Sangam Dairy: ముగిసిన వాదనలు

గుంటూరు జిల్లా వడ్లమూడి వద్ద ఉన్న సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై..

Updated : 27 Apr 2021 17:07 IST

అమరావతి: గుంటూరు జిల్లా వడ్లమూడి వద్ద ఉన్న సంగం డెయిరీలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలతో తెదేపా సీనియర్‌ నేత, మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్రపై అవినీతి నిరోధకశాఖ (ఏసీబీ) కేసు నమోదు కేసి అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తనపై ఏసీబీ నమోదు చేసిన అభియోగాలపై హైకోర్టులో దూళిపాళ్ల క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ ఉన్నత న్యాయస్థానం విచారణ చేపట్టింది. ధూళిపాళ్ల, ప్రభుత్వం తరఫున న్యాయవాదులు వారి వాదనలు వినిపించారు. ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని