తెలంగాణ కేబినెట్ భేటీ ప్రారంభం
తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్లో నిర్వహిస్తున్న ఈ భేటీలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. వివిధ అంశాలపై చర్చించిన అనంతరం వాటికి కేబినెట్ ఆమోదం
హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ భేటీ ప్రారంభమైంది. ప్రగతిభవన్లో నిర్వహిస్తున్న ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. ఆయా అంశాలపై చర్చించిన అనంతరం వాటికి కేబినెట్ ఆమోదం తెలపనుంది. మంత్రివర్గ సమావేశంలో రాష్ట్ర శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను ఖరారు చేసే అవకాశముంది. దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా ఉన్న పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై ప్రభుత్వ విధానాన్ని కేసీఆర్ వెల్లడించనున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలోని పంచాయతీరాజ్, పురపాలక శాఖలతో పాటు మరికొన్ని శాఖల్లో ఖాళీల భర్తీకి మంత్రివర్గం ఆమోదం తెలపనుంది. ఈశాఖల్లో మొత్తం 2 వేలకు పైగా పోస్టుల ఖాళీలున్నట్లు సమాచారం. పాలనా సంస్కరణలు, కొత్త రెవెన్యూ చట్టంపై మంత్రిమండలి చర్చించి, దానికి తుదిరూపు ఇవ్వనుంది. ఇటీవల కలెక్టర్ల సమావేశంలో తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశముంది. దీంతో పాటు శాసనసభ బడ్జెట్ సమావేశాల తేదీలను కూడా ఈ సమావేశంలోనే ఖరారు చేసే వీలుంది. శాసనసభ సమావేశాలను మార్చి మొదటివారంలో నిర్వహించే అవకాశముంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.