వైద్యం అందించిన డాక్టర్‌కూ కరోనా!

కరోనా బాధితుడికి వైద్య పరీక్షలు చేసిన ఓ డాక్టర్‌కు కరోనా సోకింది. కర్ణాటకలోని కలబురగికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకిన తర్వాత ప్రాణాలు కోల్పోయాడు.

Published : 18 Mar 2020 01:05 IST

బెంగళూరు(కర్ణాటక): కరోనా సోకిన వ్యక్తికి వైద్య పరీక్షలు చేసిన ఓ డాక్టర్‌కూ ఆ వైరస్‌ సోకింది. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకలోని కలబురగికి చెందిన ఓ వ్యక్తి కరోనా సోకి ప్రాణాలు కోల్పోయాడు. కాగా.. ఆ వ్యక్తి కుటుంబ సభ్యులతో పాటు వైద్యం అందించిన డాక్టర్‌ను కూడా క్వారంటైన్‌లో ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. తాజాగా ఆ వైద్యుడికి పరీక్షలు చేయగా కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. ఇదిలా ఉండగా కర్ణాటకలో ఇప్పటి వరకూ 10 కరోనా కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల్లోనే మూడు కొత్త కేసులు నిర్ధారణ అయినట్లు ఆ రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి శ్రీరాములు తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని