మరాఠీ విద్యార్థులు.. జపనీస్ నేర్చుకుంటున్నారు
తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భాషలో విద్యాబోధన చేయాలన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లభాషలో బోధిస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. తమిళనాడు ప్రజలు
ఇంటర్నెట్ డెస్క్: తెలుగు రాష్ట్రాలు సహా దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో ఏ భాషలో విద్యాబోధన చేయాలన్న అంశంపై చర్చ కొనసాగుతూనే ఉంది. మాతృభాషలో బోధించాలని కొందరు, ఆంగ్లభాషలో బోధిస్తేనే విద్యార్థుల భవిష్యత్తు బాగుంటుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. భాషపై ఇన్ని వివాదాలు కొనసాగుతుండగా.. మహారాష్ట్రలోని ఓ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఏకంగా ఓ విదేశీ భాషను నేర్చుకుంటున్నారు.
ప్రైవేటు, అంతర్జాతీయ పాఠశాలల్లో విద్యార్థుల ఎంపిక మేరకు విదేశీ భాషను నేర్పిస్తుంటారు. కానీ, ప్రభుత్వ పాఠశాలల్లో ఇలాంటి సదుపాయం ఉండదు. అయితే మహారాష్ట్రలోని ఔరంగబాద్కు 25కి.మీ దూరంలో ఉన్న గడివాట్ అనే గ్రామంలో జిల్లా పరిషత్ పాఠశాలలోని విద్యార్థులకు అక్కడి పాఠశాల యాజమాన్యం జపనీస్ నేర్పిస్తోంది. ఆ పాఠశాలలో 4-8 తరగతి విద్యార్థులను ఏదైనా విదేశీ భాష ఎంచుకోమని అడిగితే చాలా మంది జపనీస్ను ఎంచుకున్నారట. దీంతో జపనీస్ భాషా పండితులతో ఆన్లైన్ తరగతుల ద్వారా విద్యార్థులకు ఈ భాష నేర్పిస్తున్నారు. అక్కడి టీచర్లు కూడా జపనీస్ నేర్చుకోవడం విశేషం. విద్యార్థులకు వృత్తికి తగిన విద్యను అందించాలన్న లక్ష్యంతో గతేడాది ఈ విదేశీ భాష కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు స్థానిక జిల్లా విద్యాధికారి తెలిపారు. విద్యార్థులు జపనీస్ నేర్చుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు. ఔరంగబాద్లో ఉన్న అజంతా.. ఎల్లోరా గుహలను చూడటానికి ఏటా చాలా మంది జపనీయులు వస్తుంటారట. వారికి వారి మాతృభాషలో ఈ చారిత్రక నిర్మాణాల గురించి వివరించేలా గైడ్ ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని చెబుతున్నారు.
అంతేకాదు, ఇక్కడి విద్యార్థులు టెక్నాలజీ, రోబోటిక్స్పై ఆసక్తి చూపుతున్నారు. జపాన్లో ఈ రంగాలకు అధిక ప్రాధాన్యముంది. దీంతో జపనీస్ భాష నేర్చుకొని అక్కడికి వెళ్లి ఆయా రంగాల్లో ఉద్యోగాలు చేస్తామని విద్యార్థులు అంటున్నారు. ఇప్పటికే జపనీస్ నేర్చుకోవడంలో తొలి దశ పూర్తిచేసుకున్న విద్యార్థులు ఆ భాషలో మాట్లాడగలుగుతున్నారు. ప్రస్తుత కరోనా సమయంలోనూ విద్యార్థులు ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారట. ఈ పాఠశాల విద్యార్థులు జపనీస్ నేర్చుకోవడం గురించి తెలిసి జపాన్లో ఉంటున్న ఓ భారతీయ ప్రొఫెసర్ ఈ పాఠశాలకు మరాఠీ-జపనీస్ డిక్షనరీలను పంపించారట. విద్యార్థుల భవిష్యత్తు గురించి ఆలోచిస్తున్న ఈ పాఠశాల ఇతర పాఠశాలలకు ఆదర్శమనడంలో ఏ మాత్రం సందేహం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం