పారదర్శకత కోసమే ఈ-సేవలు: సోమేశ్‌

ప్రభుత్వ కార్యకలాపాల్లో పనులు సులభంగా పూర్తవడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 శాఖలు, 2 శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య, ప్రణాళిక, కార్మిక, బీసీ సంక్షేమం, హోం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ

Updated : 03 Aug 2020 19:22 IST

తెలంగాణ సీఎస్‌

హైదరాబాద్‌: ప్రభుత్వ కార్యకలాపాలు సులభంగా, పారదర్శకంగా జరగడం కోసం తెలంగాణ ప్రభుత్వం ఈ-ఆఫీస్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. తాజాగా మరో 8 శాఖలు, 2 శాఖాధిపతుల కార్యాలయాల్లో ఈ-ఆఫీస్‌ ప్రారంభమైంది. వైద్య ఆరోగ్య, ప్రణాళిక, కార్మిక, బీసీ సంక్షేమం, హోం, ఎస్సీ అభివృద్ధి, మైనారిటీ సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖల్లో.. పీసీబీ, వ్యవసాయ శాఖ కమిషనర్‌ కార్యాలయాల్లో ఈ-సేవలు ప్రారంభమయ్యాయి. బీఆర్కే భవన్‌లో ఈ సేవలను సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ ప్రారంభించారు.

ఈ సందర్భంగా సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ మాట్లాడుతూ.. సమర్థమైన, కచ్చితమైన సేవలు అందించేలా ఈ-సేవలు ఉంటాయన్నారు. పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం కోసమే ఈ-సేవలను అందుబాటులోకి తెచ్చామని చెప్పారు. దీని ద్వారా ఎక్కడి నుంచైనా పనిచేస్తూ సమర్థమైన పాలనను అందించొచ్చని తెలిపారు. సచివాలయంలో 15 శాఖల్లో ఈ-సేవలు అమలు చేస్తున్నట్లు సీఎస్‌ వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని