CM KCR: సీఎం కేసీఆర్‌కు స్వల్ప అస్వస్థత.. ఏఐజీలో వైద్యపరీక్షలు

తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వైద్య పరీక్షల కోసం ప్రగతిభవన్‌ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు.

Updated : 12 Mar 2023 17:24 IST

హైదరాబాద్‌: తెలంగాణ సీఎం కేసీఆర్‌ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన వైద్య పరీక్షల కోసం ప్రగతిభవన్‌ నుంచి గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రికి వెళ్లారు. ‘‘సీఎం కేసీఆర్‌కు పొత్తికడుపులో అసౌకర్యం ఏర్పడింది. కడుపునొప్పితో సీఎం ఆసుపత్రికి వచ్చారు. ఎండోస్కోపి, సీటీ స్కాన్‌ చేశాం. కేసీఆర్‌ కడుపులో చిన్న అల్సర్‌ ఉన్నట్టు గుర్తించాం. సీఎంకు మిగతా వైద్య పరీక్షలన్నీ సాధారణంగానే ఉన్నాయి. ఏఐజీ ఛైర్మన్‌ డాక్టర్‌ నాగేశ్వర్‌రెడ్డి ఆధ్వర్యంలో వైద్య పరీక్షలు నిర్వహించాం’’ అని ఏఐజీ వైద్యులు ఓ ప్రకటన విడుదల చేశారు.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని