Lok Sabha polls: ఓటరు స్ఫూర్తి చాటిన ‘సైలెంట్ విలేజ్’..!
ఊరిలో సగం మంది బధిరులే. అయితేనేం.. ప్రజాస్వామ్య పండగలో పాల్గొనేందుకు తమ వైకల్యం అడ్డుకాదంటూ ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు.
ఇంటర్నెట్ డెస్క్: జమ్మూ-కశ్మీర్ (Jammu Kashmir) డోడా జిల్లాలోని ఓ గ్రామం. ఆ ఊరిలో దాదాపు సగం మంది బధిరులే. అయితేనేం.. ప్రజాస్వామ్య పండగలో పాల్గొనేందుకు తమ వైకల్యం అడ్డుకాదంటూ ఉత్సాహంగా పోలింగ్లో పాల్గొన్నారు. వీరిలో అనేక మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకోవడం విశేషం. అన్ని వనరులున్నా పోలింగ్ కేంద్రానికి వెళ్లాలంటేనే బద్ధకిస్తున్న జనం ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో.. ఓటు హక్కును వినియోగించుకుంటూనే తమ చిరకాల డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు.
మంచు పర్వతాల్లో ఉన్న ధడ్కాహి గ్రామంలో గుజ్జర్లు నివసిస్తున్నారు. ఇది ఉధంపుర్ లోక్సభ (Lok Sabha Elections) స్థానం పరిధిలో ఉంది. ఇక్కడ 105 కుటుంబాలు నివసిస్తున్నాయి. అందులో 55 కుటుంబాల్లో కనీసం ఒకరు పుట్టుకతో మూగ లేదా చెవుడు సమస్యను ఎదుర్కొంటున్నారు. ఆ గ్రామంలో మొత్తం 84 మంది బధిరులు ఉన్నారు. వారిలో 43 మంది మహిళలు, 14 మంది పదేళ్లలోపు చిన్నారులే. అందుకే ఈ గ్రామానికి ‘సైలెంట్ విలేజ్’గా పేరుపడింది. ఇక్కడ ఈ తరహా పరిస్థితులను తొలిసారిగా 1939లోనే గుర్తించారు.
తాజా ఎన్నికల్లో ఉత్సాహంగా ఓటేసిన బధిరులు.. నేతలు తమ గ్రామానికి కనీస మౌలిక సదుపాయాలు కల్పిస్తారనే చిన్న ఆశ ఉందన్నారు. రోడ్డు మార్గం, ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయులు, ఆరోగ్యకేంద్రంలో వైద్యులను అందుబాటులో ఉంచడంతోపాటు పుట్టుకతో సమస్యను ఎదుర్కొంటున్న తమకు ఓ బధిర పాఠశాల ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ తమ డిమాండ్లు నెరవేర్చకపోతే భవిష్యత్లో జరిగే ఎన్నికలను బహిష్కరిస్తామని హెచ్చరించడం గమనార్హం.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
20 ఏళ్ల తర్వాత పోటీ.. దిల్లీలో కీలక పదవిపై కన్ను..!
శివరాజ్ సింగ్ చౌహాన్ విదిశా లోక్సభ నియోజకవర్గం నుంచి బరిలో ఉన్నారు. గతంలో ఆయన ఇక్కడినుంచి ఐదుసార్లు గెలుపొందారు. -
‘టీఎంసీ’ కంటే ‘భాజపా’కు ఓటేయడమే ఉత్తమం - కాంగ్రెస్ సీనియర్ నేత అధీర్
తృణమూల్ (TMC) కంటే భాజపాకు ఓటు వేయడం ‘ఉత్తమం’ అని సీనియర్ కాంగ్రెస్ నేత అధీర్ రంజన్ చౌధరి వ్యాఖ్యానించడంపై టీఎంసీ మండిపడింది. -
మహాత్మాగాంధీ కోరికను ప్రజలు నెరవేర్చనున్నారు: రాజ్నాథ్ సింగ్
మహాత్మాగాంధీ ఆశయాన్ని దేశ ప్రజలు నెరవేర్చి, ఎన్నికల్లో కాంగ్రెస్ను దేశ రాజకీయాల నుంచి తుడిచిపెడతారని భాజపా నేత, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ గురువారం అన్నారు. -
అక్కడ పోటీకి రాహుల్, ప్రియాంక ఎందుకు వెనుకంజ వేస్తున్నారు..? కారణాలేంటి..?
అమేఠీ, రాయ్బరేలీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. -
వారణాసిలో మే 13న మోదీ నామినేషన్..!
PM Modi: ప్రధాని మోదీ ఈనెల 13న వారణాసిలో నామినేషన్లో వేయనున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు భాజపా వర్గాలు వెల్లడించాయి. -
రిజర్వేషన్లను రద్దు చేయం.. చేయనివ్వం: అమిత్ షా
రిజర్వేషన్లను రద్దు చేసే ఉద్దేశం మోదీ సర్కార్కు లేదని కేంద్రమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. అలా ఎవరూ చేసినా సహించమని పేర్కొన్నారు. -
ఎన్నికల్లో మోదీపై పోటీకి దిగనున్న మిమిక్రీ ఆర్టిస్ట్ శ్యామ్ రంగీలా
దేశవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మక పోరు జరుగుతున్న లోక్ సభ స్థానాల్లో ప్రధాని మోదీ పోటీ చేస్తున్న వారణాసి ముందు వరుసలో ఉంటుంది. -
పోలింగ్కు ముందే పలుచోట్ల కాంగ్రెస్కు ఎదురుదెబ్బలు
పోలింగ్కు ముందే పలుచోట్ల కాంగ్రెస్కు సవాళ్లు ఎదురవుతున్నాయి. నేతలు పార్టీలు మారడం.. చివరి నిమిషంలో నామినేషన్ ఉపసంహరించుకోవడంతో హస్తం పార్టీకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. -
24 గంటల్లో అమేఠీ, రాయ్బరేలీపై నిర్ణయం: కాంగ్రెస్
కాంగ్రెస్ 24 గంటల్లో అమేఠీ, రాయ్బరేలీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేయనుంది. ఈ విషయాన్ని పార్టీ సీనియర్ నాయకుడు వెల్లడించారు. -
దిల్లీలో కాంగ్రెస్కు ‘ఆప్’సోపాలు.. పొత్తుపై అసంతృప్తితో పార్టీని వీడుతున్న నేతలు
దిల్లీలో ఆప్తో పొత్తు కాంగ్రెస్ అంతర్గత సమస్యలకు దారి తీస్తోంది. ఆ పార్టీ కీలక నేతలు రాజీనామాలు చేస్తున్నారు. -
మాకు 400+ స్థానాలు ఖాయం
లోక్సభ ఎన్నికల్లో భాజపా 400 పైచిలుకు స్థానాల్లో విజయం సాధించబోతోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ధీమా వ్యక్తం చేశారు. -
కంటి శస్త్రచికిత్స కారణంగానే ప్రచారానికి దూరంగా రాఘవ్ చడ్డా
తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చడ్డాకు తీవ్ర కంటి సమస్య ఉండడంతో చికిత్స చేయించుకోవడానికి ఆయన లండన్ వెళ్లారని దిల్లీ మంత్రి, ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ తెలిపారు. -
ఓట్ జిహాద్కు ఎస్పీ నేత పిలుపు
ఉత్తర్ప్రదేశ్లోని ఫరూఖాబాద్ లోక్సభ నియోజకవర్గంలో ఇండియా కూటమి అభ్యర్థి నావల్ కిశోర్ శాక్యను గెలిపించేందుకు సమాజ్వాదీ పార్టీ (ఎస్పీ) నాయకురాలు మరియా ఆలం ‘ఓట్ జిహాద్’కు పిలుపునిచ్చారు. -
యువ ఓటర్ల చైతన్యానికి మ్యూజికల్ బ్యాండ్ల ఏర్పాటు
యువ ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకునేలా ప్రోత్సహించేందుకు హరియాణా వినూత్న చర్య చేపట్టింది. -
దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షుడిగా దేవేందర్ యాదవ్
దిల్లీ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ(డీపీసీసీ) తాత్కాలిక అధ్యక్షుడిగా మాజీ ఎమ్మెల్యే దేవేందర్ యాదవ్ను కాంగ్రెస్ నియమించింది. ఈ విషయాన్ని పార్టీ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
ఎంపీ ప్రజ్వల్పై ఎట్టకేలకు వేటు
మహిళలపై లైంగిక దౌర్జన్యానికి పాల్పడ్డారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటకలోని హాసన ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను జనతా దళ్ (సెక్యులర్) అధినాయకత్వం మంగళవారం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. -
ప్రజ్వల్పై చర్యల్లో జాప్యమెందుకు?
మహిళలపై లైంగికదాడి విషయంలో ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణపై కర్ణాటక ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని కేంద్ర హోంమంత్రి అమిత్షా ప్రశ్నించారు. -
అనంత్నాగ్-రాజౌరీ ఎన్నిక మే 25కు వాయిదా
ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో ఏర్పాట్లు కష్టమయ్యేలా ఉండడంతో జమ్మూ-కశ్మీర్లోని అనంత్నాగ్-రాజౌరీ లోక్సభ స్థానంలో ఎన్నికలను మే 25వ తేదీకి వాయిదా వేయాలని ఈసీ మంగళవారం నిర్ణయించింది. -
లోక్సభ బరిలో ఆనంద్ శర్మ.. గురుగ్రాం నుంచి రాజ్బబ్బర్
కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఆనంద్శర్మ తొలిసారి లోక్సభకు పోటీ చేయనున్నారు. హిమాచల్ప్రదేశ్లోని కాంగ్డా నుంచి ఆయన బరిలో దిగనున్నారు. -
అమేఠీ, రాయ్బరేలీల్లో కొనసాగుతున్న ఉత్కంఠ
ఉత్తర్ప్రదేశ్లో గాంధీల కుటుంబానికి కంచుకోటల్లాంటి అమేఠీ, రాయ్బరేలీ లోక్సభ నియోజకవర్గాల్లో కాంగ్రెస్ అభ్యర్థులుగా ఎవరు బరిలో దిగుతారనేదానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. -
కాంగ్రెస్ విభజన వాదాన్ని ప్రజల్లో ఎండగట్టండి
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీల రిజర్వేషన్ కోటాను లాక్కొని తన ఓటుబ్యాంకు వర్గానికి కట్టబెట్టాలని చూస్తున్న కాంగ్రెస్ ఉద్దేశాన్ని ప్రజల్లో ఎండగట్టాలని సూచిస్తూ భాజపా సారథ్యంలోని ఎన్డీయే కూటమి లోక్సభ అభ్యర్థులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తాజాగా వ్యక్తిగత లేఖలు రాశారు.
తాజా వార్తలు
-
వాట్సప్లో కొత్త ఖాతాల నుంచి సందేశాలు రావిక..?
-
#ఆఫీస్ పికాకింగ్.. కార్పొరేట్ ప్రపంచంలో మరో ట్రెండ్.. ఏమిటిది?
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (02/05/24)
-
‘అద్దె ఇల్లే సో బెటరు’.. కారణం చెప్పిన బాంబే షేవింగ్ కంపెనీ సీఈఓ
-
గూగుల్తో ఇంగ్లిష్ ప్రాక్టీస్.. కొత్త ఏఐ ఫీచర్ను ఎలా వాడాలి?
-
స్విమ్మింగ్ పూల్లో కేథరిన్.. సముద్ర తీరాన శ్రీనిధి