Atchannaidu: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం కలిగింది.

Updated : 31 Mar 2024 16:41 IST

టెక్కలి పట్టణం: తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడికి మాతృ వియోగం కలిగింది. శ్రీకాకుళం జిల్లా కోటబొమ్మాళి మండలం నిమ్మాడలోని స్వగృహంలో కళావతమ్మ(90) ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా వయోభారంతో అనారోగ్యం బారిన పడ్డారు. ఆమెకు నలుగురు కుమారులు, ముగ్గురు కుమార్తెలు కాగా.. పెద్ద కుమారుడు ఎర్రన్నాయుడు 12 ఏళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. భర్త దాలినాయుడు 15 ఏళ్ల క్రితం కన్నుమూశారు. రెండో కుమారుడు హరివరప్రసాద్‌ కోటబొమ్మాళి పీఏసీఎస్‌ అధ్యక్షుడిగా పనిచేశారు. మూడో కుమారుడు ప్రభాకర్‌ డీఎస్పీగా పనిచేస్తున్నారు. అచ్చెన్నాయుడు తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు. కళావతమ్మ మృతి పట్ల తెదేపా అధినేత చంద్రబాబు, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ తదితరులు సంతాపం తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని