corona: మరో ఔషధానికి అనుమతి
ఒకవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరిగిపోతున్నాయి. మరోవైపు వ్యాక్సిన్ నేషన్ ప్రక్రియ ఎక్కడ వేసి గొంగళి అక్కడే అన్న చందంగా మారింది. ఈ నేపథ్యంలో
న్యూదిల్లీ: కరోనా బాధితులకు ఉపశమనం కలిగించేలా పలు ఔషధాలకు భారత ఔషధ నియంత్రణ మండలి (డీసీజీఐ) త్వరగా అనుమతులు మంజూరు చేస్తోంది. ఇందులో భాగంగానే అత్యవసర వినియోగానికి మరో ఔషధం అందుబాటులోకి రానుంది. డీఆర్డీవో లేబొరేటరీ ఇన్మాస్, రెడ్డి ల్యాబ్స్(హైదరాబాద్) సంయుక్తంగా అభివృద్ధి చేసిన 2-డీజీ ఔషధం వినియోగానికి డీసీజీఐ అనుమతి ఇచ్చింది. కరోనా చికిత్సకు అనుమతించినట్లు రక్షణశాఖ వర్గాలు వెల్లడించాయి.
స్వల్ప, మధ్యస్థాయి కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఇది బాగా పనిచేస్తుందని డీసీజీఐ తెలిపింది. ఇది పౌడర్ రూపంలో లభించనుంది. 2-డీజీ ఔషధాన్ని నీళ్లలో కలిపి తీసుకోవాల్సి ఉంటుంది. ‘వైరస్ ఇన్ఫెక్ట్ అయిన సెల్స్తో పాటు, శరీరంలో వైరస్ వేగంగా వ్యాపించకుండా అడ్డుకుంటుంది’ అని డీఆర్డీవో వెల్లడించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.