శభాష్‌ పోలీసన్నా! మెచ్చుకున్న కేంద్రమంత్రి

ఆ కానిస్టేబుట్‌ అంకిత భావానికి, దయాగుణానికి సెల్యూట్‌ చేస్తున్నాను... అని రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రశంసించారు.

Published : 04 May 2020 23:53 IST

దిల్లీ: కరోనా వైరస్‌ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ను మరోసారి పొడిగించారు. మార్చి 22న జనతా కర్ఫ్యూతో మొదలైన లాక్‌డౌన్‌, మే 17 వరకు కొనసాగనుంది. ఈ పరిస్థితుల్లో  విద్యార్ధులు అతి విలువైన విద్యా సంవత్సరాన్ని నష్టపోతున్నారు. ఇక ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు చెందిన చిన్నారుల పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. ఈ నేపథ్యంలో రోజుకు 12 గంటల పాటు విధులను నిర్వహించటమే కాకుండా చదువుకోవాలనే ఆసక్తి ఉన్న చిన్నారులకు విద్య నేర్పుతున్న ఓ కానిస్టేబుల్ ఔధార్యం.. కేంద్ర మానవవనరుల మంత్రి రమేష్‌ పోఖ్రియాల్‌ నిశాంక్‌ ప్రశంసలను అందుకుంది. 

‘‘కరోనావైరస్‌ మహమ్మారి వ్యాప్తిస్తున్న ఈ సమయంలో పోలీసు సిబ్బంది అతికీలక విధులను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా చదువుకోవాలనే తపన ఉన్న ఇద్దరు చిన్నారులకు ఉత్తరాఖండ్, రుద్రపూర్‌లోని కొవిడ్‌-19 క్వారంటైన్‌ కేంద్రంలో విధులు నిర్వహిస్తున్న ఈ కానిస్టేబుల్‌ చదువు చెబుతున్నారు. ఆయన అంకిత భావానికి, దయాగుణానికి సెల్యూట్‌ చేస్తున్నాను.’’ అని రమేష్‌ పోఖ్రియాల్‌ ప్రశంసించారు. అంతేకాకుండా ఓ అక్క, తమ్ముడికి చదువు చెబుతున్న ఆ కానిస్టేబుల్‌కు చెందిన చిత్రాలను కూడా మంత్రి షేర్‌ చేశారు. కాగా, ఆదర్శవంతమైన ఆ కానిస్టేబుల్‌తో పాటు చిన్నారులు కూడా మాస్కులను ధరించటం గమనార్హం! 

 


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని