గవర్నర్‌తో సీఎం జగన్‌ భేటీ

గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో జగన్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాత

Published : 02 Jan 2020 16:13 IST

విజయవాడ: గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌తో సీఎం జగన్‌ భేటీ అయ్యారు. రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో సమావేశమయ్యారు. మూడు రాజధానులు రావొచ్చంటూ అసెంబ్లీలో జగన్‌ వ్యాఖ్యలు చేసిన తర్వాత గవర్నర్‌ను కలవడం ఇదే తొలిసారి. ఏపీ సమగ్రాభివృద్ధిపై జీఎన్‌ రావు కమిటీ నివేదిక, ఇటీవల నియమించిన హైపవర్‌ కమిటీ తదితర అంశాలను గవర్నర్‌కు సీఎం వివరించే అవకాశముంది. దీంతోపాటు రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులు, రాజధాని మార్పుపై బిశ్వభూషణ్‌తో జగన్‌ చర్చించనున్నట్లు తెలుస్తోంది. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని