జూన్ మొదటివారంలో ‘టీఎస్ బీపాస్’:కేటీఆర్
భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ బీపాస్ కార్యక్రమంపై పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ..
హైదరాబాద్: భవన నిర్మాణ అనుమతుల్లో పారదర్శకతే లక్ష్యంగా జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. టీఎస్ బీపాస్ కార్యక్రమంపై పురపాలక, జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రయోగాత్మకంగా రాష్ట్రంలోని 87 మున్సిపాలిటీల్లో ఈ విధానాన్ని ఇప్పటికే ప్రవేశపెట్టామన్నారు. ఈ మేరకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన కొనసాగుతోందని.. కొన్నింటికి ఇప్పటికే అనుమతులు ఇచ్చినట్లు చెప్పారు. సుమారు 1,100 దరఖాస్తులు వచ్చాయని.. సాఫ్ట్వేర్ ఆధారిత వ్యవస్థకు సంబంధించి వచ్చిన సమాచారం ఆధారంగా రానున్న 15 రోజుల్లో ప్రత్యేక కార్యాచరణ చేపట్టనున్నట్లు కేటీఆర్ వివరించారు. జూన్ మొదటి వారంలో రాష్ట్రంలోని అన్ని పురపాలికల్లో టీఎస్ బీపాస్ విధానాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కేటీఆర్ ఆదేశించారు. ఇందుకోసం సంబంధిత సిబ్బందికి ఇవ్వాల్సిన శిక్షణ, అవగాహన కార్యక్రమాలను మరింత ముమ్మరం చేయాలని సూచించారు.
రాష్ట్రంలోని మిగతా మున్సిపాలిటీలతో పాటు జీహెచ్ఎంసీలోనూ పూర్తిస్థాయిలో అమలు చేసేందుకు సిద్ధంగా ఉండాలని గ్రేటర్ అధికారులను కేటీఆర్ ఆదేశించారు. ఇందుకోసం రానున్న రెండు రోజుల్లో జీహెచ్ఎంసీ పరిధిలోని జిల్లా కలెక్టర్లు, రెవెన్యూ యంత్రాంగం, పట్టణ ప్రణాళికా విభాగం అధికారులతో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. టీఎస్ బీపాస్ వ్యవస్థ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక ప్రజలు ఆన్లైన్లోనే అనుమతులు పొందేందుకు వీలుగా చర్యలు చేపట్టాలని కేటీఆర్ స్పష్టం చేశారు. దరఖాస్తు ప్రక్రియలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లయితే సంబంధిత అధికారులను సంప్రదించేలా ప్రత్యేక కాల్ సెంటర్ ఏర్పాటు చేయడంతో పాటు అందుబాటులో ఉండే వ్యవస్థను రూపొందించాలని కేటీఆర్ ఆదేశించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
ట్రావిస్ హెడ్ బలహీనతను పట్టిన బెంగళూరు..!
-
విజయ్ మాల్యా అటుగా వస్తే మాకు అప్పగించండి: ఫ్రాన్స్కు భారత్ విజ్ఞప్తి
-
‘ఫ్రీజింగ్ ఎగ్స్’ విధానం మంచిదే: మృణాల్ ఠాకూర్ ఆసక్తికర వ్యాఖ్యలు
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్