మేడారంలో శాశ్వత ఏర్పాట్లు: ఎర్రబెల్లి
తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. మేడారం జాతర జరుగుతున్న తీరును మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాఠోడ్ వివరించారు.
ములుగు: తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి ఇబ్బంది లేకుండా సమ్మక్క-సారక్క జాతరను ఘనంగా నిర్వహించిందని మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. మేడారం జాతరపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్, సత్యవతి రాఠోడ్ మీడియాతో మాట్లాడారు. జాతరను విజయవంతంగా నిర్వహించడంలో మీడియా కీలకంగా వ్యవహరించిందని ఎర్రబెల్లి చెప్పారు. మేడారం జాతర నిర్వహణపై సీఎం కేసీఆర్ నిరంతరం సమీక్షలు జరిపారని తెలిపారు. జాతర నిర్వహణ చూసి భాజపా నేతలు సైతం మెచ్చుకున్నారని మంత్రి పేర్కొన్నారు. మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరను జాతీయ ఉత్సవంగా కేంద్రం గుర్తించాలని ఎర్రబెల్లి కోరారు. జాతరకు జాతీయ పండగ గుర్తింపు సాధించేందుకు ప్రజలందరి సహకారం కావాలన్నారు. సమ్మక్క-సారలమ్మ దీవెనలే ప్రభుత్వాన్ని ముందుకు నడిపించాయని అన్నారు. మేడారం జాతరను విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతిఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు మంత్రి ఎర్రబెల్లి వివరించారు. త్వరలోనే శాశ్వత ప్రాతిపదికన వసతులు ఏర్పాటు చేస్తామని, ఇందుకోసం 100 ఎకరాలు సేకరిస్తామని చెప్పారు. పర్యాటక ప్రాంతంగా మేడారాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారని ఎర్రబెల్లి అన్నారు.
గతంతో పోలిస్తే అధికంగా వచ్చారు: సత్యవతి రాఠోడ్
మేడారంతో సహా రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల జాతర జరుగుతోందని.. ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే సుమారు 70 ప్రాంతాల్లో జాతర కొనసాగుతోందని మంత్రి సత్యవతి రాఠోడ్ తెలిపారు. అమ్మవార్లను దర్శించుకునేందుకు గతంతో పోలిస్తే ఈసారి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారని చెప్పారు. వేలాదిగా తరలివస్తున్న భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సదుపాయాలు కల్పించామని మంత్రి వివరించారు. గత జాతరతో పోల్చితే ఈ జాతరకు ఇప్పటి వరకు 20 నుంచి 25 శాతం భక్తులు అధికంగా వచ్చారని అంచనా వేస్తున్నట్లు మంత్రి పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్