TS News: తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు సెలవు

తెలంగాణలో ఇవాళ, రేపు విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది.

Updated : 20 Jul 2023 14:10 IST

హైదరాబాద్‌: తెలంగాణలో భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు ప్రభుత్వం సెలవును ప్రకటించింది. సీఎం కేసీఆర్‌ ఆదేశాలకు మేరకు సెలవులు ప్రకటించినట్లు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు. ఈ మేరకు మంత్రి ట్వీట్‌ చేశారు. ఎడతెరిపి లేని వర్షాల వలన ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశం ఉండడంతో ఈ మేరకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని