Janasena: జనసేనకు విరాళాల సేకరణ.. కొత్త జంట వినూత్న ప్రయత్నం

జనసేన పార్టీకి విరాళాల సేకరణ కోసం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో కొత్త జంట వినూత్న ఆలోచన చేసింది.

Published : 25 Feb 2024 23:41 IST

బాపులపాడు: జనసేన పార్టీకి విరాళాల సేకరణ కోసం కృష్ణా జిల్లా హనుమాన్ జంక్షన్‌లో కొత్త జంట వినూత్న ఆలోచన చేసింది. వివాహ విందు వేడుకల్లో పేమెంట్‌ స్కానర్‌ను ఏర్పాటు చేయించింది. పార్టీ బలోపేతానికి ఆర్థిక సాయంలో అందరినీ భాగస్వామ్యం చేసే ఉద్దేశంతో ఈ ప్రయత్నం చేసినట్లు వధూవరులు తాతా నాయుడు, లక్ష్మిపల్లవి తెలిపారు. నూతన దంపతుల కోరిక మేరకు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినట్లు జనసేన రాష్ట్ర ఎన్నికల నిర్వహణ కమిటీ సభ్యుడు గరికిపాటి శివశంకర్ తెలిపారు. తమ అధినేత పవన్ కల్యాణ్‌ ఆశయ సాధన కోసం ప్రతిఒక్కరూ తమ వంతు విరాళం అందించాలని కోరారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని