గ్యాస్‌లీకేజీ బాధితులకు చంద్రబాబు లేఖలు

ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. విశాఖ తెదేపా నేతలు వ్యక్తిగతంగా కలిసి ఈ లేఖలను...

Updated : 15 Jun 2020 10:47 IST

అమరావతి : ఎల్జీ పాలిమర్స్‌ గ్యాస్‌ లీకేజీ ఘటనలో మృతుల కుటుంబాలకు తెదేపా అధినేత చంద్రబాబు లేఖలు రాశారు. విశాఖ తెదేపా నేతలు వ్యక్తిగతంగా కలిసి ఈ లేఖలను అందించనున్నారు. మృతుల కుటుంబాలకు సాంత్వనగా రూ.50 వేల ఆర్థిక సాయం కూడా ఇవ్వనున్నారు.

‘గ్యాస్‌ దుర్ఘటనలో 15 మంది మృతి చెందడం నా మనసును కలచివేసింది. వందల మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందడం చూసి చలించిపోయాను. ఎల్జీ పాలిమర్స్‌ను వైకాపా ప్రభుత్వం వెనకేసుకురావడం విచారకరం. వ్యక్తిగతంగా పరామర్శించడానికి వైకాపా ప్రభుత్వం సహకరించలేదు. రాష్ట్ర ప్రజల కష్టనష్టాల్లో తెదేపా ఎప్పుడూ అండగా ఉంటుంది. బాధిత కుటుంబాలకు రూ.50 వేలు ఆర్థికసాయం బ్యాంకు ఖాతాల్లో జమచేస్తున్నాం’ అని చంద్రబాబు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని