CM Jagan: విభజన వల్ల దెబ్బతిన్నాం.. ఏపీకి ప్రత్యేక హోదా కల్పించండి: మోదీకి జగన్‌ వినతి

విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరిగి కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ ప్రధాని నరేంద్రమోదీని కోరారు. తెలంగాణ డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ. 6,627 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు...

Published : 04 Jul 2022 18:28 IST

అమరావతి: విభజన వల్ల దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం తిరిగి కోలుకునేందుకు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి ప్రధాని నరేంద్రమోదీని కోరారు. తెలంగాణ డిస్కంలు ఆంధ్రప్రదేశ్‌కు చెల్లించాల్సిన రూ. 6,627 కోట్ల బకాయిలను వెంటనే ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని జగన్‌ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ప్రధాని నరేంద్రమోదీకి సీఎం జగన్‌ వినతి పత్రం అందించారు. రీసోర్స్ గ్యాప్‌ గ్రాంట్‌ అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి తీసుకెళ్లిన జగన్‌.. గ్రాంట్‌లో భాగంగా రావాల్సిన రూ.34,125 కోట్లు ఇవ్వాలని మోదీని కోరారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి సవరించిన అంచనాలు రూ.55,548 కోట్లకు ఆమోదం తెలపాలని సీఎం విజ్ఞప్తి చేశారు. జాతీయ ఆహార భద్రత చట్టం కింద ఇచ్చే రేషన్‌లో హేతుబద్ధత లేదని.. దీని వల్ల రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందన్నారు. చట్టాన్ని సవరించి ఆంధ్రప్రదేశ్‌కి మేలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. కొత్త వైద్యకళాశాలలకు తగిన ఆర్థిక సాయం, విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయానికి క్లియరెన్స్, ఏపీఎండీసీకి ఇనుప గనుల కేటాయింపుపై సత్వర చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని