మాస్క్ల ఎగుమతిపై ఆంక్షలు సడలింపు
విదేశాలకు మాస్క్లు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాటన్, పట్టు, ఉన్ని సహా నాన్ మెడికల్, నాన్ సర్జికల్ మాస్క్లపై ఆంక్షలను ఎత్తేసింది. అయితే ఎన్-95, సర్జికల్ మాస్క్లపై మాత్రం నిషేధం కొనసాగించింది....
దిల్లీ: విదేశాలకు మాస్క్లు ఎగుమతి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతినిచ్చింది. కాటన్, పట్టు, ఉన్ని సహా నాన్ మెడికల్, నాన్ సర్జికల్ మాస్క్లపై ఆంక్షలను ఎత్తేసింది. అయితే ఎన్-95, సర్జికల్ మాస్క్లపై మాత్రం నిషేధం కొనసాగించింది.
‘నాన్ మెడికల్/నాన్ సర్జికల్ మాస్క్ల ఎగుమతికి ప్రభుత్వం అనుమతించింది’ అని డీజీఎఫ్టీ తెలిపింది. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా అన్ని రకాల మాస్క్లు, అందుకు అవసరమైన ముడిసరుకు ఎగుమతులపై మార్చి 19న ప్రభుత్వం నిషేధం విధించింది. పీపీఈ కిట్లు, గాల్లో వైరస్ కణాలను అడ్డుకొనే మాస్క్ల ఎగుమతులపై జనవరి 31నే నిషేధం అమలు చేసిన సంగతి తెలిసిందే.
ఆంక్షలను సడలించాలని ఎగుమతిదారులు డిమాండ్ చేయడంతో ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. ‘ఇది స్వాగతించదగ్గ చర్య. ఇందుకోసం మేం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఇప్పుడు మాకు భారీ ఆర్డర్లు ఉన్నాయి. రాబోయే మూడు నెలల్లో వందల కోట్ల డాలర్ల విలువైన మాస్క్లు ఎగుమతి చేస్తామని అంచనా’ అని భారత అప్పారెల్ ఎక్స్పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ ఛైర్మన్ ఏ శక్తివేల్ అన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
అష్టాదశ శక్తి పీఠక్షేత్రమైన శ్రీశైలం(Srisailam)లో కుంభోత్సవం వైభవంగా ప్రారంభమైంది. శ్రీ భ్రమరాంబాదేవి అమ్మవారి ఆలయాన్ని నిమ్మకాయలతో అలంకరించారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
జగన్ మామయ్యా.. పాఠశాలల గోడు వినవయ్యా
నాడు- నేడుతో సర్కారు బడుల రూపు రేఖలు మార్చేశామని చెబుతున్నా.. చాలా పాఠశాలల్లో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారు. -
మూడో దశ.. మాటే లేదు
గుంటూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ తగ్గించడంతో పాటు చుట్టూ ప్రధాన రహదారులను కలుపుతూ చేపట్టిన మహాత్మాగాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డులో మూడో దశ నిర్మాణం అర్ధంతరంగా ఆగిపోయింది. -
అడిగే వారేరి... ఆపేవారేరి?
జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో స్థలాలకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. ముంపు ప్రాంతాల్లో అనుమతులు లేకుండా లే అవుట్లు వేస్తున్నారు. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/04/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
తాజా వార్తలు (Latest News)
-
100% వీవీప్యాట్ స్లిప్ల లెక్కింపు కుదరదు: పిటిషన్లు కొట్టేసిన సుప్రీం
-
17 వేల ఐసీఐసీఐ క్రెడిట్ కార్డులు బ్లాక్.. కారణమిదే!
-
అప్పుడు పరుగులు చేసింది కోహ్లీ ఒక్కడే: డుప్లెసిస్
-
శ్రీశైలంలో వైభవంగా భ్రమరాంబాదేవి కుంభోత్సవం
-
పెళ్లి గౌనును రీమోడల్ చేయించిన సమంత.. ఫొటోలు వైరల్
-
బొగ్గు ఓడను విశాఖ పోర్టుకు మళ్లించండి.. అదానీ గంగవరం పోర్టు యాజమాన్యానికి హైకోర్టు ఆదేశం