శ్రీవారి సేవలో అచ్చెన్నాయుడు

తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో ..

Published : 02 Sep 2020 10:24 IST

తిరుమల: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయానికి చేరుకున్న అచ్చెన్నకు తితిదే అధికారులు స్వాగతం పలికి స్వామివారి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం రంగనాయకుల మండపంలో స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. తెదేపా ప్రభుత్వ హయాంలో ఈఎస్‌ఐ మందుల కొనుగోళ్లకు సంబంధించిన ఆరోపణలపై జూన్‌ 12న అచ్చెన్నాయుడిని అనిశా అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ఏసీబీ అదుపులో ఉన్నప్పుడు అచ్చెన్న ఆరోగ్యం సరిగా లేకపోవడంతో చికిత్స చేశారు. ఈ క్రమంలో అచ్చెన్న కరోనా బారిన పడ్డారు. అనంతరం ఐదు రోజుల క్రితం అచ్చెన్నకు హైకోర్టు షరతులతో కూడిన బెయిల్‌ మంజూరు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని