Mamata Banerjee: ప్రజలను భయపెట్టి మమత గెలవాలనుకుంటున్నారు: నడ్డా
ప్రజలను బెదిరించి టీఎంసీ ఎన్నికలు గెలిచే అవకాశాల్లేవని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా పేర్కొన్నారు. ఆయన సందేశ్ఖాలీ పరిణామాలపై స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఇంటర్నెట్డెస్క్: పశ్చిమబెంగాల్లోని మమతా ప్రభుత్వం ప్రజలను భయపెట్టి ఎన్నికల్లో గెలవాలనుకుంటుందా..? అని భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రశ్నించారు. ఆయన సందేశ్ఖాలీలో ఆయుధాల స్వాధీనంపై స్పందిస్తూ ఆదివారం ఈ వ్యాఖ్యలు చేశారు. ఆ రాష్ట్రంలో భాజపా 35 నుంచి 42 వరకు లోక్సభ స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని పేర్కొన్నారు. టీఎంసీ మాజీ నాయకుడు షాజహాన్ షేక్ అరాచకాలకు గురైన బాధిత మహిళలకు నడ్డా సంఘీభావం తెలిపారు. షాజహాన్ షేక్ బాధితుల్లో ఒక మహిళకు లోక్సభ టికెట్ కూడా ఇచ్చామన్నారు. భయపెట్టి విజయం సాధించాలనుకుంటే మమత బెనర్జీకి సాధ్యం కాదని పేర్కొన్నారు. ఆమెకు ప్రజలు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.
ఇటీవల సందేశ్ఖాలీలో షాజహాన్కు చెందిన ప్రదేశాల్లో సీబీఐ తనిఖీలు నిర్వహించి ఆయుధాలను స్వాధీనం చేసుకుంది. వీటిల్లో విదేశీ తయారీ రివాల్వర్, ఇతర ఆయుధాలు ఉన్నాయి. జనవరిలో ఈడీపై జరిగిన దాడికి సంబంధించి ఈ సోదాలను నిర్వహించింది. ఇదే అంశంపై నిన్న మమతా బెనర్జీ మాట్లాడుతూ సీబీఐ ఆయుధాలు స్వాధీనం చేసుకొన్నట్లు ఎటువంటి ఆధారాలు లేవని పేర్కొన్నారు. ఈ తనిఖీల సందర్భంగా రాష్ట్ర పోలీసులను అనుమతించలేదని ఆరోపించారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
అణుబాంబులకు రాహుల్ భయపడతారేమోగానీ..: అమిత్ షా
పాక్ ఆక్రమిత కశ్మీర్ (PoK) భారత్దేనని, దాన్ని తిరిగి తీసుకుంటామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా స్పష్టం చేశారు. -
ఉత్కంఠ పోరుకు సర్వం సిద్ధం.. తెలుగు రాష్ట్రాల్లో బరిలో ప్రముఖులు వీరే..!
దేశవ్యాప్తంగా పది రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో లోక్సభ ఎన్నికలు, ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. -
సీఎం, మాజీ సీఎం ‘మార్నింగ్ వాక్’.. ఓటేయాలంటూ ప్రజలకు విజ్ఞప్తి
ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకొనేందుకు నేతలు వినూత్న ప్రయత్నాలు చేస్తున్నారు. హరియాణా సీఎం నాయబ్ సింగ్ సైనీ, మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడా మార్నింగ్వాక్కు వెళ్లి అక్కడి ప్రజల్ని కలిసి ఓట్లు అభ్యర్థించారు. -
‘పార్టీనే నన్ను తొలుత మోసం చేసింది’.. అజ్ఞాతం వీడిన సూరత్ కాంగ్రెస్ అభ్యర్థి
ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న కుంభానీ చాలా రోజుల తర్వాత మళ్లీ తెరపైకి వచ్చారు. పార్టీని మోసం చేశానని ఇన్నాళ్లూ తనను దూషిస్తున్నారని, వాస్తవంగా పార్టీనే తనను మోసం చేసిందని పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు ‘యువరాజు’ వయసు కంటే తక్కువ సీట్లు : ఎద్దేవా చేసిన ప్రధాని మోదీ
కాంగ్రెస్కు ఈ సారి చరిత్రలో ఎన్నడూ రానన్ని తక్కువ సీట్లు వస్తాయని ప్రధాని పేర్కొన్నారు. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ పాలన అవినీతి మయంగా మారిందన్నారు. -
14న మోదీ నామినేషన్.. ఏర్పాట్లు మొదలుపెట్టిన భాజపా
ప్రధాని మోదీ నామినేషన్కు చకచకా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ సందర్భంగా భారీగా ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని ఆ పార్టీ నిర్ణయించింది. -
మీ ఓటు ఎవరైనా వేస్తే.. ఏం చేయాలో తెలుసా?
మన ఓటు కూడా వేరే వారు వేస్తే కచ్చితంగా మన హక్కును సాధించుకోవాల్సిందే. ఇందుకోసం భారత ఎన్నికల సంఘం 1961లో సెక్షన్49(పి)ను అమల్లోకి తెచ్చింది. -
ఉచిత కరెంటు, విద్య, వైద్యం.. కేజ్రీవాల్ 10 గ్యారంటీలు!
Kejriwal: ఇండియా కూటమి అధికారంలోకి వస్తే 10 హామీలను అమలు చేస్తామని ఆప్ అధినేత, దిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. -
నేను బయటుండేది 21 రోజులే.. జూన్ 2న జైలుకెళ్లాలి: కేజ్రీవాల్
తాను అరెస్టు అయిన తర్వాత పార్టీ మరింత బలపడిందని ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు. నేడు ఆయన పార్టీ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు. -
ఖర్గే హెలికాప్టర్ తనిఖీ.. ఈసీని ప్రశ్నించిన కాంగ్రెస్!
ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ అధినేత మల్లికార్జున ఖర్గే (Mallikarjuna Kharge) హెలికాప్టర్ను పోలింగ్ అధికారులు తనిఖీ చేశారు. -
మీరేమైనా విపక్ష కూటమి ప్రధాని అభ్యర్థా?.. రాహుల్కు స్మృతి ఇరానీ సూటి ప్రశ్న
Smriti Irani: మోదీతో చర్చకు సిద్ధమన్న రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై స్మృతి ఇరానీ మండిపడ్డారు. ఏ హోదాలో ప్రధానితో చర్చకు వస్తారని ప్రశ్నించారు. -
తదుపరి సర్కారు ఏర్పాటు మోదీకి దుర్లభం: ఖర్గే
కేంద్రంలో తదుపరి ప్రభుత్వాన్ని నరేంద్రమోదీ ఏర్పాటు చేయడం అత్యంత కష్టమని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చెప్పారు. -
ఇందిర నుంచి మోదీ నేర్చుకోవాలి: ప్రియాంక
తనను దుర్భాషలాడారంటూ ప్రధాని మోదీ కన్నీరు పెట్టుకోవడానికి బదులు.. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుంచి ధైర్యం, దృఢ సంకల్పం వంటి లక్షణాలను అలవర్చుకోవాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకాగాంధీ సూచించారు. -
విమర్శలను మోదీ తట్టుకోలేరు: పవార్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ విమర్శలను తట్టుకోలేరని, అదే సమయంలో ఇతరులకు వ్యతిరేకంగా మాత్రం ఏదైనా మాట్లాడతారని ఎన్సీపీ (ఎస్పీ) నాయకుడు శరద్పవార్ శనివారం విమర్శించారు. -
మేమొస్తే.. మోదీయే అయిదేళ్లూ ప్రధాని
తాము మళ్లీ అధికారంలోకి వస్తే నరేంద్ర మోదీయే అయిదేళ్ల పూర్తికాలంపాటు ప్రధానమంత్రిగా కొనసాగుతారని భాజపా అగ్ర నాయకులు ఉద్ఘాటించారు. -
నాలుగో దశ ప్రచారానికి తెర
సార్వత్రిక ఎన్నికల సమరంలో నాలుగో దశలో 96 లోక్సభ స్థానాలకు ఈ నెల 13న జరగాల్సిన పోలింగ్కు ప్రచార గడువు శనివారం సాయంత్రంతో ముగిసింది. -
కాంగ్రెస్కు ప్రతిపక్ష హోదా గల్లంతు
లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 50 సీట్లు కూడా రావని, ప్రతిపక్ష పార్టీ హోదాను సైతం కోల్పోవడం ఖాయమని ప్రధాని మోదీ అన్నారు. -
‘నోటా’ కోసం కాంగ్రెస్ విస్తృత ప్రచారం.. ఇందౌర్లో విచిత్ర పరిస్థితి!
-
బహిరంగ చర్చకు సిద్ధమే.. ప్రధాని స్పందనేంటో చెప్పండి: రాహుల్ గాంధీ
లోక్సభ ఎన్నికలపై ప్రధాని మోదీతో బహిరంగ చర్చకు సిద్ధమేనని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రకటించారు. -
75 ఏళ్లు దాటినా మోదీనే ప్రధాని.. కేజ్రీవాల్ వ్యాఖ్యలపై అమిత్ షా
75 ఏళ్లు దాటిన తర్వాత కూడా మోదీనే ప్రధానిగా కొనసాగుతారని అమిత్ షా అన్నారు. కేజ్రీవాల్ వ్యాఖ్యలకు సమాధానం ఇచ్చారు. -
ఒడిశాలోని జిల్లాల పేర్లు చెప్పగలరా? సీఎం నవీన్ పట్నాయక్కు మోదీ సవాల్
ఒడిశాలోని కంధమాల్ ప్రాంతంలో జరిగిన బహిరంగ సభలో ప్రధాని పాల్గొని ప్రజలనుద్దేశించి ప్రసంగించారు.
తాజా వార్తలు
-
ఎస్బీఐలో 12వేల ఉద్యోగాలు.. 85% ఇంజినీరింగ్ విద్యార్థులకే
-
ఓట్ల పండుగ.. హైదరాబాద్లో బోసిపోయిన రహదారులు
-
నాలుగో ఆర్థిక శక్తి.. 2025లో జపాన్ను దాటనున్న భారత్!
-
29వసారి ఎవరెస్టు అధిరోహణ.. చరిత్ర సృష్టించిన నేపాల్ షెర్పా
-
విధుల్లో చేరిన ఎయిరిండియా ఎక్స్ప్రెస్ సిబ్బంది.. 2 రోజుల్లో పూర్తిస్థాయి సర్వీసులు
-
ఒక్క ఓటేనన్న ఉదాసీనత వద్దు.. మీ ఓటే చరిత్రను మార్చేయొచ్చు!