Andhra News: ‘మంత్రి సురేశ్ మా పొలం ఆక్రమించారు’: స్పందనలో మహిళ ఫిర్యాదు

మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలం ఆక్రమించారని ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు.

Updated : 09 May 2022 13:49 IST

దర్శి: మంత్రి ఆదిమూలపు సురేశ్ తన పొలం ఆక్రమించారని ప్రకాశం జిల్లా కలెక్టర్‌కు ఓ మహిళ ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా దర్శిలో ఇవాళ స్పందన కార్యక్రమం నిర్వహించారు. దీనికి కలెక్టర్‌ దినేశ్‌ కుమార్‌, ఎమ్మెల్యే వేణుగోపాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మార్కాపురం మండలం దరిమడుగుకు చెందిన రంగలక్ష్మమ్మ కలెక్టర్‌ ఎదుట తన ఆవేదన వ్యక్తం చేశారు.

‘‘మంత్రికి చెందిన జార్జ్‌ ఇంజినీరింగ్ కళాశాల సమీపంలో మాకు మూడెకరాల భూమి ఉంది. ఆ పొలాన్ని మంత్రి సురేశ్‌ ఆక్రమించారు. ఎంతమందికి ఫిర్యాదు చేసినా న్యాయం జరగలేదు. మీరైనా న్యాయం చేయండి’’ అని కలెక్టర్‌కు ఆ మహిళ విన్నవించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని