Political slogans: స్లో‘గన్’ అందుకుంటే పేలాల్సిందే.. జనాల్లో నాటుకుపోయిన నినాదాలివే!
Political slogans: ఎన్నికల వేళ ప్రచారమంతా ఒకెత్తయితే.. రాజకీయ నినాదాలు మరో ఎత్తు..! తమ మాటలు, విధానాలు జనంలోకి సూటిగా, సుత్తి లేకుండా వెళ్లేందుకు పార్టీలు వీటిని ప్రత్యేకంగా రూపొందిస్తాయి. మరి మన దేశ చరిత్రలో అలా గుర్తుండిపోయిన టాప్ స్లోగన్స్ ఏంటో తెలుసా?
ఇంటర్నెట్ డెస్క్: ‘అబ్కీ బార్ 400 పార్’.. తాజా సార్వత్రిక ఎన్నికల్లో భాజపా (BJP) విస్తృతంగా ప్రచారం చేస్తున్న నినాదం ఇది. ‘400 సీట్లతో మరోసారి అధికారంలోకి వస్తాం’ అనేది దాని సారాంశం. దేశ చరిత్రలో రాజకీయ నినాదం (Political slogans) అనేది ఎన్నికల ప్రక్రియలో అంతర్భాగమే. ఎన్నికలేవైనా సరే ఓటర్లకు చేరువ కావాలంటే పార్టీల ఉద్దేశాలు జనంలోకి వేగంగా వెళ్లాలి. అయితే, సుదీర్ఘ ప్రసంగాల కంటే సింగిల్ లైన్లో చెప్పే స్లోగన్స్ ప్రజలను ఎక్కువగా ఆకర్షిస్తాయి. నాటి ‘జై జవాన్... జై కిసాన్’ నుంచి నేటివరకు జనం నోళ్లలో నానిన నినాదాలను ఓసారి గుర్తుచేసుకుందాం..!
అబ్కీ బార్.. 400 పార్..
తాజా సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా మూడోసారి గెలిచి సరికొత్త చరిత్ర సృష్టించాలని భాజపా నేతృత్వంలోని ఎన్డీయే కూటమి యోచిస్తోంది. ఒక్క భారతీయ జనతా పార్టీనే 370 స్థానాల్లో గెలవాలని లక్ష్యంగా పెట్టుకున్న కమలదళం.. మొత్తంగా 400 సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తంచేస్తోంది. తమ లక్ష్యాలను ప్రజల్లోకి స్పష్టంగా తీసుకెళ్లేలా ఈ నినాదంతో భాజపా నేతలు విస్తృత ప్రచారం చేస్తున్నారు. గత ఎన్నికల్లోనూ భాజపా ‘ఫిర్ ఏక్ బార్ మోదీ సర్కార్’ స్లోగన్తో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే.
అచ్చే దిన్ ఆనే వాలే హై..
పదేళ్ల కాంగ్రెస్ను గద్దె దించి 2014లో మోదీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కారు అధికారంలోకి వచ్చింది. ఆ ఎన్నికల సమయంలో అప్పటి యూపీఏ పాలనలో లోపాలు, కుంభకోణాలను ఎత్తిచూపుతూ ‘అచ్చే దిన్ ఆనే వాలా హై’ అని భాజపా పిలుపునిచ్చింది. దీని అర్థం మంచి రోజులు వస్తున్నాయి అని. ఈ నినాదం ప్రజల్లోకి వెళ్లి భాజపాకు పట్టం కట్టబెట్టడంలో కీలక పాత్ర పోషించింది.
కాంగ్రెస్ కా హాథ్.. ఆమ్ ఆద్మీ కా సాథ్
2004లో కాంగ్రెస్ పార్టీకి అధికారం కల్పించిన నినాదం ఇది. వారి పార్టీ గుర్తయిన హస్తాన్ని ప్రత్యేకంగా తీసుకుని.. ‘కాంగ్రెస్ చేయి సామాన్యుడితోనే’ అనే అర్థంలో దీన్ని తీసుకొచ్చారు. ఇది విపరీతంగా ప్రజాదరణ పొందడంతో.. ఆ ఎన్నికల్లో మన్మోహన్ సింగ్ నేతృత్వంలో యూపీఏ కూటమి విజయం సాధించగలిగింది.
భారత్ వెలిగిపోతోంది..
ఈ నినాదం కూడా 2004 ఎన్నికల నాటిదే. వాజ్పేయీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి ‘ఇండియా షైనింగ్’ నినాదంతో ఎన్నికలకు వెళ్లింది. ప్రపంచ వేదికపై భారత ఆర్థిక ఆశావాదానికి సంకేతంగా దీన్ని తీసుకొచ్చారు. అప్పట్లో ఈ నినాదం జనం నోళ్లల్లో బాగానే నాటుకుపోయినప్పటికీ.. ఎన్డీయేకు మాత్రం విజయం అందించలేకపోయింది.
బారీ బారీ సబ్కీ బారీ.. అబ్కీ బారీ అటల్ బిహారీ
1996లో భారతీయ జనతా పార్టీ ఎన్నికలకు వెళ్లింది ఈ నినాదంతోనే. ‘అందరి వంతు అయిపోయింది.. ఇప్పుడు అటల్ బిహారీ వంతు’ అనేది దీనర్థం. లఖ్నవూలోని ఓ ఎన్నికల ప్రచారంలో వాజ్పేయీ ఈ నినాదమిచ్చారు. అప్పట్లో ఇది దేశవ్యాప్తంగా విపరీతంగా ప్రచారమైంది. అవినీతి మచ్చలేని ఆయన ప్రధాని అభ్యర్థిగా నిలబడిన ఆ ఎన్నికల్లో భాజపా విజయం సాధించింది. అయితే ఆ ప్రభుత్వం 13 రోజులకే కూలిపోయింది.
జబ్ తక్ సూరజ్ చాంద్ రహేగా.. ఇందిరా తేరా నామ్ రహేగా
1984లో అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటన తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ ఈ నినాదం ఇచ్చింది. ‘సూర్య చంద్రులు ఉన్నంతవరకు ఇందిరాగాంధీ పేరు గుర్తుండిపోతుంది’ అంటూ ఆమె కుమారుడు రాజీవ్గాంధీ ప్రజల్లోకి వెళ్లారు. ఇది బాగా పనిచేసి.. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 404 స్థానాలను దక్కించుకుంది. 77 ఏళ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఒక పార్టీ లేదా సంకీర్ణ ప్రభుత్వం కేంద్రంలో ఆ స్థాయిలో మెజార్టీ దక్కించుకోవడం అప్పుడే. ఆ తర్వాత ఇప్పటివరకు ఈ రికార్డును ఏ ప్రభుత్వం సాధించలేకపోయింది.
ఇందిరా హటావో.. దేశ్ బచావో..
1975-77 మధ్య అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ దేశంలో విధించిన ఎమర్జెన్సీతో కాంగ్రెస్పై తీవ్ర వ్యతిరేకత ఏర్పడింది. ఆ సమయంలో సోషలిస్ట్ నేత జయప్రకాశ్ నారాయణ్ ‘ఇందిరా హటావో.. దేశ్ బచావో (ఇందిరాను ఓడించాలి.. దేశాన్ని కాపాడాలి)’ అని పిలుపునిచ్చారు. ఈ నినాదంతోనే ప్రతిపక్షాలన్నీ జనతా పార్టీ కింద ఏకమై 1977 ఎన్నికల్లో విజయం సాధించాయి.
గరీబీ హటావో..
1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నినాదమిది. ‘పేదరికాన్ని పారద్రోలుదాం’ అంటూ ప్రజల్లోకి వెళ్లిన హస్తానికి ఆ ఎన్నికల్లో ఘన విజయం దక్కింది. అయితే, ఈ నినాదం ఇప్పటికీ ప్రాచుర్యంలోనే ఉంది. కాంగ్రెస్ పార్టీలో అత్యంత శక్తిమంతమైన నేత ఇచ్చిన ‘గరీబీ హటావో’ హామీ దేశ చరిత్రలోనే అతి పెద్ద బూటకమని ప్రధాని మోదీ సహా భాజపా నేతలు విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు.
జై జవాన్.. జై కిసాన్
దేశ రెండో ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి 1965లో యూపీలో జరిగిన ఓ సభలో ఈ నినాదమిచ్చారు. కుటుంబాలకు దూరంగా సరిహద్దుల్లో గస్తీ కాస్తూ దేశాన్ని కాపాడుతున్న జవాన్ల త్యాగాలు, దిగుమతులపై ఆధారపడకుండా ప్రజల ఆకలి తీరుస్తున్న రైతుల కష్టాన్ని కొనియాడుతూ ఆయన ఈ పిలుపునిచ్చారు. ఇక, 1998లో అప్పటి ప్రధాని వాజ్పేయీ ఈ నినాదాన్ని కాస్త మార్చి ‘జై జవాన్, జై కిసాన్, జై విజ్ఞాన్’ అని చేర్చారు. పోఖ్రాన్ అణు పరీక్షలతో మన దేశం చాటిన వైజ్ఞానిక సత్తాను అభినందిస్తూ వాజ్పేయీ ఈ నినాదమిచ్చారు.
వీటితో పాటు పలు రాజకీయ పార్టీలు సందర్భానికి అనుగుణంగా కొత్త కొత్త స్లోగన్లతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేశాయి. 2011లో తృణమూల్ కాంగ్రెస్ ‘మా మాటి మనుష్’ అని పిలుపునివ్వగా.. దిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ‘అచ్చే బీతే పాంచ్ సాల్.. లగే రహో కేజ్రీవాల్’ అని నినదించింది. అధికారంలో ఉండే పార్టీ అయితే తమ హయాంలోని అభివృద్ధిని చాటిచెబుతూ.. ప్రతిపక్షమైతే పాలనలో లోపాలను ఎత్తిచూపుతూ ఇలా స్లో‘గన్’లతో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నాయి.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
తదుపరి ప్రధాని అమిత్ షానే
దేశంలో రిజర్వేషన్లకు అంతం పలకడానికే తమకు 400 లోక్సభ సీట్లు కావాలని భాజపా కోరుకుంటోందని ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, దిల్లీ సీఎం కేజ్రీవాల్ పునరుద్ఘాటించారు. -
దేశాన్ని నడపడం కిరాణాకొట్టు నిర్వహణ కాదు: అమిత్ షా
విపక్ష ఇండియా కూటమి ఒకవేళ అధికారంలోకి వచ్చినట్లయితే ఏడాదికొకరు చొప్పున ప్రధాని పదవిని పంచుకోవాలని అనుకుంటున్నారని, దేశాన్ని నడపడమంటే కిరాణాకొట్టు నిర్వహణలాంటిది కాదని కేంద్ర హోంమంత్రి అమిత్షా పేర్కొన్నారు. -
4 తర్వాత ఇండియా కూటమి ముక్కచెక్కలు
లోక్సభ ఎన్నికల ఫలితాలు వెలువడిన తర్వాత ‘ఇండియా’ కూటమి ముక్కచెక్కలు అవుతుందని ప్రధాని మోదీ జోస్యం చెప్పారు. ఓటమి అనంతరం ఎవరిని బలి పశువు చేయాలా అని కూటమి చూస్తుందన్నారు. -
మోదీజీ...యూపీలో నిరుద్యోగం ఎందుకు పెరుగుతోంది?
డబుల్ ఇంజిన్ ప్రభుత్వంతో అభివృద్ధి పరుగులు పెడుతుందని చెబుతున్న మీరు ఉత్తర్ప్రదేశ్లో తిష్ఠవేసిన సమస్యలకు ఏం సమాధానం చెబుతారు. -
‘ఆరో విడత’లో 338మంది కోటీశ్వరులు.. అత్యల్ప ఆస్తి రెండు రూపాయలే!
లోక్సభ ఆరో విడత స్థానాల్లో పోటీ పడుతున్న అభ్యర్థుల్లో 338 మంది (39 శాతం) కోటీశ్వరులేనని ‘అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ADR)’ తెలిపింది. -
యూపీలోనూ ‘టీఎంసీ’ తరహా రాజకీయాలకు యత్నం.. విపక్షాలపై మోదీ ధ్వజం
జూన్ 4న తర్వాత ‘ఇండియా’ కూటమి విచ్ఛిన్నమవుతుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. -
షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారు.. : కేజ్రీవాల్
Arvind Kejriwal: మోదీ రిటైర్మెంట్ గురించి కేజ్రీవాల్ మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. షా కోసమే మోదీ ఓట్లడుగుతున్నారని అన్నారు. -
ప్రధానిపై పోటీ.. కమెడియన్ శ్యామ్ రంగీలాకు షాక్
Varanasi: వారణాసి నుంచి ప్రధానిపై పోటీకి దిగిన కమెడియన్ శ్యామ్ రంగీలా నామినేషన్ తిరస్కరణకు గురైంది. -
400 సీట్లు గెలిస్తే.. పీవోకే విలీనం ఖాయం: హిమంత
సార్వత్రిక ఎన్నికల్లో భాజపా 400 సీట్లు గెలిస్తే.. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) భారత్లో విలీనం ఖాయమని అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ పేర్కొన్నారు. -
అధికారంలోకి వచ్చేది మేమే
కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీయే ప్రభుత్వమే కేంద్రంలో ఈసారి ముమ్మాటికీ రాబోతోందని ఆ పార్టీ అగ్రనేతలు ధీమా వ్యక్తం చేశారు. -
రాహుల్పై ఈసీకి భాజపా ఫిర్యాదు
రెండు రకాల సైనికులను మోదీ సర్కారు తీసుకువచ్చిందని చెప్పినందుకు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీపై అత్యంత కఠిన చర్య తీసుకోవాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని భాజపా కోరింది. -
ప్రపంచంలో ధనిక పార్టీ భాజపా
కాంగ్రెస్ అవినీతి పార్టీ అని భాజపా అంటుంది. కానీ నిజానికి పదేళ్లలోనే ప్రపంచంలో ధనికమైన పార్టీగా ఎదిగింది భాజపాయే. 55 ఏళ్లపాటు పాలించినా కాంగ్రెస్ అలా కాలేకపోయింది. -
నటుడిపై తల్లి పోటీ.!
బిహార్లోని కారాకట్ లోక్సభ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. ఇక్కడ ప్రముఖ భోజ్పురి గాయకుడు, నటుడు పవన్సింగ్ పోటీకి దిగగా.. తాజాగా ఆయన తల్లి ప్రతిమాదేవి అదే స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేయడం గమనార్హం. -
అధికారం కోసం మోదీ దేశాన్ని విభజిస్తున్నారు
ప్రధాని మోదీ అధికారంలో కొనసాగడం కోసం దేశాన్ని విభజిస్తున్నారని నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా విమర్శించారు. -
నేను జైలుకెళ్లడం ముఖ్యం కాదు.. రాజ్యాంగం భద్రంగా ఉండడమే ప్రధానం
కేంద్రంలో విపక్ష ఇండియా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే అది దేశ అభ్యున్నతికి కృషి చేస్తుందని దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. -
కేజ్రీవాల్ బెయిల్ తీర్పు అసాధారణం
మద్యం కుంభకోణంలో అరెస్టైన అరవింద్ కేజ్రీవాల్కు సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన మధ్యంతర బెయిల్ ఉత్తర్వులపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇండియా కూటమికి వెలుపలి నుంచి మద్దతు: మమత
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే వెలుపలి నుంచి తమ పార్టీ మద్దతు అందిస్తుందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చెప్పారు. -
కాంగ్రెస్ మత ప్రాతిపదికన బడ్జెట్ కేటాయింపులు కోరుకుంటోంది
కేంద్ర బడ్జెట్ కేటాయింపులు మత ప్రాతిపదికన ఉండాలని కాంగ్రెస్ కోరుకుంటున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆరోపించారు. కానీ అలా బడ్జెట్ను విభజించడాన్ని తాను అనుమతించబోనని ఉద్ఘాటించారు. -
నటుడిపై తల్లి పోటీ.. అక్కడ పోరు ఆసక్తికరం!
ప్రముఖ భోజ్పురి నటుడు, సింగర్ పవన్సింగ్ పోటీ చేస్తున్న నియోజకవర్గం నుంచి తాజాగా ఆయన తల్లి నామినేషన్ వేశారు. -
ఇండియా కూటమికి బయటి నుంచి మద్దతిస్తాం: మమతా బెనర్జీ
సార్వత్రిక ఎన్నికల్లో ఇండియా కూటమి గెలుపొందితే దానికి తమ పార్టీ సహకారం అందిస్తుందని బెంగాల్ ముఖ్యమమంత్రి మమతా బెనర్జీ అన్నారు. -
కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ‘అసాధారణమే’: అమిత్ షా
దిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కు మధ్యంతర బెయిల్ ఇస్తూ న్యాయస్థానం ఇచ్చిన తీర్పు అసాధారణంగా కనిపిస్తోందని కేంద్రమంత్రి అమిత్ షా అన్నారు.
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-1.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-6.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-7.png)
![img](https://assets.eenadu.net/_assets/_images/banners/general-ele-4.png)
తాజా వార్తలు
-
మా పాలన బాగా లేదని చెబితే సరిపోతుందా?.. ఆధారాలు చూపండి: హరీశ్రావు
-
నాపై కాల్పులు జరిగిన చోటే ర్యాలీ నిర్వహిస్తా: ట్రంప్
-
ఏపీకి ఐపీఎస్ కేడర్ స్ట్రెంత్ పెంపు
-
‘రాయన్’ సక్సెస్.. ఫొటో వైరల్
-
నీతి ఆయోగ్ భేటీ.. వికసిత్ ఏపీ-2047లోని అంశాలను ప్రస్తావించనున్న చంద్రబాబు
-
ప్రధాని మోదీ అధ్యక్షతన నీతి ఆయోగ్ సమావేశం ప్రారంభం