బిల్లులపై ఏపీ గవర్నర్‌ న్యాయ సలహా

పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ న్యాయసలహాలు తీసుకుంటున్నారు.

Published : 24 Jul 2020 16:30 IST

అమరావతి: పాలనా వికేంద్రీకరణ బిల్లు, సీఆర్‌డీఏ రద్దు బిల్లుపై గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ న్యాయసలహాలు తీసుకుంటున్నారు. రాజ్‌భవన్‌ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులతో ఆయన సమావేశమై.. అభిప్రాయాలు తెలుసుకుంటున్నారు. చర్చల అనంతరం బిల్లులపై ఆయన తుది నిర్ణయం తీసుకోనున్నారు.

గత నెల 17న శాసనసభ నుంచి రెండోసారి ఈ బిల్లులను శాసనమండలికి పంపారు. ఆ రోజు బిల్లులను ప్రవేశపెట్టకముందే మండలి నిరవధికంగా వాయిదా పడింది. శాసనసభ నుంచి రెండోసారి మండలికి పంపినందున అక్కడ చర్చ, ఆమోదాలతో సంబంధం లేకుండా నెల రోజులకు స్వయంచాలితంగానే (ఆటోమేటిక్‌) ఆమోదం పొందినట్లు పరిగణిస్తారనేది రాష్ట్ర ప్రభుత్వ వాదన. గత నెల 17న మండలికి పంపిన ఈ బిల్లులకు ఈనెల 17తో ఈ వ్యవధి ముగిసిందని ప్రభుత్వం భావిస్తోంది. అందువల్లే తుది ఆమోదానికి గవర్నర్‌కు శనివారం పంపినట్లు చెబుతున్నారు. గత జనవరిలో తొలిసారి బిల్లులను శాసనసభలో ఆమోదించి మండలికి పంపారు. వీటిని మండలి ఛైర్మన్‌ అప్పట్లో సెలక్టు కమిటీకి పంపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని