Andhra news : అనంతపురంలో ఏపీ-అమూల్ ప్రాజెక్టు ప్రారంభం

అమూల్‌ సంస్థ పాడి రైతులకు ప్రయోజనకారిగా ఉందని ..

Published : 28 Jan 2022 16:21 IST

అమరావతి: అమూల్‌ సంస్థ పాడి రైతులకు ప్రయోజనకారిగా ఉందని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి అన్నారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వర్చువల్‌గా అనంతపురం జిల్లాలో ఏపీ-అమూల్‌ ప్రాజెక్టును ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్‌ మాట్లాడుతూ.. ఇప్పటికే రాష్ట్రంలో ఆరు జిల్లాల్లో అమూల్‌ పాల సేకరణ చేపట్టిందన్నారు. అనంతపురం జిల్లాకు ఇదొక శుభవార్త అని చెప్పారు. అమూల్ వచ్చాక పరిస్థితులన్నీ మారాయని తెలిపారు. అనంతపురం జిల్లాలోని 85 గ్రామాల్లో జగనన్న పాలవెల్లువ కార్యక్రమం కొనసాగుతుందని సీఎం జగన్‌ వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని