Andhra News: పది ప్రశ్నపత్రం లీక్‌.. పోలీసుల అదుపులో హెచ్‌ఎం

ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మూడో రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో 

Updated : 30 Apr 2022 09:51 IST

అమరావతి: ఏపీలో పదో తరగతి పరీక్షలు ప్రారంభమైన మూడో రోజు శ్రీ సత్యసాయి జిల్లాలో ఆంగ్ల ప్రశ్నపత్రం లీకైన విషయం తెలిసిందే. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు నల్లచెరువు ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు విజయకుమార్‌ను అదుపులోకి తీసుకున్నారు. పదో తరగతి పరీక్షల గాండ్లపెంట చీఫ్‌ సూపరింటెండెంట్‌గా విజయకుమార్‌ ఉన్నారు. గాండ్లపెంట నుంచి ఆంగ్ల ప్రశ్నపత్రాన్ని వాట్సాప్‌లోకి పంపినట్లు ప్రాథమికంగా నిర్ధరణ అయ్యింది. దీంతో విజయకుమార్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని