PM Narendra Modi: 26,000 మంది జీవితాలతో టీఎంసీ చెలగాటం: ప్రధాని మోదీ విమర్శలు
పశ్చిమబెంగాల్లో ఉద్యోగ నియామకాల కుంభకోణంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్రంగా మండిపడ్డారు. మమతా సర్కారు 26 వేల మంది జీవితాలతో ఆడుకుంటోందన్నారు.
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమ బెంగాల్లోని మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ (TMC) ప్రభుత్వం 26,000 మంది బతుకుదెరువుతో ఆటలాడుతోందని ప్రధాని మోదీ (PM Modi) మండిపడ్డారు. ఆయన శుక్రవారం మాల్డాలో నిర్వహించిన బహిరంగ సభలో మాట్లాడుతూ రాష్ట్రంలోని స్కూల్ జాబ్స్ స్కాంపై మమతా సర్కార్ను తప్పుపట్టారు.
ఈసందర్భంగా మోదీ మాట్లాడుతూ ‘‘పశ్చమబెంగాల్ యువత జీవితాలతో టీఎంసీ చెలగాటమాడింది. నియామకాల్లో భారీ కుంభకోణం కారణంగా 26,000 మంది పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. అప్పులు చేసి టీఎంసీకి లంచాలు చెల్లించి ఉద్యోగాల్లో చేరినవారు ఇప్పుడు వీధిన పడ్డారు. కేంద్రంలోని భాజపా ప్రభుత్వం మాత్రమే యువతలో నైపుణ్యాలు పెంచి ఉద్యోగాలు కల్పిస్తోంది.
ఒకప్పుడు దేశం మొత్తానికి సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక అభివృద్ధిలో బెంగాల్ ఆదర్శంగా నిలిచింది. తొలుత వామపక్ష కూటమి, తర్వాత టీఎంసీ పాలన ఇక్కడి అభివృద్ధిని పూర్తిగా కుంటుబరిచాయి. మమతా సర్కారు హయాంలో వేల కోట్ల కుంభకోణాలకు రాష్ట్రం వేదికగా మారింది. వీటిల్లో శారదా, రోజ్ వ్యాలీ, రేషన్ స్కాం, నియామకాల కుంభకోణం వంటివి చోటుచేసుకొన్నాయి. ప్రతిచోటా అవినీతిమయంగా మార్చేసింది. కమీషన్లు లేకుండా బెంగాల్లో ఏ పనీ జరగదు.
టీఎంసీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల సొమ్మును దోచుకొనే ఏ అవకాశాన్ని వదులుకోలేదు. కేంద్రం నుంచి నిధులు సేకరించింది. కేంద్ర పథకాలను రాష్ట్రంలో అమలుకాకుండా అడ్డుకొన్నారు. ప్రజాసంక్షేమాన్ని ఆ పార్టీ ఏమాత్రం పట్టించుకోదు. రాష్ట్రంలోకి వందేభారత్ రైళ్లను రానీయలేదు. మహిళల నమ్మకాన్ని టీఎంసీ వమ్ము చేసింది. మాల్డాలో మహిళలపై అరాచకాలను ప్రభుత్వం చూస్తూ ఊరుకొంది. సందేశ్ఖాలీలో ఆడవారిపై అత్యాచారాలకు పాల్పడిన నిందితుడిని ఆ పార్టీ రక్షించింది. బుజ్జగింపు రాజకీయాల కోసం టీఎంసీ, ఇండియా కూటమి ఎంతవరకైనా వెళతాయి. వారు అధికారంలోకి వస్తే సీఏఏను రద్దు చేస్తారట’’ అని ప్రధాని మోదీ తన ప్రసంగంలో పేర్కొన్నారు.
పశ్చిమబెంగాల్లో ప్రభుత్వ ప్రాయోజిత, ఎయిడెడ్ పాఠశాలల్లో నియామకాల కోసం 2016లో నిర్వహించిన రాష్ట్ర స్థాయి ఎంపిక పరీక్ష (ఎస్ఎల్ఎస్టీ)పై కలకత్తా హైకోర్టు ఇటీవల సంచలన తీర్పు వెలువరించింది. నాటి పరీక్ష ద్వారా జరిపిన పాతిక వేలకుపైగా నియామకాలు చెల్లవని స్పష్టం చేసింది. వాటిని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. నాడు 24,640కి మించి ఇతర ఖాళీలకు ఎంపికైనవారిని, నియామక గడువు ముగిశాక ఉద్యోగం పొందినవారిని, ఖాళీ ఓఎంఆర్ షీట్లు సమర్పించినా ఉద్యోగం వచ్చినవారిని అవసరమైతే కస్టడీలోకి తీసుకొని మరీ విచారణ జరపాలని సూచించింది. ఇప్పటివరకు తీసుకొన్న జీతాలను కూడా వాపస్ ఇవ్వాలని ఆదేశించింది.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఖలిస్థానీ అనుకూల గ్రూపుల నుంచి నిధుల స్వీకరణ.. కేజ్రీవాల్పై ఎన్ఐఏ దర్యాప్తు..!
ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ చిక్కులు మరింత పెరగనున్నాయి. ఈసారి ఎన్ఐఏ ఆయనపై దర్యాప్తు చేపట్టే అవకాశం ఉంది. -
రామమందిర తీర్పును మార్చేందుకు రాహుల్ యత్నం: కాంగ్రెస్ బహిష్కృత నేత ఆరోపణలు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్పై ఆ పార్టీ మాజీ నేత ఒకరు సంచలన ఆరోపణలు చేశారు. -
‘కంగనకు కాస్త చరిత్ర చెప్పండి’: భాజపాకు కాంగ్రెస్ నేత సలహా
భాజపా నేత కంగనా రనౌత్ (Kangana Ranaut)పై కాంగ్రెస్ నేత ఒకరు తీవ్ర విమర్శలు చేశారు. ఆమెకు కొంచెం చరిత్ర చెప్పాలని సూచించారు. -
మూడో దశ.. ములాయం కుటుంబం నుంచి ముగ్గురు.. గెలుపు వరించేనా..?
యూపీలో మూడో దశ పోలింగ్లో భాగంగా 10 నియోజకవర్గాలకు మే7న పోలింగ్ జరగనుంది. -
ఎస్పీ కంచుకోట ‘మైన్పురీ’
సమాజ్వాదీ పార్టీకి ‘మైన్పురీ’ నియోజకవర్గం కంచుకోటలా ఉంది. ఇక్కడినుంచి ఆ పార్టీ అధినేత సతీమణి డింపుల్ యాదవ్ తిరిగి పోటీ చేస్తున్నారు. -
బీజేడీ హయాంలోనూ దోపిడీ.. నవీన్ పట్నాయక్పై మోదీ విమర్శలు
కాంగ్రెస్, బీజేడీ ప్రభుత్వాలు సంపదను దోచుకుని ఒడిశాను పేద రాష్ట్రంగా మార్చాయని ప్రధాని నరేంద్ర మోదీ ఆరోపించారు. -
అక్కడ ‘నోటా’కు ఓటెయ్యాలంటోన్న కాంగ్రెస్!
మధ్యప్రదేశ్లో ఇందౌర్లో ఓటింగ్ శాతాన్ని పెంచేందుకు భాజపా ప్రయత్నాలు చేస్తుండగా.. కాంగ్రెస్ మాత్రం ‘నోటా’కు ఓటేయాలని ప్రచారం చేస్తుండటం గమనార్హం. -
కాంగ్రెస్ అమేఠీ కార్యాలయంపై దాడి.. వాహనాలు ధ్వంసం
అమేఠీలోని కాంగ్రెస్ కార్యాలయంపై దుండగులు ఆదివారం దాడి చేసినట్టుగా పార్టీ పేర్కొంది. -
యాదవ్ల కంచుకోటలో బిహార్ సీఎం నీతీశ్కు పరీక్ష..!
మాధేపుర నియోజకవర్గంలో మరోసారి జేడీయూ అభ్యర్థిని గెలిపించుకోవడం.. బిహార్ సీఎం నీతీశ్కుమార్ నాయకత్వానికి పరీక్షగా మారింది. -
అమితాబ్ తర్వాత అంతటి గౌరవం దక్కింది నాకే : కంగనా
సినీ పరిశ్రమలో తాను అమితాబ్ బచ్చన్తో సమానమైన గౌరవాన్ని పొందానని కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. -
33 ఏళ్లుగా రాజకీయ వైరం.. అక్కడ ఆ రెండు కుటుంబాల మధ్యే పోటీ!
కర్ణాటకలో శివమొగ్గ నియోజకవర్గం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. మూడు దశాబ్దాలుగా ప్రధానంగా రెండు కుటుంబాల మధ్యే ఇక్కడ పోటీ నెలకొంది. -
రాజకీయ క్రీడాకలాపం!
మన దేశంలో రాజకీయాలకు, క్రీడలకు అవినాభావ సంబంధం ఉంది. ఎందరో క్రీడాకారులు రాజకీయాల్లోకి వచ్చి రాణించిన సందర్భాలున్నాయి. -
గుజరాత్లో ‘గాంధీ’ వ్యూహం..!
రాజకీయాల్లో నెగ్గడానికి ఒక్కో రాజకీయ నేత ఒక్కో వ్యూహం అనుసరిస్తారు. గుజరాత్లో నవ్సారీ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి కూడా తాను నెగ్గడానికి ఓ ప్రణాళిక తయారు చేసుకున్నారు. -
ముస్లింలకు ఒక్క సీటూ ఇవ్వని కాంగ్రెస్
గుజరాత్ లోక్సభ ఎన్నికల్లో 35 మంది ముస్లిం అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇందులో ఒక్కరూ ప్రధాన పార్టీలైన భాజపా, కాంగ్రెస్ నుంచి పోటీ చేయడం లేదు. -
కాంగ్రెస్ మీడియా సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా
కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి ఆ పార్టీ మీడియా విభాగం జాతీయ సమన్వయకర్త రాధికా ఖేడా రాజీనామా చేశారు. అయోధ్యలోని రామమందిరాన్ని సందర్శించినందుకు పార్టీ నేతల నుంచి తాను వ్యతిరేకతను ఎదుర్కొంటున్నట్లు ఆమె ఆరోపించారు. -
తెల్ల టీషర్టే ఎందుకు ధరిస్తానంటే?
రాజకీయ ప్రత్యర్థుల పరస్పర విమర్శలు, ఆరోపణలతో సార్వత్రిక ఎన్నికల ప్రచారం గరంగరంగా మారిన వేళ.. ఆ వేడి నుంచి ఉపశమనం కలిగించటానికా అన్నట్లు కాంగ్రెస్ పార్టీ..రెండు నిమిషాలకు మించిన నిడివి గల ఓ వీడియోను విడుదల చేసింది. -
మూడోదశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో మూడోదశ కింద 12 రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాల్లో 94 స్థానాలకు మంగళవారం జరగబోయే పోలింగుకు సంబంధించి ప్రచార పర్వానికి ఆదివారం సాయంత్రం తెరపడింది. -
మతపరమైన రిజర్వేషన్లతో మరోమారు దేశ విభజన ముప్పు
‘‘కేంద్ర ప్రభుత్వం అమలుచేస్తున్న పీఎం ఆవాస్ యోజన, ఉజ్వల యోజన.. ఇలా ఏ పథకమైనా వివక్ష లేకుండా అందరికీ అందుతున్న విషయాన్ని ముస్లిం సోదర సోదరీమణులు గమనిస్తున్నారు. -
సంక్షిప్త వార్తలు (7)
గిరిజనులు, దళితులు, వెనుకబడిన వర్గాలవారి నుంచి రిజర్వేషన్లను లాక్కొని.. బుజ్జగింపు రాజకీయాల్లో భాగంగా ముస్లింలకు వాటిని ఇవ్వడమే కాంగ్రెస్ ఎజెండా. -
కేజ్రీవాల్ గొంతు నొక్కేయడానికే అరెస్టు
ఎన్నికలకు ముందు గొంతు నొక్కేయాలన్న ఉద్దేశంతోనే దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ను అరెస్టు చేశారని ఆయన భార్య సునీతా కేజ్రీవాల్ ఆరోపించారు. -
సొంత పార్టీ నేతపై ‘విమర్శ’
హిమాచల్ప్రదేశ్లోని మండీ లోక్సభ స్థానం నుంచి భాజపా అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ఎన్నికల ప్రచారంలో కాస్త గందరగోళానికి గురయ్యారు.
తాజా వార్తలు
-
నరైన్ నవ్వడెందుకు.. సహచరులు చెప్పిన విశేషాలు..!
-
25 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటున్నా.. ఇలా చేయడం బాధగా ఉంది: కరణ్ జోహార్
-
దేవకన్యలా జాన్వీకపూర్.. అందమైన ఫొటోతో దివి ప్రేమ
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (07/05/24)
-
టీ20 వరల్డ్ కప్ జెర్సీ రివీల్.. మాకు ముందే తెలుసంటూ నెటిజన్స్ ట్రోల్స్!
-
గుడ్న్యూస్ చెప్పిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ టీమ్.. అది ఏంటంటే..