Covishield: ఏపీకి మరో 4.8లక్షల డోసులు

కరోనా వ్యాక్సిన్‌ కొరత వేధిస్తున్న వేళ ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్‌ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ ....

Published : 14 May 2021 21:38 IST

అమరావతి: కరోనా వ్యాక్సిన్‌ కొరత వేధిస్తున్న వేళ ఏపీకి మరో 4.8లక్షల కొవిషీల్డ్‌ డోసులు చేరుకున్నాయి. పుణెలోని సీరం ఇనిస్టిట్యూట్‌ నుంచి గన్నవరం విమనాశ్రాయానికి చేరుకున్నాయి. వీటిని తొలుత గన్నవరంలోని రాష్ట్ర టీకా నిల్వ కేంద్రానికి తరలించనున్నారు. అక్కడి నుంచి ఆరోగ్యశాఖ ఆదేశాలతో జిల్లాలకు కేటాయింపులు చేయనున్నారు. కొత్తగా వచ్చిన ఈ టీకాలతో రాష్ట్రంలో వ్యాక్సిన్ల కొరత సమస్య నుంచి కొంత ఉపశమనం లభించినట్టయింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని