AP New Districts: కొత్త జిల్లాల ఏర్పాటుపై జగన్‌ అధ్యక్షతన హైలెవెల్‌ మీటింగ్‌..

ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.

Updated : 30 Mar 2022 15:15 IST

అమరావతి: ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుపై సీఎం జగన్‌ అధ్యక్షతన ఉన్నతస్థాయి సమావేశం ప్రారంభమైంది. ఈ భేటీలో జిల్లాల ఏర్పాటుకు సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ప్రజలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన ఫిర్యాదులు, సూచనలు, సలహాలపై అధికారులతో జగన్‌ చర్చిస్తున్నారు. పలు జిల్లాలు, జిల్లా కేంద్రాల పేర్లు మార్పు, కొత్త రెవెన్యూ డివిజన్ల ఏర్పాటుపైనా సీఎం జగన్‌ నిర్ణయం తీసుకునే అవకాశముంది. ఒక నియోజకవర్గంలోని మండలాలు, గ్రామాలను వేర్వేరు జిల్లాల్లోకి మార్చడంపైనా ఈ సమావేశంలో చర్చించనున్నారు. కొత్త జిల్లాల ఏర్పాటు అంశంపై అధికారులతో జగన్‌ విస్తృతంగా చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. ఉగాది నుంచి కొత్త జిల్లాల్లో పాలన ప్రారంభించాలని ఇప్పటికే ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఈ ఉన్నత స్థాయి సమావేశంలో కొత్త జిల్లాల ఏర్పాటుపై ఒక నిర్ణయానికి వచ్చి రేపు లేదా ఎల్లుండి రాష్ట్ర ప్రభుత్వం తుది నోటిఫికేషన్‌ ఇచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని