Madhya pradesh: మెడలో టైర్లు పెట్టి ప్రేమజంటతో డ్యాన్స్ చేయించారు
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా కుండి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు
ఇంటర్నెట్ డెస్క్: ఇంటి నుంచి పారిపోయిన ఒక ప్రేమజంటను గ్రామస్థులు, కుటుంబసభ్యులు కలిసి ఘోరంగా శిక్షించారు. వారు పారిపోవడానికి సహకరించిన మరో అమ్మాయిని కొట్టారు. ఆ ముగ్గురి మెడలో టైర్లను పెట్టి డ్యాన్స్ కూడా చేయించారు. ఈ ఘటన మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో కొన్ని రోజుల క్రితం చోటుచేసుకుంది. తాజాగా ఈ ఘటనపై ఓ వీడియో వెలుగులోకి వచ్చింది.
మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ధార్ జిల్లా కుండి గ్రామానికి చెందిన ఓ యువతి అదే గ్రామానికి చెందిన యువకుడు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకునే ధైర్యంలేక ఇంటి నుంచి పారిపోవాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో సెప్టెంబరు 12న అదే గ్రామానికి చెందిన మరో యువతి సహకారంతో గుజరాత్కు పారిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు కుమార్తె అదృశ్యమైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం తెలుసుకున్న ప్రేమజంట గుజరాత్ నుంచి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. తిరిగొచ్చిన వారిని గ్రామస్థులు, కుటుంబసభ్యులు దారుణంగా శిక్షించారు. ప్రేమజంటను వారికి సహకరించిన మరో యువతి మెడలో టైర్లు పెట్టి డ్యాన్స్ చేయించారు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని ఈ ఘటనకు పాల్పడిన వారిని అదుపులోకి తీసుకున్నారు.
దీనిపై అడిషనల్ సూపరింటెండెంట్ దేవేంద్ర పాటిదర్ మాట్లాడుతూ.. ‘‘యువతి ఇంటి నుంచి పారిపోయినందుకు ఆమె కుటుంబ సభ్యులు ఆగ్రహానికి లోనయ్యారు. వీరికి సహకరించిన మరో అమ్మాయిపైనా కోపం పెంచుకున్నారు. దీంతో తిరిగొచ్చిన వారిద్దరితో సహా ఆ అమ్మాయిని కూడా శిక్షించారు’’ అని పేర్కొన్నారు. ఈ సంఘటనపై ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. ఇందులో ముగ్గురిని అరెస్టు చేశామని మరో ఇద్దరు పరారీలో ఉన్నట్లు చెప్పారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ప్రతి మ్యాచ్లో అది పనిచేయదు, అయినా..: కమిన్స్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
స్వతంత్ర అభ్యర్థి విడదల రజని కిడ్నాప్ వ్యవహారంపై దుమారం
-
మంత్రిగారి నగదు ‘బదిలీ’లకు కోడ్ ఉన్నా ఆమోదం
-
విజయ్ ‘ఫ్యామిలీ స్టార్’ ఓటీటీలోకి వచ్చేసింది.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
రమణదీక్షితులుపై కేసులో 41ఏ నోటీసు నిబంధనను పాటించండి: పోలీసులకు హైకోర్టు ఆదేశం