Hyderabad Metro: పాతబస్తీలో మెట్రోరైలు పనులు చేపట్టాలి: మెట్రోరైలు ఎండీకి అక్బరుద్దీన్ వినతి
పాతబస్తీలో మెట్రోరైలు పనులను తక్షణమే ప్రారంభించాలని మజ్లిస్ శాసనసభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి ఆయన వినతిపత్రం అందించారు..
హైదరాబాద్: పాతబస్తీలో మెట్రోరైలు పనులను తక్షణమే ప్రారంభించాలని మజ్లిస్ శాసన సభాపక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ కోరారు. ఈ మేరకు మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని కలిసి వినతిపత్రం అందించారు. ఇమ్లిబన్ నుంచి ఫలక్నుమా వరకు మెట్రో కారిడార్ పనులు చేపట్టాలని చాలా కాలంగా కోరుతున్నామన్నారు. అందుకోసం రాష్ట్ర ప్రభుత్వం సైతం బడ్జెట్లో రూ.500 కోట్లు కేటాయించిందని పేర్కొన్నారు. ఐదున్నర కిలోమీటర్ల పొడవున మెట్రో రైలు పనులను గడువులోగా పూర్తి చేయాలని కోరారు. త్వరితగతిన పనులు ప్రారంభించాలని పలుమార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో అక్బరుద్దీన్ ఒవైసీ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
తాజా వార్తలు (Latest News)
-
విరాట్ - హార్దిక్కు నో ఛాన్స్.. ఈ లఖ్నవూ స్టార్కు ప్లేస్: భారత మాజీ క్రికెటర్
-
ఏడాదికి ‘రెండు సార్లు’ సీబీఎస్ఈ బోర్డు పరీక్షలు.. 2025 నుంచే!
-
అనుపమ ‘పరదా’.. అదితి ఆన్డ్యూటీ.. భూమీ భలే డ్రెస్సు!
-
బిగ్ సేవింగ్ డేస్ సేల్కు సిద్ధమైన ఫ్లిప్కార్ట్.. ఎప్పటినుంచంటే?
-
‘పుష్ప’ కేశవ రోల్కు సుహాస్ని అనుకున్నాం.. కానీ!: సుకుమార్
-
బైక్పై స్టంట్లు.. ‘స్పైడర్ మ్యాన్’ను అరెస్ట్ చేసిన పోలీసులు!