TS: కొవిడ్ మార్గదర్శకాలు పాటించాల్సిందే
తెలంగాణలో కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్
హైదరాబాద్: తెలంగాణలో కొవిడ్ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించేలా చూడాలని.. బహిరంగ ప్రదేశాల్లో మాస్కులు తప్పనిసరిగా ధరించడం పూర్తి స్థాయిలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్ కుమార్ కలెక్టర్లను ఆదేశించారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సచివాలయం నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లతో సీఎస్ దృశ్యమాధ్యమ సమీక్ష నిర్వహించారు. పల్లె ప్రగతి, ఉపాధి హామీ పథకం, హరితహారం, సమీకృత మార్కెట్ల నిర్మాణం, ధరణి, కరోనా, ధాన్యం సేకరణ సంబంధిత అంశాలపై సమీక్షించారు. సీఎం ఆదేశాలకు అనుగుణంగా ప్రతి ఇంటికి ఆరు మొక్కలు పంపిణీ చేసేలా కార్యాచరణ రూపొందించుకోవాలన్నారు. ప్రతి మండలానికి చెందిన ప్రత్యేకాధికారులు నర్సరీలను సందర్శించి మొక్కలు బతికేలా చూడాలని చెప్పారు.
సమీకృత వెజ్, నాన్ వెజ్ మార్కెట్ల నిర్మాణం కోసం అనువైన స్థలాలను కలెక్టర్లు వ్యక్తిగతంగా పరిశీలించి ఎంపిక చేయాలని ఆదేశించారు. రాబోయే ఆరు నెలల్లో వాటి నిర్మాణం పూర్తయ్యేలా చూడాలన్నారు. ధరణి పోర్టల్ విషయంలో అద్భుతంగా కృషి చేశారని కలెక్టర్లను అభినందించారు. పెండింగ్లో ఉన్న కేసులను త్వరగా పరిష్కరించాలని సూచించారు. గ్రామాల్లో తగిన సంఖ్యలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని.. ఏ ఒక్క రైతూ అసౌకర్యానికి గురికాకుండా కలెక్టర్లు చూడాలన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్