కరోనా మృతదేహాన్ని తాళ్లతో లాక్కెళ్లి..

మరణించిన వారికి సాంప్రదాయబద్దంగా, సకల మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటాం. కానీ కరోనాతో మృతిచెందిన వారి..

Updated : 29 Nov 2023 12:17 IST

అమానవీయకరంగా అంత్యక్రియలు

ఇంటర్నెట్‌ డెస్క్‌: మరణించిన వారికి సంప్రదాయబద్ధంగా, సకల మర్యాదలతో అంత్యక్రియలు నిర్వహిస్తుంటాం. కానీ కరోనాతో మృతిచెందిన వారి మృతదేహాలు కుటుంబసభ్యుల చివరి చూపునకు కూడా నోచుకోలేకపోతున్నాయి. అంత్యక్రియలు సైతం వైద్య సిబ్బందే నిర్వహిస్తున్నారు.  అయితే కొన్ని చోట్ల మృతదేహాలను అగౌరపరిచేలా వ్యవహరిస్తున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా కర్ణాటకలోకి బెళగావి జిల్లా గొకాక తాలూకాకు చెందిన 92 ఏళ్ల ఓ వృద్దుడు కరోనాతో మృతిచెందగా అతడి మృతదేహాన్ని వైద్య సిబ్బంది అమానవీయంగా తాళ్లతో లాక్కెళ్లి అంత్యక్రియలు చేశారు. కాగా ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతమయ్యాయి. దీంతో నెటిజన్లు, మృతుడి కుటుంబసభ్యులు వైద్య సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని