ఆసుపత్రుల ముందు ఆంబులెన్సుల క్యూలు

గుజరాత్‌లో కరోనా విలయతాండవం కొనసాగిస్తున్న వేళ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక రోగులు ఆంబులెన్సుల్లోనే వేచిచూస్తున్నారు. ఫలితంగా ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర ఆంబులెన్సులు క్యూలు కడుతున్నాయి....

Published : 19 Apr 2021 10:27 IST

రాజ్‌కోట్‌: గుజరాత్‌లో కరోనా విలయతాండవం కొనసాగిస్తున్న వేళ పరిస్థితులు దారుణంగా మారుతున్నాయి. ఆస్పత్రుల్లో పడకలు లేక రోగులు ఆంబులెన్సుల్లోనే వేచిచూస్తున్నారు. ఫలితంగా ఆసుపత్రుల ముందు కిలోమీటర్ల మేర ఆంబులెన్సులు క్యూలు కడుతున్నాయి. రాజ్‌కోట్‌లోని సివిల్‌ ఆసుపత్రి ముందు పదుల సంఖ్యలో బారులు తీరాయి. ఈ దృశ్యం కరోనా తీవ్రతకు, ప్రస్తుత పరిస్థితులకు అద్దం పడుతోంది. గుజరాత్‌లో ఒక్కరోజులోనే 9,541 కేసులు నమోదయ్యాయి. 97 మంది మృతిచెందారు. ఇప్పటివరకు మొత్తంగా 5,267 మంది మరణించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని