PM Modi: చనిపోయాకా కాంగ్రెస్ మిమ్మల్ని దోచుకుంటుంది: మోదీ
కాంగ్రెస్ పార్టీపై ప్రధాని మోదీ మరోసారి విరుచుకుపడ్డారు. బతికున్నప్పుడు, చనిపోయాక కూడా ఆ పార్టీ మిమ్మల్ని దోచుకుంటుందని వ్యాఖ్యానించారు.
PM Modi | భోపాల్/ రాయ్పూర్: సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీపై మరోసారి విరుచుకుపడ్డారు ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi). ఆ పార్టీ మతం ఆధారంగా రిజర్వేషన్లు తీసుకురావాలని చూస్తోందన్నారు. ఈ తరహా రిజర్వేషన్లను రాజ్యాంగం కూడా వ్యతిరేకిస్తోందని గుర్తు చేశారు. అంబేడ్కర్ ఆశయాలకు కాంగ్రెస్ పార్టీ వెన్నుపోటు పొడుస్తోందని విమర్శించారు. సంపద పంపిణీపై కాంగ్రెస్ ఇచ్చిన హామీ గురించి శామ్పిట్రోడా చేసిన వ్యాఖ్యలను ఉటంకిస్తూ.. ‘చనిపోయాక కూడా మిమ్మల్ని కాంగ్రెస్ దోచుకుంటుంది’ అంటూ విరుచుకుపడ్డారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్లలో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో ఆయన బుధవారం మాట్లాడారు.
‘‘కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పిస్తోంది. ముస్లింలందరినీ ఓబీసీ కేటగిరీలో చేర్చి వారికి రిజర్వేషన్లు తీసుకొస్తోంది. ఓబీసీల నుంచి రిజర్వేషన్లను లాక్కుంటోంది. కాంగ్రెస్ చర్యలు మీ భవిష్యత్నే నాశనం చేస్తాయి. మతం ఆధారంగా రిజర్వేషన్లు కల్పించకూడదని రాజ్యాంగం చెప్తోంది. బాబాసాహెబ్ కూడా దీనికి పూర్తి వ్యతిరేకం. అయినా కాంగ్రెస్ పార్టీ దీన్ని తీసుకొచ్చేందుకు ఏళ్ల క్రితమే ప్రతినబూనింది. 2009, 2014 ఎన్నికల సమయంలోనే మతపరమైన రిజర్వేషన్లను తీసుకొస్తామని ఆ పార్టీ తన మ్యానిఫెస్టోలో పెట్టింది’’ అని మోదీ అన్నారు. అయోధ్య రామమందిర ప్రాణప్రతిష్ఠకు ఆహ్వానిస్తే దాన్ని తిరస్కరించిందన్నారు.
కాంగ్రెస్ పార్టీ సంపద పంపిణీ హామీని మోదీ మరోసారి లక్ష్యంగా చేసుకున్నారు. వారసత్వ పన్నుపై ఆ పార్టీ నేత శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యలను తాజాగా ప్రస్తావించారు. ‘‘కాంగ్రెస్ పార్టీ ఉద్దేశాలు ఒక్కొక్కటిగా బయటికొస్తున్నాయి. వారసత్వంగా వచ్చిన సంపదపై పన్నులు వేస్తామని కాంగ్రెస్ పార్టీ చెబుతోంది. మీరు కష్టపడి సంపాదించి పిల్లల కోసం దాచి పెట్టుకున్న సొమ్ము లాగేసుకోవడానికి ఆ పార్టీ సిద్ధమవుతోంది. మీరు బతికున్నప్పుడు మీ దగ్గర ట్యాక్సుల రూపంలో లాక్కుంటుంది. మీరు చనిపోయాక వారసత్వ పన్ను పేరిట మీ పిల్లల నుంచి ఆస్తులను తీసుకుంటుంది. ‘మీరు బతికున్నా.. చచ్చినా దోచుకోవడమే ఆ పార్టీ నైజం’ అంటూ మోదీ వ్యాఖ్యానించారు. ఆ పార్టీకి కుటుంబ విలువలు తెలియవని మండిపడ్డారు.
శామ్ పిట్రోడా ఏమన్నారు..?
సార్వత్రిక ఎన్నికల వేళ కాంగ్రెస్ నేత శామ్పిట్రోడా చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీని మరోసారి వివాదంలోకి నెట్టింది. అమెరికాలోని ఓ విధానాన్ని ఉటంకిస్తూ ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ‘‘అమెరికాలో వారసత్వ పన్ను ఉంది. ఒక వ్యక్తి దగ్గర 100 మిలియన్ల డాలర్ల విలువైన సొత్తు ఉందనుకుంటే.. ఆ వ్యక్తి మరణం తర్వాత అందులో సుమారు 45 శాతం మాత్రమే వారసులకు బదిలీ అవుతుంది. మిగిలిన 55 శాతాన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. అదొక ఆసక్తికరమైన అంశం. అంటే మీరు సంపదను సృష్టించి, వదిలివెళ్లిపోతున్నారు. ప్రజల కోసం దానిని వదిలేయాలి. మొత్తం కాదు సగమే. అది నాకు న్యాయంగా అనిపిస్తోంది’’ అని పిట్రోడా అన్నారు. దీంతో ప్రజలు చెమటోడ్చి సంపాదించిన సొమ్మును లాక్కోవాలనుకుంటున్నారంటూ భాజపా విమర్శల దాడికి దిగింది. ఆయన వ్యాఖ్యలు దుమారం రేపడంతో అది ఆయన వ్యక్తిగతమని, పార్టీకి ఎలాంటి సంబంధమూ లేదని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.