ముం‘భయం’ తగ్గింది.. కొత్త ‘బెంగ’ మొదలైంది
కొవిడ్ తొలి దశ కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన బెంగళూరు.. రెండో దశలో మాత్రం విఫలమైంది. దేశంలో అత్యధిక కొవిడ్ మరణాలు నమోదవుతున్న నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది.
కరోనా మరణాల్లో దేశంలోనే రెండో స్థానంలో బెంగళూరు
తొలి దశలో ఆదర్శంగా నిలిచిన ఉద్యాననగరి
బెంగళూరు: కొవిడ్ తొలి దశ కట్టడిలో దేశానికే ఆదర్శంగా నిలిచిన బెంగళూరు.. రెండో దశలో మాత్రం విఫలమైంది. దేశంలో అత్యధిక కొవిడ్ మరణాలు నమోదవుతున్న నగరాల జాబితాలో రెండో స్థానంలో నిలిచింది. ఇంతకు ముందు రెండో స్థానంలో ఉన్న ముంబయి మెరుగైన కట్టడి చర్యలు చేపట్టడంతో అక్కడ మరణాల సంఖ్య తగ్గింది. బెంగళూరులో కొత్తగా వెలుగుచూస్తున్న కేసులు, మరణాల సంఖ్య పెరగడం ఆందోళనకు కారణమవుతోంది. అధికారిక సమాచారం ప్రకారం మంగళవారం నాటికి.. 24,667 కొవిడ్ మరణాలతో దిల్లీ మొదటి స్థానంలో నిలవగా.. 15,118 మరణాలతో బెంగళూరు రెండో స్థానంలో ఉండటం వైద్య వర్గాలను కలవరపెడుతోంది. అదే రోజు బెంగళూరులో కొత్తగా 2,022 కరోనా కేసులు, 44 మరణాలు నమోదయ్యాయి. ముంబయిలో కొత్తగా 682 కేసులు, ఏడు మరణాలు సంభవించాయి. క్రియాశీల కేసులు సైతం ముంబయి కన్నా ఉద్యాననగరిలో ఎక్కువగా ఉండటం గమనార్హం. ప్రస్తుతం బెంగళూరులో 1,01,965, ముంబయిలో 15,786 క్రియాశీల కేసులున్నాయి.
రెండో దశలో.. ఈ ఏడాది ఏప్రిల్ 25న బెంగళూరులో 6.53 లక్షల కేసులు, 5,800 మరణాలు సంభవించగా.. ముంబయిలో 6.27 లక్షల కేసులు, 12,790 మరణాలు చోటుచేసుకున్నాయి. అయితే కరోనా కట్టడిలో ముంబయి క్రమంగా మెరుగైన ఫలితాలను సాధిస్తూ దేశానికి ఆదర్శంగా నిలుస్తోంది. పరీక్షలు ఎక్కువగా చేయడం వల్ల ఇతర నగరాల కంటే ఎక్కువ కరోనా కేసులు బయటపడుతున్నాయని బెంగళూరు అధికారయంత్రాంగం తెలిపింది. అయితే బెంగళూరులో మరణాలు ఎందుకు అధిక సంఖ్యలో సంభవిస్తున్నాయని వైద్య ఆరోగ్య శాఖ నిపుణులు ప్రశ్నిస్తున్నారు. ప్రజారోగ్య వ్యవస్థ సమర్థంగా పనిచేయకపోవడం వల్లనే తాజా పరిస్థితి తలెత్తిందని వారు అభిప్రాయపడ్డారు. కొవిడ్ మూడో దశను సమర్థంగా ఎదుర్కోడానికి ముంబయి అనుసరించిన విధానాలను ఆచరించాలని మిగిలిన రాష్ట్రాలు, నగరాలకు సూచించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం
-
ఆర్టీసీ ప్రయాణికుల వద్దకే శ్రీ సత్యసాయి తాగునీరు
-
లాభాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు.. సెన్సెక్స్ @ 74,434