పశ్చిమబెంగాల్‌లో మరో ఇద్దరికి కరోనా పాజిటివ్‌

పశ్చిమబెంగాల్‌లో కరోనా క్రమంగా వేగం పుంజుకుంటోంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఇద్దరికి వైరస్‌ సోకింది. కరోనా లక్షణాలతో

Published : 24 Mar 2020 21:55 IST

కోల్‌కతా: పశ్చిమబెంగాల్‌లో కరోనా క్రమంగా వేగం పుంజుకుంటోంది. మంగళవారం ఒక్కరోజే రాష్ట్రంలో ఇద్దరికి వైరస్‌ సోకింది. కరోనా లక్షణాలతో ఓ పురుషుడు(58), మహిళ(55) ఆసుపత్రిలో చేరారు. వారికి కరోనా పరీక్షలు చేసిన వైద్యులు వైరస్‌ సోకినట్లు నిర్ధారించారు. మహిళ యూకే నుంచి రాగా.. మరో వ్యక్తి ఈజిప్టు నుంచి వచ్చినట్లు అధికారులు తెలిపారు. తాజాగా నమోదైన ఈ కేసులతో పశ్చిమబెంగాల్‌లో కరోనా బాధితుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఈ మేరకు ఆ రాష్ట్ర వైద్యశాఖ అధికారికంగా ప్రకటించింది. కోల్‌కతాలో కరోనా వైరస్‌ బారిన పడిన ఓ వ్యక్తి సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని