తెదేపా కార్యాలయానికి కొవిడ్‌ నోటీసు

గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కొవిడ్‌ నోటీసు జారీ చేశారు.

Published : 27 May 2020 13:27 IST

అమరావతి: గుంటూరు జిల్లా మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయానికి రెవెన్యూ అధికారులు కొవిడ్‌ నోటీసు జారీ చేశారు. మహానాడు జరుగుతున్నందున కరోనా నివారణ చర్యలు తీసుకోవాలని నోటీసులో పేర్కొన్నారు. ఈమేరకు మంగళగిరి తహసీల్దార్‌ పేరిట నోటీసు జారీ చేశారు. తెదేపా కార్యాలయ కార్యదర్శి రమణకు ఆత్మకూరు వీఆర్వో నోటీసు అందజేశారు. రెండ్రోజుల పాటు తెదేపా కార్యాలయంలో మహానాడు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని