హన్మకొండలో మొన్న కూతురికి.. నేడు తల్లికి!

వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు డీఎంహెచ్‌వో లలితా దేవి వెల్లడించారు. ఏప్రిల్‌ 21న పదేళ్ల  బాలికకు కరోనా పాజిటివ్‌గా తేలిందనీ.. దీంతో ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు.

Published : 04 May 2020 18:58 IST

హన్మకొండ: వరంగల్‌ అర్బన్‌ జిల్లా హన్మకొండలో ఓ మహిళకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు డీఎంహెచ్‌వో లలితా దేవి వెల్లడించారు. ఏప్రిల్‌ 21న పదేళ్ల  బాలికకు కరోనా పాజిటివ్‌గా తేలిందనీ.. దీంతో ఆమెను చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే, కుమార్తెతో పాటు తల్లి కూడా గాంధీ ఆస్పత్రికి వెళ్లారని వివరించారు. తాజాగా నిర్వహించిన వైద్య పరీక్షల్లో బాలిక తల్లికి కూడా కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని డీఎంహెచ్‌వో వెల్లడించారు.
 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని