వృద్ధుడి మృతదేహం ఘటనపై మంత్రి ఆగ్రహం 

విజయనగరం జిల్లాలో వృద్ధుడి మృతదేహం ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న పార్వతీపురం నుంచి సాలూరు వెళుతున్న బస్సులో..

Updated : 24 Feb 2021 15:49 IST

అమరావతి: విజయనగరం జిల్లాలో వృద్ధుడి మృతదేహం ఘటనపై రవాణా శాఖ మంత్రి పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 22న పార్వతీపురం నుంచి సాలూరు వెళుతున్న బస్సులో ఓ వృద్ధుడు మృతిచెందాడు. దీంతో బస్సు సిబ్బంది మార్గంమధ్యలోనే బొబ్బిలి వద్ద కుటుంబ సభ్యులతో సహా మృతదేహాన్ని దించేశారు. దీనిపై మంత్రి నాని స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారాన్ని ఆర్టీసీ ఎండీ, వీసీల నుంచి సేకరించారు. బస్సు సిబ్బంది మానవత్వంతో వ్యవహరించాలని సూచించారు. మంత్రి ఆదేశాలతో విజయనగరం, పార్వతీపురం డిపోల మేనేజర్‌లు వృద్ధుడి కుటుంబం వద్దకు వెళ్లి క్షమాపణలు చెప్పారు. 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని