటుంబానికి ప్యూన్గా అభివర్ణించిన భాజపాపై కాంగ్రెస్ అమేఠీ అభ్యర్థి కేఎల్ శర్మ స్పందించారు. -
నాలుగో విడత బరిలో 476 మంది కోటీశ్వరులే.. టాప్-3 ఎవరంటే?
తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని 10 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో సార్వత్రిక ఎన్నికలు మే 13న జరగనున్నాయి. ఈ నేపథ్యంలో బరిలో నిలిచిన అభ్యర్థుల ఆస్తులు, కేసులు, ఇతర వివరాలను ఏడీఆర్ సంస్థ వెల్లడించింది. -
పీవోకేను బలవంతంగా స్వాధీనం చేసుకోవాల్సిన అవసరం లేదు: రాజ్నాథ్
Rajnath Singh: లోక్సభ ఎన్నికల నేపథ్యంలో భాజపా నేత, కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పీటీఐకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. పీవోకే, రిజర్వేషన్లు, రాజ్యాంగంలో మార్పుల వంటి పలు అంశాలపై స్పందించారు. -
ఆ రాష్ట్రంలో లోక్సభ బరిలో 12 మంది ఎమ్మెల్యేలు.. గెలిస్తే మరోసారి ఎన్నికలు
పంజాబ్లో 12 మంది ఎమ్మెల్యేలు లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. వీరిలో ఆప్ నుంచి 9 మంది ఉన్నారు. -
డబ్బుల్లేవ్... పోటీ చేయలేను
ఎన్నికల్లో పోటీకి సరిపడా డబ్బులు తన వద్ద లేవని..ఎన్నికల బరిలో ఉండలేనంటూ ఒడిశాలోని పూరీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి సుచరిత మహంతి తన టికెట్ను తిరస్కరించారు. -
రాయ్బరేలీలో రాహుల్ ఓటమి ఖాయం: అమిత్ షా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ రెండు స్థానాల నుంచి బరిలో దిగడంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా విమర్శలు గుప్పించారు. -
‘ఇండియా’ గెలుపు పక్కా
ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి విజయం సాధిస్తుందని కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్ ధీమా వ్యక్తం చేశారు. -
మైనార్టీల అడ్డాలు!
పశ్చిమ బెంగాల్లో రాజకీయాలు బాగా వేడెక్కాయి. రాష్ట్రంలో అత్యధిక లోక్సభ స్థానాలు దక్కించుకునేందుకు తృణమూల్ కాంగ్రెస్, భాజపా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాయి. -
గోధ్రా రైలు దహనకాండలో.. బాధ్యులను కాపాడజూసిన లాలూ
అరవైమందికి పైగా కరసేవకులను సజీవదహనం చేసిన 2002 నాటి గోధ్రా రైలు దహనకాండలో బాధ్యులైనవారిని కాపాడేందుకు సైతం ప్రతిపక్షాలు బుజ్జగింపు రాజకీయాలనే ఎంచుకున్నాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ధ్వజమెత్తారు. -
మేం మంగళసూత్రాలు లాక్కొనేంత దుష్టులమా?
ధికారంలో ఉండడం కోసం హిందువుల్లో భయం సృష్టించాలని ప్రధాని నరేంద్రమోదీ ప్రయత్నిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా ఆరోపించారు. -
ప్రజలతో సంబంధాలు తెగిపోయిన చక్రవర్తి మోదీ
కాంగ్రెస్ అగ్ర నేత, తన సోదరుడు రాహుల్ గాంధీని ‘యువరాజు’గా పేర్కొంటూ ప్రధాని మోదీ చేసిన విమర్శలకు ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా దీటుగా బదులిచ్చారు. -
10 వేలమంది అనుచరులతో సభ
ఉత్తర్ప్రదేశ్లోని కైసర్గంజ్ లోక్సభ స్థానానికి భాజపా తరఫున పోటీచేస్తున్న కరణ్ భూషణ్ శుక్రవారం నామినేషన్ దాఖలుచేశారు. -
మోతీలాల్ నెహ్రూపై కంగన అనుచిత వ్యాఖ్యలు
భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ తండ్రి మోతీలాల్ నెహ్రూను అంబానీతో పోలుస్తూ బాలీవుడ్ నటి, భాజపా లోక్సభ అభ్యర్థి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే రేపుతున్నాయి. -
సందేశ్ఖాలీ ఘటనలు భాజపా కుట్రే!
సందేశ్ఖాలీ ఘటనలు.. లోక్సభ ఎన్నికలకు ముందు పశ్చిమ బెంగాల్ ప్రతిష్ఠకు భంగం కలిగించడానికి భాజపా పన్నిన కుట్ర అని తృణమూల్ కాంగ్రెస్ ఆరోపించింది. -
సంక్షిప్త వార్తలు (5)
సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి దిల్లీ, హరియాణాకు ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) 40 మందితో ప్రచార తారల జాబితాను శనివారం ప్రకటించింది. -
దేశానికే హైదరాబాద్ గ్రోత్ సెంటర్
మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమై... ఇక ప్రమాణ స్వీకారం చేయడమే మిగిలిందన్న భరోసా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీలో కనిపిస్తోంది. -
ఉత్తరాదిన ఆ మూడు నియోజకవర్గాలు ప్రత్యేకం.. ప్రధాన పార్టీలను ఎన్నుకోని ప్రజలు..!
ఉత్తరాదిన ఓ మూడు నియోజకవర్గాల్లో ప్రజలు ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్లకు గత కొంతకాలంగా అవకాశం ఇవ్వడం లేదు. -
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారు: అమిత్ షా
రాయ్బరేలీలో రాహుల్ భారీ తేడాతో ఓడిపోతారని అమిత్ షా జోస్యం చెప్పారు. -
ఆప్ స్టార్ క్యాంపెయినర్ల జాబితాలో కేజ్రీవాల్, సునీత, సిసోదియా
ఆమ్ ఆద్మీ పార్టీ స్టార్ క్యాంపెయినర్ల జాబితాను ప్రకటించింది. కేజ్రీవాల్, సునీత, సిసోదియా వంటి వారి పేర్లు ఇందులో ఉన్నాయి.
తాజా వార్తలు
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!